బాల్యానికి బలం బాలామృతం * ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుజాత మొగులపల్లి…

బాల్యానికి బలం బాలామృతం * ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుజాత మొగులపల్లి

నేటి ధాత్రి ప్రభుత్వం

ఉచితంగా పంపిణీ చేసే బాలామృతం చిన్నారులకు వరం లాంటిది ఇందులో అనేక పోషకాలు అనేక పోషకాలు ఉంటాయి పుట్టిన బిడ్డ నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు బాలామృతం అందజేస్తున్నాం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూపర్వైజర్ సుజాత పేర్కొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పార్లపల్లి సెక్టార్ పరిధిలోని పెద్ద కోమిటిపల్లి అంగన్వాడి కేంద్రంలో సోమవారం బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయసు గల చిన్నారులకు అలాగే కిషోర్ బాలికలకు బాలామృతం మరియు చిక్కిప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారంలో అనేక విటమిన్లు పోషకాలు ఉండి పిల్లలకు శారీరక మానసిక అభివృద్ధికి దోహద పడతాయని వివరించారు కిశోర బాలికల రక్తహీనత సమస్యకు గురికాకుండా ఉండేందుకు చిక్కి ప్యాకెట్లను సరిపడా చేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరు అంగన్వాడి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా తల్లులు సమక్షంలో పిల్లలు ఎత్తుకొని బరువు కలిసి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు ప్రతినెల పిల్లల ఎదుగుదలను గమనించడం చాలా అవసరం అని మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని తల్లులకు సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పుష్పలత స్కూల్ టీచర్ సుమలత తల్లులు పిల్లలు కిశోర బాలికలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.

. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.

మొగుళ్ళపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోనిగుడిపహాడ్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొనిఆరోగ్యలక్ష్మి కమిటీ మెంబర్స్ ని ఎన్నుకొని మీటింగు నిర్వహించడం జరిగింది. చైర్మన్గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఆరోగ్య లక్ష్మి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యముఅంగన్వాడీ కేంద్రంలో జరిగే సేవలు గూర్చి మరియు ఆహార పదార్థాల పంపిణీ, అనుబంధ పోషకాహారం, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, 1000 రోజుల ప్రాముఖ్యత గురించి ఆరోగ్య సేవలు మరియు గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిశోర బాలికలకు చిక్కి ప్యాకెట్స్ , ఇమినైజేషన్ ,పూర్వ ప్రాథమిక విద్య ,విషయాల గూర్చి చర్చించుకోవడం జరిగింది. సర్పంచ్ , ఉప సర్పంచ్ గ్రామస్తులు,పెద్దలందరూ అంగన్వాడీ స్థలం కోసం చర్చించుకోవడం జరిగింది.ఈ కమిటీకి కన్వీనర్ గా అంగన్వాడి టీచర్ ఉంటారు.మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గర్భిణీలు ,బాలింతలు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లల తల్లులు, మూడు నుండి ఆరు సంవత్సరముల పిల్లల తల్లులు ,కిశోర బాలికలు,, అంగన్వాడి టీచర్ పద్మ, వివో సభ్యులు ఆశా వర్కర్ , సునీత,ఆయా,తల్లులు పాల్గొన్నారు

అంగన్వాడి కేంద్రాలు సమయపాలన పాటించాలి.

అంగన్వాడి కేంద్రాలు సమయపాలన పాటించాలి.

సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామ సెక్టార్ మీటింగ్ ఓడితల లక్ష్మీ అంగన్వాడి టీచర్ కేంద్రంలో సమావేశము ఏర్పాటు చేసుకొవడం జరిగింది, జయప్రద సూపర్వైజర్ ఎజెండా అంశాలు, సమయపాలన, పిల్లల బరువు, ఎత్తు, పోషకాహార పంపిణీ, బాల్యవివాహాలు, గృహ సందర్శన, పిల్లల టీకాల గూర్చి రివ్యూ చేయడమైనది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి భగవాన్ , ఉపసర్పంచ్ కాంపల్లి శ్రీకాంత్ హాజరై పిల్లలకు బాలమృతం ,ఎగ్స్ పంపిణీ చేయడం జరిగింది. స్కూల్ హెచ్ఎం మహేందర్ మాట్లాడుతూ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రైమరీ స్కూల్స్ పంపించినట్లయితే నేటి బాలలే రేపటి పౌరులుగా అన్ని రంగాలలో ముందంజలో ఉంచుతామని అందుకు ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లకుండా సహాయ సహకారాలు అందించాలని కోరి ఉన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ స్కూల్స్ ఎటువంటి సహాయ, సహకారాలుఅవసరం ఉన్న అందిస్తామని తెలిపినారు.25.మంది అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కరు సుమలత హాజరైనారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version