స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

కట్కూరి దేవేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

పరకాల,నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకునే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామాలలో అత్యధికంగాఎగరవేయాలని వారి గెలుపు కొరకై ప్రతి ఒక్కరు పని చేసే విధంగా ముందుండాలని మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అన్నారు.మండలంలోని అలియాబాద్,వెల్లంపల్లి గ్రామాలలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే రీతిలో కృషి చేస్తున్నారని,పరకాల నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి కోసమే పనిచేసే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అన్ని వర్గాలకు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి చేపడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల సమన్వయ కమిటీ సభ్యులు నలుబోలు కిష్టయ్య, కొత్తపల్లి రవి,బొజ్జం రమేష్, అల్లం రఘు నారాయణ, దుగ్యాల రాజేశ్వరరావు, ఇనుగాల రమేష్,తక్కలపల్లి స్వర్ణలత జీవన్,పల్లెబోయిన శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టర్ పెండ్యాల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యం,విజేందర్ రెడ్డి, మహేందర్,శ్రీనివాస్, విజేందర్,పెండ్యాల రమేష్, అలియాబాద్,వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీడీవో…

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీడీవో

నడికూడ,నేటిధాత్రి:

పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మొక్క(ఆక్సిజన్), శాలువ కప్పి మర్యాద పూర్వకంగా కలిసిన నడికూడ ఎంపీడీవొ రామ రామకృష్ణ అదే విధంగా మండలం లోని ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కి కలిసి పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు. వారితో పాటు కార్యాలయ సహాయకులు గోవిందు నవీన్ కుమార్ పాల్గొన్నారు.

ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు…

ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

పరకాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన సందర్భంగా నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్ కట్ చేసి,పండ్ల పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దురిశెట్టి చంద్రమౌళి(చందు) మాట్లడుతూ పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృధి చేసిన నాయకుడు,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నాయకుడన్న పదానికి నిలువెత్తు రూపం,నేటి యువతరానికి ఆదర్శం, రాజకీయాల్లో మచ్చ లేని జనహృదయ నేత అని, కార్యకర్త కి అపద అంటే నేను ఉన్నా అంటూ అండగా ఉండే నాయకుడు అని కొనియాడారు ఈ సందర్భంగా నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ తరుపున మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అష్ట ఐశ్వర్యాల తో ఉండాలని ప్రార్ధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు నందికొండ జైపాల్ రెడ్డి,మచ్చ రవీందర్, సుధాటి వెంకటేశ్వర్ రావు, నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి,రావుల కిషన్, మండల యూత్ నాయకులు ముస్కే రాము,గుడికందుల శివ,దురిశెట్టి వెంకటేశ్,తిప్పర్తి ప్రశాంత్ రెడ్డి,బియ్యాల ప్రశాంత్ రావు,కౌకొండ మాజీ ఎంపీటీసీ మేకల సతీష్, రాయపర్తి మాజీ సర్పంచ్ రావుల సరితరాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్షలు డైగ రాజు,తోగరు శ్రీనివాస్, ఇల్లందుల నాగరాజు, నారగాని రాకేష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన గజ్జి విష్ణు

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన గజ్జి విష్ణు

పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గం దామెర మండలంలోని పసరగోండ గ్రామంలో గజ్జి కమల గుండెపోటుతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ సూర్య హాస్పిటల్ ఎం.డి గజ్జి సురేష్,సూర్యట్రస్ట్ చైర్మన్ గజ్జి విష్ణు భాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని మాటఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version