విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో కాలిన్సీ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు రామారావు, విశాల్ గారులు మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 190 మందిక విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్కులు, పెన్నులు ,పెన్సిళ్లు మరియు ఇతర స్టేషనరీ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు భాగ్యశ్రీ గారు అధ్యక్షత వహించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాలింగ్ చేరోస్పేస్ వారు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా జీవితంలో పురోగమించాలని అభిలసించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధిలు,మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించుటకై మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరము విద్యాభివృద్ధికై ఇతోదికంగా సహాయ చేయడం జరుగుతుందని , అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా కావలసిన వసతులను సమకూర్చడంలో మా సంస్థ ముందు ఉంటుందని ఇంకా ఏదైనా సదుపాయాలు అవసరం ఉంటే మాకు తెలియజేసిన, వెంటనే మీకు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల వెంకన్న గారు మాట్లాడుతూ తను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఎరోస్పేస్ ప్రతినిధి రామారావు గారిని అభినందించడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ రాజయ్య గారు మాట్లాడుతూ గత సంవత్సరము పాఠశాలకు అందించిన స్పోర్ట్స్ మెటీరియల్ ద్వారా పలువురు విద్యార్థులను జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులుగా రాణించుటకు ఉపయోగపడిందని
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్,రాజు, ప్రవీణ్ ,విజయభాస్కర్, కళ్యాణి, పద్మ, రాజయ్య, లలిత,చందర్ తదితరులు పాల్గొన్నారు.
