జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం…

ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ లో నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టిన దినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం విద్యార్థినీ విద్యార్థులు చాచా నెహ్రూ వేశాధారణ లో పాల్గొని ఆటపాటలతో మరియు ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు వి శ్వేత ఉపాధ్యాయులు సాయి కుమార్ పవన్ కుమార్ మల్లయ్య ఈశ్వరమ్మ సుస్మిత నాగజ్యోతి స్రవంతి మరియు పాఠశాల కరస్పాండెంట్ బి నాగన్న గారు పాల్గొన్నారు,

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం…

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.

విస్డం పాఠశాలలో ముందస్తు జన్మాష్టమి సంబరాలు…

విస్డం ఉన్నత పాఠశాలలో ఉల్లాసభరితంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రాయికల్: ఆగస్టు 14, నేటి ధాత్రి:

పట్టణంలోని విస్డం ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉల్లాసభరితంగా నిర్వహించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థుల చిన్ని గోపిక కృష్ణ వేషధారణలు అందరికీ చూడముచ్చట గొలిపాయి. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. దీనిలో గోపిక కృష్ణులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ కృష్ణం వందే జగద్గురుం-మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించారని, జీవిత సత్యాలను, కర్మ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని తన భగవద్గీత ద్వారా సమాజానికి అందించిన మహా పురుషుడు శ్రీకృష్ణుడు అని అన్నారు.అటువంటి శ్రీకృష్ణుడు అందించిన గీత సారాన్ని ప్రతి ఒక్కరూ వారి మనసులో నిలుపుకొని వాటి నియమాలను పాటిస్తూ మానవ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ ఎద్దండి నివేద రెడ్డి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version