మాజీ మునిసిపల్ కౌన్సిలర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన…

మాజీ మునిసిపల్ కౌన్సిలర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:సోమవారం నాడు, పట్టణంలోని వార్డ్ నెంబర్ 2, వాస్తవ్యులు మాజీ మునిసిపల్ కౌన్సిలర్ శ్రీమతి.తహెరా బేగం గారు పరమపదించారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డా౹౹ఏ.చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన అంతఃక్రియలలో పాల్గొని వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,హన్మంత్ రావు పాటిల్ మాక్సూద్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్ నాయీమ్ గౌసోద్దీన్ పాండురంగ రెడ్డి ,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన జెనరేటర్..

ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు

 

 

మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది.

 

 

 

 

 

 

 

 

గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. పగటి పూట కరెంట్ కోత అంతగా బాధించకపోయినా.. రాత్రిళ్లు తప్పని సరిగా విద్యుత్ అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కరెంట్ కోతలనుంచి తప్పించుకోవడానికి కొంతమంది జెనరేటర్లు వాడుతున్నారు. తాజాగా, ఓ పోర్టబుల్ జెనరేటర్ ముగ్గురి ప్రాణాలు తీసింది.

 

 

 

 

 

 

 

 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురు తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్ తన ఇద్దరు కొడుకులు.. సుమన్ రాజ్ (15), గోకుల్ రాజ్(13)తో కలిసి ఇంట్లో నిద్రపోయాడు. రాత్రి వర్షం కారణంగా కరెంట్ పోవటంతో పోర్టబుల్ జెనరేటర్ ఆన్ చేసి పడుకున్నారు.

 

 

 

 

 

 

 

 

 

మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది. అక్కడ ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. వారి నోటి నుంచి నురగలు వస్తూ ఉన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గవర్నమెంట్ స్టేన్‌లే మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు.

 

 

 

 

 

 

 

 

 

అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో వారిది ఆత్మహత్య కాదని తేలింది. కార్బండ్ మోనాక్సైడ్ కారణంగా వారు చనిపోయినట్లు వెల్లడైంది. జెనరేటర్ నుంచి వెలువడిన కార్బండ్ మోనాక్సైడ్ ముగ్గురి ప్రాణాలు తీసిందని డాక్టర్లు తేల్చారు. జెనరేటర్ కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో స్థానికంగా కలకలం చెలరేగింది.

గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన.!

*గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ..

*సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి పరామర్శించిన..

*ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్..

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 11:

 

తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతికి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం నాడు సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్ అనంతరం సప్తగిరిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపిన ఎమ్మెల్యేలు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version