ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం (మాచునూర్)లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో సోమవారం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహిం చారు. ప్రధానోపాధ్యాయురాలు మహేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఉన్నత విద్య లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాటు ఉపా ధ్యాయులు హరిప్రకాష్ శుక్ల వసంత్, రిషబ్, చతుర్వేది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
