దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న… ఎమ్మెల్యే
దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
మంగళవారం కేసముద్రం మండలం కేంద్రంలో సప్పిడి గుట్ట తండా దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్, మాట్లాడుతూ.. అమ్మ వారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి మరియు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాం అని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ఇనుగుర్తి మండల అధ్యక్షులు సతీష్ మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న, మాజీ టీపీసీసీ సభ్యులు దస్రు నాయక్, మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య మాజీ ఎంపీటీసీ బానోత్ బద్రి నాయక్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తరాల వీరేష్ యాదవ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగాల నేతాజీ, దామరి అశోక్,మండల నాయకులు,డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.