మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌

`అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం

`ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం

`అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు

`ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు

`నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు

`అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది

`త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది

`అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి

`ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు

`తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు

`చిన్న మిల్లర్లు తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు

`తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చు

`మిల్లర్‌కు సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం

`మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందొచ్చు

`ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

`నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు

`రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రైతుల వడ్లను మాయం చేసినట్లు ఆరోపణలున్న హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలుంటాయని సివిల్‌ సప్లయ్‌ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఆయన మాట్లాడుతూ ఎప్పటికైనా రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. త్వరలోనే చర్యలుంటాయన్నారు. నీతిగా చేయాల్సిన వ్యాపారంలో కొంత మంది అక్రమాలకు పాల్పడుతుంటారన్నారు. గతంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో,పై స్థాయి దాక వివరాలు అందకపోవడంతో వారి ఆటలు సాగాయి. దురదృమేమంటే కొంత మంది అధికారుల ప్రోద్బలం కూడా అక్కడక్కడ తోడవ్వడంతో అక్రమాలకు అవకాశం కలిగింది. కాని పరిస్థితులు మారాయి. ఎప్పటిలాగే ఇప్పుడూ తమ ఆటలు చెల్లుతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు చేసిన తప్పులే కాదు, గతాన్ని కూడా తవ్వి తీసే పని మొదలౌతుంది. హన్మకొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతోందన్నారు. ఇకపై రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసే మిల్లర్‌ను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు. రైతులను మోసం చేయడం చిన్న తప్పు అనుకుంటున్నారు. కానీ పెద్ద నేరమని తెలియక చేసినా? తెలిసి చేసినా శిక్షార్హులౌతారు. రైతులను మోసం చేసిన జగన్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి అధికారులుంటే ఒక్క వడ్ల గింజ కూడా మోసం జరగదన్నారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సునిశిత పరిశీలనా జ్ఞానాన్ని కమీషనర్‌ చౌహాన్‌ అబ్బురపడిపోయారు. అధికారులకేం తెలుసు అని కొంత మంది అక్రమ మిల్లర్లు ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. కానీ ఉద్యోగ నిర్వహనలో శాఖల్లో మెలకువలు తెలుసుకొని ముందుకెళ్లే అధికారులు కూడా వుంటారని రుజువైంది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులందరినీ కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. అధికారులు సమిష్టిగా, నీతి వంతంగా, కార్యదక్షత చూపిస్తే ఎంతో బాగుంటుందన్నారు. ఖమ్మం జిల్లా అధికారుల టీం వర్క్‌ భేష్‌ అన్నారు. అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శమయ్యారని కొనియాడారు. ఏ శాఖ ఉద్యోగులైనా సరే తమ కర్తవ్య నిర్వహణ ముఖ్యమని సూచించారు. ఇకపై అధికారులెవరైనా సరే అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇక నీతి, నిజాయితీ వ్యాపారం చేసే మిల్లర్లను అధికారులు ఎవరైనా వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వానికి అలాంటి మిల్లర్‌ తోడే అవసరమన్నారు. రైతులను మోసం చేసే వారిని పక్కన పెట్టుకొని, నీతిగా వ్యాపారం చేసే మిల్లర్లను ఇబ్బందుల పాలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైతే అక్రమ మిల్లర్లు ముద్రపడ్డారో, వారికి సహకరిస్తున్నారో అలాంటి వారి చిట్టా అంతా నా దగ్గర వుందన్నారు. త్వరలోనే కార్యచరణ వుంటుందన్నారు. అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి అనే విషయాన్ని వెలులోకి తెచ్చిన నేటిధాత్రి దిన పత్రికను చౌహాన్‌ అభినందించారు. ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు అన్నారు. ఇకపై తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న మిల్లర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని నేటిధాత్రి దృష్టికి వచ్చినా వివరాలు అందించాలని కోరారు. అంతే కాకుండా నా వద్దకు నేరుగా రాలేక, ఇబ్బందులు పడుతున్న వారిని మీరు చొరవ తీసుకొచ్చినా సరే అని నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు ఇకపై తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు అని కూడా కమీషనర్‌ స్పష్టం చేశారు. తన కార్యాలయానికి తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణలో వున్న మిల్లర్లందరికీ సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందవచ్చని సూచించారు. అధికారులెవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు తెలిపారు.

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

హైదరాబాద్ :నేటిధాత్రి

 

car accident

కన్నీళ్లు మిగిల్చిన జన్మదిన వేడుక కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లి వస్తుండగా..
రోడ్డు ప్రమాదం ముగ్గురు అన్నదమ్ముల మృతి..
మరో నలుగురికి గాయాలు

 

యాచారం, న్యూస్టుడే: వారంతా స్నేహితులు.. పాతికేళ్లలోపు యువకులు.. వారిలో ఒకరి పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామానికి చెందిన వాసా సాయితేజ(23), వాసా పవన్ కుమార్(25), వాసా రాఘవేందర్ (24), వాసా శివకుమార్, ఇ. సాయికుమార్ వరసకు అన్నదమ్ములు. మూసాపేటలో నివాసం ఉండే ఎం.సందీప్, శివకుమార్ వారి మిత్రులు. వీరందరూ హైదరాబాద్లో వేర్వేరు చోట్ల ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాసా శివకుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం అందరూ కలిసి నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం వైజాగ్ కాలనీలోని కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లారు. పొద్దుపోయే వరకూ అక్కడే ఆనందంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో.. రాత్రి 2 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా యాచారం మాల్ పట్టణం దాటిన కొద్దిసేపటికి వీరు ప్రయాణిస్తున్న కారు..ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు నుజ్జయింది. వాసా సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్కుమార్కు మూడేళ్ల కుమార్తె ఉందని, ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి అని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా అవివాహితులని వెల్లడించారు.

రామడుగులో “భూ” బకాసురులు

రామడుగులో “భూ” బకాసురులు

 

అధికారుల అండదండలతో చెలరేగిపోతున్న కబ్జా రాయుళ్లు

మండలంలోని ఒక గ్రామంలో కొత్తదంద మొదలైంది

 

హద్దులు పెట్టరు మోఖా ఉండరు

 

కోట్లు చేతులు మారుతున్న వైనం.

కోనుగోలు చేసి ఖాస్తు చేస్తున్న అమాయక ప్రజల భూములను కబ్జా చేయాలనుకుంటున్న వైనం

 

రహదారులను సైతం పట్టా చేసిన వైనం

 

తప్పు చేసింది ఒకరైతే బలాయ్యేది అమాయక ప్రజల?

వారంలోనే హద్దులు పూర్తిస్థాయిలో మారుతున్న వైనం

 

వీరికి సహకరిస్తున్న మండల రెవెన్యూ అధికారులు

 

ఒకే హద్దులతో రెండు డాక్యుమెంట్ ఎలా వచ్చాయి?

పూర్తి వివరాలతో త్వరలో మీ “నేటిధాత్రి”లో

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది.

ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 38 పిటిషన్లలో సుమారుగా 45,00,000/- లక్షల మోసాలు పాల్పడుతూ భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి.

 

అని నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది అని తెలిపారు .

అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

 

ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

బొమ్మ పూర్ క్వారీలో లారీకి ఆరు వందలులు వసూల్.

వేబిల్ వద్ద 200, లోడింగ్ కు 300,

కాంట వెయ్యకుండానే ప్రతి లారీకి 600 చొప్పున తీసుకొని “వేబిల్ “ఇచ్చిన లారీలు.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

లారీ కాటా పై వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళితే సరిపోతుంది, వే బిల్,రెడీ.

అడిగే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ వ్యక్తులు దాడికి సిద్ధంగా ఉంటారు.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ డోంట్ కేర్ అనేలా కనబడుతుంది.

నా లారీ లోడ్ అయిపోయింది ఇప్పటికీ 600 ఇచ్చాను ఓ డ్రైవర్.

మహాదేవపూర్, నేటిధాత్రి:

ప్రభుత్వ ఆదేశాలు ఇసుక పాలసీ ఈ రెండు క్వారీల్లో మాత్రం అమలు పరచడం అసాధ్యంగా మారింది. ఇసుక లోడింగ్ వద్ద ఉన్న.” పోక్లైన్’ డబ్బాల నిండా పైసలు జమ చేసుకోవడం, వేబిల్ తోపాటు సీరియల్ వద్ద మరో రెండు రెండు వందల రూపాయలను వసూలు చేస్తున్నారు, అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కేవలం ఇసుక లారీల్లో నింపి, కాంట చేయకుండానే బేబీల్లో లారీ యొక్క సైజులు పట్టి వే బిల్ ,లో ఇన్ని టన్నుల ఇసుక అని వేయడం జరుగుతుంది. కాటా చేయకుండా లారీల రవాణా వ్యవహారం అదనపు బకెట్ ఇసుక లారీల్లో నింపడం జరుగుతుందని స్పష్టం కావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రెండు క్వారీల్లో టీఎస్ ఎండిసీ శాఖ చర్యలకు బదులు, క్వారీ కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుంది.

తాడ్పాల్ వేసుకుంటున్న 600 తీసుకున్నారు వేబిల్ వద్ద 300 ఇచ్చాను డ్రైవర్.

 

లోడింగ్ పుక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం బొమ్మ పూర్ గ్రామం పేరుతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన, బొమ్మ పూర్ ఒకటవ నంబర్, అలాగే ఎలికేశ్వరం రెండవ నంబర్, పేర్లతో గత సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ రెండు ఇసుక క్వారీలు అక్రమ ఇసుక రవాణాకు పెద్ద మొత్తంలో తెరలేపడం జరిగింది, ప్రభుత్వం ఉన్నత అధికారులు ఈ రెండు ఇసుక క్వారీల పై ప్రత్యేక నిఘా పెట్టి ఉన్నత అధికారులు పర్యవేక్షించడం కూడా జరిగింది. అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవ అక్రమ రవాణా పై అడ్డుకట్ట వేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం మాత్రం అధికారుల ఆదేశాలు ఇసుక పాలసీ ను తుంగలో తొక్కి, టీఎస్ ఎండిసీ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని, అక్రమ వసూళ్ల నేటికీ కొనసాగిస్తుంది.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

మహాదేవపూర్ మండల పరిధిలోని పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేస్తున్న బొమ్మ పూర్, ఇలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న ఈ రెండు క్వారీలు, టి ఎస్ ఎం డి సి సిబ్బంది అధికారులను తమ గుమస్తాగా మార్చుకొని, ఇసుక లోడింగ్ వద్ద ప్రతి లారీకి 300 రూపాయల వసూళ్లు చేయడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ కొరకు సీరియల్ వద్ద మరో 200 నుండి 300 వరకు, అలాగే వేబిల్ ఇచ్చే క్రమంలో మరో 200 రూపాలను లారీల నుండి తీసుకోవడం జరుగుతుందని డ్రైవర్లు నిర్భయంగా చెప్పడం జరుగుతుంది, లోడింగ్ పాయింట్ వద్ద లోడ్ చేసి అటువంటి ఫోక్లైన్ లో ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేసి, లోడింగ్ కు వచ్చే, ప్రతి లారీ వద్ద 300 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది, కొందరు డ్రైవర్లు 200 ఇచ్చిన లోడింగ్ చేసే ప్రసక్తి లేదని 300 ఇస్తేనే లోడింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం కొత్త రకమైన అక్రమానికి తెరలేపింది, గత కొన్ని రోజులుగా లోడింగ్ చేసుకొని వచ్చిన లారీ కాటా పైకి వెళ్లి, “సెల్యూట్ కొట్టి” వెళ్లిపోవాల్సిందే లారీలో ఎంత ఇసుక ఉంది, ఏమైనా ఎక్కువ ఇసుక వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అని కాంట చూసే ప్రసక్తి లేదు, లారీ సైజును బట్టి లారీలో వచ్చిన టన్నులను బేబీల్ లో వేయడం జరుగుతుంది, కాంట రిసిప్ట్ లాంటివి ఏమీ ఇవ్వడం లేదు, అడుగుతే కరెంటు లేదు, బ్యాటరీ ఇంవేటర్ చెడిపోయింది అని సమాధానం చెప్పడం, గట్టిగా ప్రశ్నించే పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కు సంబంధించిన కొందరు ప్రశ్నించే వారిపై, లేదా ఫోటో వీడియో లాంటి వాటిని చిత్రీకరిస్తామని ప్రయత్నించిన ఆ డ్రైవర్లకు ఇతరులపై దాడికి సిద్ధంగా కొందరిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టంగా కనబడుతుంది.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ “డోంట్ కేర్” అనేలా కనబడుతుంది.

ఉన్నత అధికారుల పర్యవేక్షణ అనంతరం కూడా బొమ్మ పూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల అక్రమాలు, ఆగడం లేదంటే దీని వెనుక కారణం ఎవరు, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి, వారితో కలిసి వసూళ్లు చేయడం జరుగుతుంది అంటే, దీని వెనుక అధికార యంత్రాంగం హస్తము కూడా ఉందని స్పష్టమవుతుంది. తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఎండిసి, జిల్లా కలెక్టర్ భూపాలపల్లి ఈ రెండు ఇసుక క్వారీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అక్రమాల పై డ్రైవర్ల తో వివరాలు సేకరించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు..

— రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు

నిజాంపేట: నేటి ధాత్రి

ఎదురుదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కోని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగింది. పోలిసుల వివరాలు.. పోతారెడ్డి కి చెందిన చింతకింది భాను పని నిమిత్తం పులిమామిడికి బైక్ పై వెళ్తున్న క్రమంలో నార్లపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నిర్లక్ష్యం గా డ్రైవింగ్ చేస్తూ టక్కరి చేసినట్లు భాను చిన్నాన్న రాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బెట్టింగ్‌ బేవార్స్‌ గాళ్లు?

 

`తుక్కు రేగ్గొడితేనే గాని దారికి రారు!

`ప్రమోషన్‌ పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

`11 మందిపై కేసు నమోదు?

`సినీ పెద్దలెంతో మంది ప్రమోటర్లుగా వున్నారు?

`వాళ్లకు నోటీసులతో సరిపెడతారా?

`వాళ్లను కూడా అరెస్టులు చేస్తారా?

`చిన్న చిన్న చేపల మీదనే ప్రతాపం చూపిస్తారా?

`కొందరు సినీ పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

`హీరోలు రానా, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి వాళ్లున్నాంటున్నారు.

`టీవి ఛానళ్లలో పేరు పొందిన యాంకర్లు వున్నారు.

`మంచు లక్ష్మి లాంటి వాళ్లు కూడా ప్రమోట్‌ చేశారంటున్నారు.

`మరి వాళ్లందరికీ నోటీసులు ఎప్పుడు అందిస్తారు.

`అరెస్టు చేయబడిన వారు తమకేం పాపం తెలియదంటున్నారు.

`వర్షణి, శ్రీముఖిలపై కేసులు నమోదయ్యాయి.

`ఇప్పటి వరకు 25 మంది సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వున్నాయి.

`దేశ వ్యాప్తంగా ధోని లాంటి క్రికెటర్లు కూడా బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేశారు.

`దేశంలో కొన్ని వేల మంది బెట్టింగ్‌ యాప్‌ లను ప్రమోట్‌ చేశారు.

`కోట్లాది మంది నష్టపోయారు.

`కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్‌ యాప్‌లకు అనుమతులున్నాయి.

hyderabad,Netidhathri: 

 అడ్డదారిలో అక్రమార్జన సాగించాలని చూసే వారు సమాజంలో రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశలు వారికి తెలియకుండానే ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. రూపాయి పెట్టుబడికి పది రూపాయల లాభం అనగానే ఆశపడుతున్నారు. సంపాదన సంగతి పక్కన పెడితే డబ్బులు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అప్పుల పాలౌతున్నారు. ఆస్థులు పొగొట్టుకుంటున్నారు. జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నాడు. బెట్టి ఆప్‌లు పెట్టిన వాడు బాగానే వుంటున్నాడు. ఆప్‌లను ప్రమోట్‌ చేస్తున్నవాడు సంతోషంగానే వుంటున్నాడు. ఆడిన వాడు తిరుక్షవరమైపోతున్నాడు. betting app లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్లు తెలంగాణలోనే కొన్ని లక్షల మంది వున్నారు. ఇప్పుడు లబోదిబో మంటున్నారు. police స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది కేసులు ఎదుర్కొంటూ jail పాలౌతున్నారు. influencer గా మారి అమాయక జనాన్ని ముంచిన వాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. అయితే చట్టాల మీద అవగాహన లేక ప్రచారం చేసిన వాళ్లు కొంతమంది. కానీ సినీ రంగంలో ఉన్నత స్థానాలలో వున్న వారు కూడా బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేశారన్నదే వెలుగులోకి రావాల్సి వుంది. చానల్‌ యాంకర్లు, చిన్న చిన్న పాత్రల ద్వారా నిత్యం ప్రేక్షకులను అలరించే వాళ్లు సంపాదన మీద మక్కువతో చేశారంటే అర్థం వుంది. కానీ నిత్యం నైతిక విలువల గురించి మాట్లాడే ప్రకాశ్‌ రాజ్‌ కు చట్టాలు తెలియవా? శిక్షలు పడతాయని తెలియదా? betting app ల ప్రమోషన్‌ నేరమని తెలియదా? వాటి వల్ల ప్రజలకు మేలుకన్నా నష్టమే ఎక్కువ అని తెలియనంత అమాకుడా? సినిమాలలో నటించేందుకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలు ఇదేం పాడు పని. హీరోలంటే ఆదర్శంగా వుండాలి. లక్షలాది మంది అభిమానులు వారిని ఆరాధిస్తుంటారు. సినిమాలలో మంచికి ప్రతి రూపంగా కనిపించే హీరోలు నిజ జీవితంలో విలన్‌లుగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది. హీరోలుగా చేస్తే కోట్లు వస్తాయి. నిర్మాతలుగా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మిస్తారు. betting app ల ప్రమోషన్‌తో అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా? సామాన్యులకు లేని పోని మాటలు చెప్పి, ఊహల పల్లకి ఎక్కించి బెట్టింగ్‌ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకునేలా చేయడం నేరం కాదా? పైగా telangana, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాలలో బెట్టింగ్‌ యాప్‌లు నిషేధం. వాటి promotion సాగించడం చట్టరిత్యా నేరం. అందుకు సెక్షన్లు …..నమోదు చేస్తారు. కేసులను ఎదుర్కొంటారు. జైలు పాలౌతారు. ఈ మాత్రం అవగాహన ఇతర యూ ట్యూబర్లకు అవగాహన లేదనుకుంటే అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలలో బెట్టింగ్‌ యాప్‌లు చిచ్చుపెట్టాయి. అందులో పెట్టుబడి పెట్టిన అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. nalgonda, warangal  జిల్లాలలో ఇప్పటికే అనేక మంది యువకులు అరెస్టయ్యారు. కేవలం ఈజీ మనికి అలవాటు పడడమే ఇందుకు కారణం. ఇక బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ చేసిన వారికి పెద్ద మొత్తంలో అందుతున్నట్లు సమాచారం. తాజాగా పోలీసుల విచారణలో vishnupriya కీలక విషయాలు వెల్లడిరచించినట్లు సమాచారం. ఆమె ఇప్పటి వరకు సుమారు 25 app లను promote చేసినట్లు అంగీకరించారు. ఒక్కో యాప్‌ నుంచి సుమారు లక్ష వరకు లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో లాటరీలున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బాగ్యలక్ష్మి బంపర్‌ లాటరీ అని వుండేది. దేశంలో కేరళ లాటరీ ఫేమస్‌. ఈ మధ్య విడుదలైన lucky Bhaskar ‌ సినిమాలో కూడా లాటరీ గెలుపులో మతలబు ఏముంటుందనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. అయినా ఇప్పటికీ మహారాష్ట్ర తో పాటు అనేక ఉత్తరాధి రాష్ట్రాలలో సింగిల్‌ నెంబర్‌ లాటరీలున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడో బ్యాన్‌ చేశారు. ఆ తర్వాత మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. చైన్‌ సిస్టం మార్కెటింగ్‌ మోసం వల్ల లక్షల కుటుంబాలు నష్టపోయాయి. అయినా ఇప్పటికీ వాటి ఆనవాలు కనిపిస్తూనే వుంది. అయితే YouTube channel‌ వచ్చి బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారానికి కేంద్రమైంది. పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన యూట్యూబర్లు, వెబ్‌ సిరీస్‌లు రూపొందించే వాళ్లు, నటీనటులు ఈ యాప్‌ల ప్రమోషన్‌ మొదలుపెట్టారు. యాప్‌ల ప్రమోషన్‌ కోసమే వెబ్‌ సిరీస్‌లు తీస్తున్న సంస్థలున్నాయి. నటీనటులున్నారు. వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. మన తెలుగు రాష్టాలలోనే కొన్ని వేల మంది వున్నారు. మరి అంత మందికి నోటిసులు పంపే అవకాశం వుంటుందా? నాలుగు రోజులు హడావుడి చేసి కేసులను అటకెక్కిస్తారా? ఎందుకంటే గతంలో డ్రగ్స్‌ కేసుల విషయంలో ఇలాగే హడావుడి చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియదు. దాని పురోగతి ఎంత వరకు వచ్చిందో సమాచారం వుండదు. అలాగే బెట్టింగ్‌ యాప్‌లను దేశ వ్యాప్తంగా నిషేదిస్తారో లేదో చూడాలి. వాటి ప్రమోషన్‌ ఆగిపోతుందో లేదో కొంత కాలం గడిస్తే గాని తెలియదు. పైగా ఈ కేసు కోర్టులలో నిలుస్తుందో లేదో కూడా న్యాయ నిపుణులు చెప్పాలి.

betting app case in telangana many actors names in FIR

బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు..

అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి (ఐ.పి.ఎస్) హెచ్చరిక

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

ఈరోజు అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ఆన్‌లైన్ బెట్టింగ్ ,గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ లను ప్రమోట్(ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలి. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ లు, బెట్టింగ్ ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు. అని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి ఐ.పి.ఎస్ తెలిపారు. అంతేకాకుండా యువత, మరియు విద్యార్థులు చదువు మీద దృష్టి సాధించి, తమ తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత కొలువుల కోసం పాటుపడాలని జిల్లా ఎస్పీ గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని,అక్రమ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ఆడిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.ఈ మెరకు జిల్లా ఎస్పీ సోషల్ మీడియా పై అవగాహన కార్యక్రమం మరియు శనివారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.

రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.

*రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం..

*కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్…

*ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు..

*కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13:

తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ అదేశాల మేరకు డీఎస్పీ (ఆపరేషన్స్)
జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ కేఎస్ కే లింగాధర్ టీమ్ స్థానిక అటవీ అధికారులు వడమాలపేట, నారాయణవనం ఎఫ్బీఓలు కుమారస్వామి, నూర్ అబ్జలాల్ ల సహకారంతో పుత్తూరు మీదుగా నారాయణవనం వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. బుధవారం తిరుమలకుప్పం మెయిన్ రోడ్డులోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన ఇద్దరు వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటనే స్పందించి, వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 45లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం స్వాధీనం..

రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

*ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు..

*రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం..

తిరుపతి నేటి ధాత్రి :

కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నించి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

వైద్యానికి డబ్బులు లేవని యువతీ ఆత్మహత్య.!

వైద్యానికి డబ్బులు లేవని మనస్థాపం చెంది యువతీ ఆత్మహత్య.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి 19 ఇంట్లో ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తండ్రి సదానందం పిర్యాదు మేరకు శవపంచనామా చేయడం జరిగింది. పల్లవి, ఆమె తల్లి విజయ ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెండవ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏడి.

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏడి

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

చౌటుప్పల్: చౌటుప్పల్ కేంద్రం విద్యుత్ ఏడి కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారుల దాడులు….. ఓ రైతు నుండి 70000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏడి శ్యాం ప్రసాద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు…..పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి..

కోహిర్ మండల్లో మట్టి అక్రమ తరలింపు. పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యాపారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. మరియు రెవెన్యూ శాఖ మరియు మన్నింగ్ శాఖ అధికారుల మౌనం అక్రమ గని కార్మికుల మనోధైర్యాన్ని పెంచింది. ఇటీవల, శుక్రవారం రాత్రి, మాద్రిలోని కోహిర్ మండల్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాల సమయంలో, మాద్రి గ్రామ ప్రజలపై మట్టి మాఫియా కర్రలతో దాడి చేసి, అక్రమ మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నప్పుడు వారిని గాయపరిచింది. గాయపడిన వారిలో ముహమ్మద్ వసీం పటేల్, ముహమ్మద్ అజీం మరియు ఇతరులు ఉన్నారు. మరియు ఈ దాడిలో ముహమ్మద్ వసీం పటేల్ తీవ్రంగా గాయపడ్డాడు మరియు వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరియు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరియు గాయపడిన వారి వివరాల ప్రకారం, వక్ఫ్ భూమిలో అక్రమంగా పంట కోతలు జరుగుతున్నాయని, అదే సమయంలో, పంట కోస్తున్న వారిని వివరాలు అడిగినప్పుడు, వారిపై కర్రలతో దాడి చేశారని తెలుస్తోంది. మరియు ఈ అక్రమ మైనింగ్ రెండు వైపుల నుండి కొనసాగుతోంది. మరియు దాడిలో గాయపడిన వారు శనివారం కోహిర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరియు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు ఈ అక్రమ మైనింగ్‌ను ఆపాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

#ఎస్సై వి గోవర్ధన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు.!

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక గూర్చి ఓదెల తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని నేరస్తులైన పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేష్, కోర్రి భాస్కర్, రాజన్ కుమార్ లు ఉనుకమరియు ఇసుక ను కలిపి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిలువచేసి హైదరాబాదుకు తరలించడానికి సిద్దం చేస్తున్న నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేసిన, తరలించిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్..

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

అక్రమ సంబంధమే దాడికి కారణమని తేల్చిన పోలీసులు

ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య

భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం

కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం

ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి రోడ్డులో వెళ్తున్న కారును అడ్డగించి, సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేసిన దుండగులు

నేటిధాత్రి వరంగల్.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు రాజ్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ పై దాడి సంచలనం కలిగించిన కేసులో, వారం రోజుల్లోనే చేదించిన మిల్స్ కాలనీ పోలీసులు. వరంగల్ లో యువ వైద్యుడు డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు వరంగల్ మిల్స్ కాలని పోలీసులు. డాక్టర్ పై దాడి ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధమే డాక్టర్ ప్రాణాలను తీయాలని వేసిన పన్నాగం బయటపడింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేయగా, దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు మిల్స్ కాలని పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ భార్య పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

అసలేం జరిగింది?

crime

 

ఫిబ్రవరి 20న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై దాక్టర్ సుమంత్ పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించినారని బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మిల్స్ కాలని పోలీసులు. దాడికి పాల్పడిన వారు ఎవరు.? వైద్యుడు సిద్దార్థ్ ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్ పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేశారు. అయితే.. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య

హంటర్ రోడ్డులో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కి, వరంగల్ షిరిడీ సాయి నగర్ కి చెందిన ఫ్లోరా మరియా అను ఆమెతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత 2018 సంవత్సరంలో సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్ రెడ్డి బందువుల విద్యాసంస్థలు ఉండగా, వాటిని చూసుకోవడం కోసం భార్య భర్త లు సంగారెడ్డి కి షిఫ్ట్ అయితారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పి.ఎచ్.సి లో, కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా వారి బంధువుల స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండేది.

కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం

ఫ్లోరా బరువు తగ్గడానికి సంగారెడ్డి లోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. ఆ జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ అనే అతనితో పరిచయం ఏర్పడుతుంది. జిమ్ ట్రైనింగ్ పేరిట అయినా పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధంనకు దారితీసింది. వీరి అక్రమ సంబంధం గురించి డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగానే, భార్యా భర్తలకు గొడవలు జరిగాయి. ఈ గొడవల వలన డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్ కి షిఫ్ట్ చేసినారు. తరువాత 2019 సంవత్సరంలో సదరు ఫ్లోరా మరియా, ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం పొంది, జనగాం జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ వుండేవారు. తర్వాత ఆ కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ కు మారడంతో, డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటూ, కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ, ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు. సదరు ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ నీ ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయంలో వారిద్దరికీ తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దానితో సదరు ఫ్లోరా మరియా, ప్రియుడు శామ్యూల్ లు కలిసి, డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తరువాత శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కి తమ మర్డర్ ప్లాన్ విషయం చెప్పి, డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కి సహకరిస్తే నీకు సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్తాడు. దానికి సదరు ఆ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు. తరువాత అందాదా 15 రోజుల క్రితం ఒక్క లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, తన ప్రియుడు శామ్యూల్ కి ట్రాన్స్ఫర్ చెయ్యగా, అందులో నుండి ఖర్చులకు 50వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి ఇస్తాడు.

crime

 

భట్టుపల్లి రోడ్డులో మర్డర్ ప్లాన్

నిందితులు వారి మర్డర్ ప్లాన్ లో భాగంగా తేదీ20.02.2025 రోజున మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక సుత్తిని కొనుగోలు చేసి, హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ యొక్క రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి, కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం, డాక్టర్ సుమంత్ రెడ్డిని సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని, రెక్కీ చేసుకుని వాళ్లు అనుకున్న పథకం ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి వేళ, తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట కు, వెళ్తున్న క్రమంలో తన వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో ఎస్ఆర్ స్కూల్ దాటిన తరువాత ఉన్న, చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా, అట్టి చీకటి ప్రదేశంలో అదే అదునుగా భావించిన శామ్యూల్ తనతో తెచుకున్న సుత్తితో కారు వెనుక ఇండికేటర్ ను కొడుతాడు. ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా, శామ్యూల్ అతని స్నేహితడు రాజ్ కుమార్ లు, సదరు డాక్టర్ సుమంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చి, అతడు చనిపోయాడు అని భావించి అక్కడి నుండి వారు పారిపోతారు.

వారం రోజుల్లో కేసును ఛేదించిన వరంగల్ పోలీసులు

బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ కేసును వరంగల్ ఏసిపి నంది రామ్ ఆధ్వర్యంలో, మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నం, టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, మిల్స్ కాలనీ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జెలెందర్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎండి గౌస్, సల్మాన్ ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ నగేష్ లు నిందితుల కోసం ప్రత్యక బృందాలుగా ఏర్పడి, సంచలనం సృష్టించిన కేసులోని నిందితులైన సంగారెడ్డి కి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ (ఏ1), డాక్టర్ భార్య గాదె ఫ్లోరా మరియా (ఏ2), వీరికి సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (ఏ3) లను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన పోలీస్ అధికారులను వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ అభినందించారు.

వేలాల జాతర గుట్ట పై అగ్ని ప్రమాదం.!

వేలాల జాతర గుట్ట పై అగ్ని ప్రమాదం

మంటలను ఆర్పి వేసిన అటవీ సిబ్బంది-తప్పిన పెను ప్రమాదం

నిర్లక్ష్యం వద్దని అటవీశాఖ విన్నప

జైపూర్,నేటి ధాత్రి:

fire accident

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వేలాల గుట్ట పై అడవిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అటవీ సిబ్బంది వెంటనే ఫైర్ బ్లోయర్ సహాయం తో అర్పివేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేలాల గుట్ట పై అటవీ ప్రాంతంలో గట్టు మల్లన్న జాతర జరుగుతోంది. ఈ సందర్బంగా ఇక్కడ గుట్ట పై నిద్రించడానికి చాలా మంది భక్తులు విచ్చేసారు.రాత్రి ఇక్కడికి విచ్చేసిన వారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం వల్ల అడవిలో మంటలు చెలరేగాయి.రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వేలాల బీట్ అధికారి శ్రీధర్ మంటలను గమనించి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) వాచర్ సాయికిరణ్ ను ఫైర్ బ్లోయర్ తీసుకు రమ్మని చెప్పారు. వెంటనే ఫైర్ బ్లోయర్ తీసుకు వచ్చి మంటలు విస్తరించ కుండా వాటిని అర్పివేశారు.ప్రమాద స్థలాన్ని రాత్రి ఎఫ్ ఎస్ ఓ భగవంత్ రావు పరిశీలించారు.ఒక వేళ ఈ మంటలను ఆర్పక పోతే అడవికి చాలా నష్టం తో పాటు వేలాల జాతరకు వచ్చిన భక్తులకు ప్రమాదకరంగా ఉండేది.సకాలంలో అప్రమత్త మైన బీట్అధికారి శ్రీధర్ ను, అడవిలో మంటలను ఫైర్ బ్లోయర్ తో అర్పివేసిన టీజీ ఎఫ్ డీసీ వాచర్ సాయికిరణ్ ను మంచిర్యాల రేంజ్ ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు,టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ లు అభినందించారు.జాతరకు విచ్చేసే భక్తులు అడవిలో వంట చేసుకున్న తర్వాత ఆ మంటలను ఆర్పివేయాలన్నారు.బీడీలు, చుట్టలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని తాగి నిర్లక్ష్యంగా అడవిలో పడేయవద్దని కోరారు.అడవి కాలిపోతే ఎంతో నష్టమని, దీనిని అందరూ గమనించి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్ :నేటిధాత్రి

వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం..!

మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భార్య శోభన గర్భిణి కావడంతో తల్లి లక్ష్మితో కలిసి రవి అనే వ్యక్తి బైకుపై ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి కుటుంబం కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version