ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి..

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి

# పదో తరగతి టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నగదు పారితోషకం .

నల్లబెల్లి , నేటి ధాత్రి:

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థిక నష్టపోకుండా ఉండాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు . బుధవారం నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చదువుకో తెలంగాణ అనే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు చదువులో ముందుండాలని సూచించారు . ఈ సందర్భంగా డిఎం వర ప్రసాదు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతిభవంతులైన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నగదు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు . రాష్ట్రస్థాయిలో టాపర్ గా వచ్చిన విద్యార్థికి 5 లక్షలు , రెండో స్థానం విద్యార్థికి 3 లక్షల రూపాయల తో పాటు ప్రతి జిల్లా స్థాయి మొదటి స్థానం విద్యార్థులకు 2 రెండు లక్షల చొప్పున,119 నియోజకవర్గస్థాయి విద్యార్థులకు లక్ష రూపాయలు , రాష్ట్రంలోని 6 29 మండల స్థాయిలో ప్రధమ టాపర్లకు పదివేల చొప్పున నగదును శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్నా అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత , కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి ఏ . సునీత నందిగామ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తోపాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ యాదండ్ల రాజు , నల్లబెల్లి డివో పి . శ్రీను , బీడీఈ చరణ్ రాజ్, విజయ్ రెడ్డి లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version