పిల్లలతో సహా తల్లి అదృశం, కేసు నమోదు చేసిన పోలీసులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
పిల్లలతో సహా తల్లి అదృశ్యం పై కేసు నమోదు చేసి నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై కే వినయ్ కుమార్ తెలిపారు.ఈ కేసులో అమ్రేన్ బేగం (30)తో పాటు ఆమె పిల్లలు అలియా(9) మాహేర (7), ఆహిల్ (5) ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమ్రేన్ తన భర్త మహమ్మద్ నూర్ ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ గొడవల కారణంగా తన పిల్లలతో పాటు రాంనగర్ లోని తన అన్న మహమ్మద్ హర్షద్ వద్దకు 20 రోజుల క్రితం వచ్చింది. గత 15వ తేదీ మధ్యాహ్నం కిరాణా షాప్ వె ళ్తానని చెప్పి తన ముగ్గురు పిల్లలతో సహా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు తిరిగి రాలేదని ఆమె అన్న హర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ.కే.వినయ్ కుమార తెలిపారు.