చినిగేపల్లిలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామంలో 59వ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఫ్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో
ఈ పాఠశాల మంజూరైంది. పాఠశాల ప్రారంభోత్సవంలో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువు కొనసాగించాలని వక్తలు సూచించారు. ఈ పాఠశాల మంజూరుపై గ్రామస్తులు, సర్పంచ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, కార్యదర్శి, సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
