కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం.

కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో పితృదినోత్సవం సందర్భంగా  నాన్నకు ప్రేమతో. కవితా సంకలనం పుస్తకం లో నాన్న గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ (ఉషోదయ భానుడు నాన్న)అనే అంశంపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి కవితా గానం చేసినందుకు గాను సభఅధ్యక్షులు, నాన్నకు ప్రేమతో కవితా సంపుటి సంపాదకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ముఖ్య అతిథి ఎన్వీ రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథులు కృషిరత్న బుస్స శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మారెడ్డి, సమీక్షకులు
కూర చిదంబరం, ఆధ్యాత్మికవేత్త బొమ్మకంటి కిషన్,తెలుగు సాహితీవేత్త ,విమర్శకులు
డాక్టర్ మోతుకుల నారాయణ గౌడ్ చేతుల మీదుగా ప్రముఖ తెలుగుసాహితీవేత్త,
కవి,రచయిత్రి శ్రీమతి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (ఝాన్సీ) ఆమె తల్లి శ్రీమతి తాళ్లపల్లి బాలవ్వలను ఆత్మీయతతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవయిత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version