మూడు సంవత్సరాల తర్వాత అమ్మ ఒడికి.

మూడు సంవత్సరాల తర్వాత అమ్మ ఒడికి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

ఇంటి నుండి తప్పిపోయిన మూడు సంవత్సరాల పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన మందమర్రి బ్లూ కోల్ట్ పోలీసులు

పచ్చిక రాజు, పచ్చిక జమున సి ఎస్ ఐ చర్చి, మందమర్రి మార్కెట్ లో గల వారి కుమార్తె మూడు సంవత్సరాల ఆరాధ్య వాళ్ళ అమ్మగారు ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటి ముందర ఆడుకుంటూ, తప్పిపోయి మందమర్రి మార్కెట్ లోని సాయిబాబా గుడి వద్దకు రాగా పాపను గమనించిన స్థానికులు పాపా వివరాలు తెలుసుకోనగా పాప వివరాలు తెలుపకపోయేసరికి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేయగా బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు చిరంజీవి, శ్రీనివాస్ లు పాప యొక్క తల్లిదండ్రుల గురించి చుట్టుపక్కల ఏరియాలలో వేతగా ఎలాంటి ఫలితం లేకపోయేసరికి, మందమర్రి ఎస్సై ఆదేశాల మేరకు పాప యొక్క ఫోటోను సోషల్ మీడియాలో స్థానిక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయగా, పాప తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ కు రాగా, ఆరాధ్యను వాళ్ళ తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version