ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్ల అందజేత…

ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్ల అందజేత

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్లను తల్లిదండ్రుల సమావేశంలో మొక్కలు నాటిన తల్లులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏక్ పేడ్ మాకేనాం (అమ్మ కోసం ఒక చెట్టు) అనే కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులలో చెట్ల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.మొక్క తల్లితో సమానమని విద్యార్థులు అమ్మని ఎలాగైతే ఇష్టపడతారో అలాగే మొక్కను నాటి ఇష్టపడి ఆ మొక్కను కాపాడుతూ ఉండాలని విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరిగిందని అన్నారు.చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు అందరూ తమ తల్లులతో మొక్కలు నాటి తమ ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినందుకు గాను మరి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగిందనీ ఆ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాలలో బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పటు చేసి బతుకమ్మలతో వచ్చి ఆడి పాడిన తల్లులకు ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులుగా చీరలను ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్కవత్ దేవా,కంచ రాజకుమార్,మేకల సత్యపాల్,పుల్లూరి రామకృష్ణ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య మరియు తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను…

తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను

ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

జన్మనిచ్చిన కన్నతల్లి పేరు తో ప్రతి ఒక్కరు మొక్కను నాటి అది వృక్షమయ్యే వరకు సహకరించాలి ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహమ్మద్ సలీం తెలిపారు తల్లి పేరున ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కోమటి కొండాపూర్ మరియు వర్షకొండ గ్రామాలలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా మరియు సంబంధిత గ్రామ ప్రజలందరూ కూడా వారికి అన్వైనటువంటి స్థలాలలో వారికి జన్మనిచ్చినటువంటి తల్లి పేరున మొక్కలు నాటి సంరక్షించుకోవడం వలన రాబోయే తరానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వారవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ మరియు పంచాయతీ కార్యదర్శి సరిత ప్రవీణ్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని వినాయక చవతి పండగ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడారు.రసాయన రంగులు అద్దిన విగ్రహాలను వాడొద్దని వాటి వల్ల నీరు కలుషితమై అటు వ్యవసాయానికి,ప్రజలు అనునిత్యం తాగే నీళ్లు చెరువు నుండి డ్యామ్లనుండి అలాగే గంగనుండి సేకరించి మిషన్ భగీరథ ద్వారా నీటిని మన ఇంటికి పంపుల ద్వారా అందిస్తున్నారు.కాబట్టి ఇప్పటికే మనం ఎన్నో మందులు లేని జబ్బులతో సతమవుతాం అవుతున్నామని,ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి గురై జబ్బులు వస్తాయని ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ గణేష్ మండపాలలో మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని తెలియజేశారు.అలాగే తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైభవం కోసం వైభోగం కోసం హంగులు ఆర్ బాటల కోసం పెద్ద పెద్ద ప్యారో ప్లాస్టో విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని పాడు చేయద్దని దిశా నిర్దేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. ఏదో పనిమీద వేరే ఊరి వెళ్ళినప్పుడు తాడి చెట్టు అంత ఎత్తున విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూచాయిగా దానికి ఎంత అయింది అని అడిగినప్పుడు 2,50,000 అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఎంపీడీవో స్పందించి ఇదే డబ్బులు మీరు పెదా,నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత పంచి వారి కుటుంబ పోషణకు ఉపయోగపడాలని అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ డబ్బులు డైవర్ట్ చేయమని సలహా ఇచ్చారన్నారు.ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తాండూర్ మండల ప్రజలు కూడా ఈరోజు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తాండూర్ మండలం ఆటో కార్మికులని,అధ్యక్షులని అభినందించారు. కార్యక్రమము తనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు కొత్తగా వచ్చిన తాసిల్దార్ ని,ఎంపీడీవో ని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.అదేవిధంగా హబీబ్ పాష మాట్లాడుతూ.. పార్కింగ్ స్థలాలు,ఆటో భవన్ నిర్మాణం కోసం ఆటో కార్మికులకు ఒక 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మార్వోకి ,ఎంపిడిఓకి తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ కి ,మాదారం ఎస్సై సౌజన్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆటో కార్మికులకి, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆటోమాలి,తీర్మాన కమిటీ సభ్యులు నీలపల్లి మల్లేష్,అచ్చులాపూర్ ఆటో కార్మికులు చందు,విజయ్ చింతల లచ్చన్న,కుచ్చుల సంతోష్,చంద్రవెల్లి నాగేష్,బట్టి తిరుపతి,తంగళ్ళపల్లి డ్రాగన్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version