వైకాపా నేతల దాడిలో మృతి చెందిన.

వైకాపా నేతల దాడిలో మృతి చెందిన
రామక్రిష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన

మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పలువురు
ఎమ్మెల్యే లు

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 27:

 

పుంగనూరు నియోజకవర్గంలోని చండ్రమాకుల పల్లి పంచాయతీ క్రిష్ణపురం గ్రామంలో
ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు చిత్తూరు ఇన్ చార్జీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి,గురజాల జగన్మోహన్, మురళీమోహన్ లు నివాళులర్పించారు.ఆ మేరకు కృష్ణాపురం గ్రామంలో గురువారం జరిగిన దినకర్మ కార్యక్రమానికి వారు హాజరై రామకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అదేవిధంగా ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందజేశారు.

YSRCP leaders

 

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇన్ చార్జీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు.ఈ సంతాప కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సి. ఆర్. రాజన్, పుంగనూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు, యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబులతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు..

మీనాక్షి నటరాజన్ ను కలిసిన.!

మీనాక్షి నటరాజన్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

భూపాలపల్లి నేటిధాత్రి

ఢిల్లీలోని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విస్లావత్ దేవన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

బిఆర్ఎస్ నాయకుల అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం.

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు.

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు

విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి

జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి

శాయంపేట నేటిధాత్రి:

Education Minister

శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ ఎస్వి నేతను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.బిఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా కేయూ బిఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ముందస్తుగా అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలములో ఆరుసార్లు బిఆర్ ఎస్విరాష్ట్ర నాయకులు కొమ్ము ల శివను అక్రమ అరెస్టులు చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం అని అన్నారు విద్యాశాఖకు మంత్రిని నియమించ కుండా కాలయా పన చేస్తూ విద్యార్థుల జీవితా ల తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటమాడుతూన్నాడని మండిపడ్డారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

తంగళ్ళపల్లి,నేటిధాత్రి:

మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు, అలాగే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు మండలంలో నువ్వా నేనా అన్న చందంగా తయారైందని చర్చలు జరుగుతున్నాయి.అధికారంలో ఎవరున్నా మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్పా వ్యక్తిగత దూషణలతో
మాట్లాడుకోవడం సరైంది కాదని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఎకరిపై ఒకరు దుషించుకోకుండా సమన్వయంతో ఉంటూ మండల అభివృద్ధికి దోహద పడాలని పలువురు మండల మేధావులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.

ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు.

ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని ఇందారం 1ఎ గని లో ఏఐటియుసి కార్మిక నేతలు సందర్శించారు.శనివారం గనిలోని అన్ని విభాగాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలను పరిష్కరించాలని గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు.వారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కంది కట్ల వీరభద్రయ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో రక్షణ పరికరాలు,పనిముట్లు అందుబాటులో ఉంచాలని,వేసవికాలం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని,ఓసి లోని పలు సమస్యలు పరిష్కరించాలని వివిధ అంశాలపై మేనేజర్ తో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాబా సైదా,సహాయ కార్యదర్శి మోత్కూర్ కొమరయ్య,ఫిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు.!

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్

హన్మకొండ, నేటిధాత్రి:

సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు
నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు…
కాకతీయ యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బిసి జేఏసీ నాయకులు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బిసి జేఏసీ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ ఆధ్వర్యంలో బీసీల బాంధవుడు,బీసీల ఆశాజ్యోతి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న ని హైదరాబాదులో తన ఆఫీసులో శనివారం కలిసి బీసీ ఉద్యమానికి,వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ప్రజల వరకు ఏ విధంగా తీసుకువెళ్లాలో మల్లన్న తో చర్చించడం జరిగింది.బీసీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. అలాగే మంచిరాల జిల్లావ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకొని పోవడం కోసము చర్చించారు.అదేవిధంగా బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడైన వట్టా జానయ్య యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని మంచిర్యాల బీసీ జేఏసీ కి పలు సూచనలను,సలహాలను అందించడం జరిగింది.ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ నాయకులు ఆవిడపు గణేష్,వేముల మల్లేష్,గుడిమల్ల వెంకటేశ్వర్లు,పిట్టల రవీందర్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు.

బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు

– అనుమతి లేకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం,ధర్నా
సిరిసిల్ల (నేటి ధాత్రి):

సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నాచేసిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు చేసారని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ తేది 13-03-2025 రోజున అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని శాసనసభ సమావేశాలకు సస్పెండ్ చేసినదానికి భేషరతుగా జగదీశ్వర్ రెడ్డి పైన వేసిన సస్పెన్షన్ వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని, శుక్రవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా వాహన దారులను అడ్డుకొని వారికి ఇబ్బంది కల్గించి ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నా చేసిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు చేసినట్లు తెలిపినారు.

బిజెపి నాయకులు వికాస్ రావు కి ఆహ్వానం.!

మల్యాల గ్రామంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు బిజెపి నాయకులు వికాస్ రావు కి ఆహ్వానం.

చందుర్తి, నేటిధాత్రి:

మన మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే ప్ర ప్రధమ బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి రావాలని బిజెపి నాయకులు చెన్నమనేని వికాస్ ని ఆలయ కమిటీ కలిసి ఆహ్వానం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతోపాటు అల్లాడి రమేశ్, మార్త సత్తయ్య, మొకిలే విజయేందర్, సిరికొండ శ్రీనివాస్, లోకోజి సతీష్, పాటి సుధాకర్, దురిశెట్టి రాజు, మూడపెళ్లి ముఖేష్ మరియు ఇతర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ నాయకులు.

ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ నాయకులు..

రామాయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామయంపేట మండల లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ నాయకులకు ఆర్థిక సాయం అందజేశారు. భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి కాంటా రెడ్డి తిరుపతిరెడ్డి రూ.5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీసీ మైస గౌడు, బాలయ్య, మల్లేశం,విజయభాస్కర్ రెడ్డి, కాట్రాల బిక్షపతి, రాజేందర్ గుప్త, మాజీ ఉపసర్పంచ్ స్రవంతి రాజేందర్, బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి

ఇర్ప రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు*

నేటి ధాత్రి ; భద్రాచలం;
ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదివాసీ మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ లను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మార్చి 11,2025; మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఆదివాసీ ప్రజల ఉపాధిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంప్ లను నిలిపి పాలకులు రైజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు.నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ కు పెట్టుబడి నిమిత్తం ముందస్తు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమ్మ పెట్టదు అడుక్కతీననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు.ఇసుక అక్రమాలు కట్టడి అంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొకోక పోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని అన్నారు

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నదాతలకు అండగా ఉంటాం.

అన్నదాతలకు అండగా ఉంటాం

-రైతుల పక్షాన పోరాటం చేస్తాం

-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతు ఉంటమాని అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం దేవుని గుట్ట తండా లో ఎండిపోయిన పంట కాలువ, పంట పొలాలను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గత 15 రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీల్లు లేక అరిగోస పడుతున్నారని తెలిపారు. ఎండుతున్న వరిపోలాన్ని చూడలేక పశువులను మేతకు వదులుతున్న దుస్థితి నెలకొన్నదని అన్నారు. వెంటనే మిడ్ మేనేర్ నీటిని మల్కపేటకు పంపింగ్ చేసి రైతులను ఆడుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ , పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ ,కొండ రమేష్ గౌడ్ ,నాయకులు నమిలికొండ శ్రీనివాస్, గూగులోత్ పెంటయ్య, అజ్మీర రాజు నాయక్,అజ్మీర తిరుపతి నాయక్, భూక్య ప్రభు, ధరావత్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.

అబ్బడి రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బి ర్ ఎస్ పార్టీ నాయకులు…

అబ్బడి రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బి ర్ ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అబ్బడి రాజిరెడ్డి అక్రమం అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ఇటీవలే విడుదలైన రాజిరెడ్డి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదని రైతులను జైలుకు పంపిన పార్టీ కాంగ్రెస్ అని ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసిన రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని గత 30 సంవత్సరాలుగా కాస్తూ చేసుకుంటూ పట్టా పొందిన యొక్క భూమిని వెంటనే ఆన్లైన్ లో తిరిగి పునర్ధన చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూవారి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మనో ధైర్యం చెబుతూ వారి కుటుంబానికి బరసో ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో బి. ర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు బుల్లి రామ్మోహన్ మాజీ ఎంపీపీ పడగల మానస రాజు జెడ్పిటిసి కోడి అంతయ్య మాజి జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు. సర్పంచులు ఎంపిటిసిలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

నీటి కాలువను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..

నీటి కాలువను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం నుండి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సాగునీరు వచ్చే కెనాల్ కొందరు భూ యజమానుల అభ్యంతరాల వల్ల నీళ్లు రావడంలేదని రైతాంగానికి ఇబ్బంది అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశానుసారం కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించి ఎలాగైతే అడవి శ్రీరాంపూర్ రైతాంగానికి సాగునీరు ఇవ్వగలుగుతాము అని చూసి ఇట్టి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి మరియు ఉన్నతాధికారులకు తీసుకువెళ్లడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కారం చేయవలసిందిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సధానందం మద్దెల రాజయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, గాదం శ్రీనివాస్ ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూటు రఫీ ,ముత్తారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనుము సమ్మయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ తదితరులు పాల్గొన్నారు

రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు…

రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్న రైతులు

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా, రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంను, అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారు.
* మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.*

వరంగల్, ఎనుమాముల నేటిధాత్రి

 

 

BRS leaders

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట ధరలు పడిపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సంఘీభవంగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ లు కలిసి ఏనుమముల మార్కెట్ ను సందర్శించి రైతన్నల కష్టాలను మద్దతు ధర లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతు.. రైతన్నలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక ఈ రోజు రైతన్నలు రోడ్డున పడి ఆగమవుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతన్నల పొట్టగొడుతున్నారు అని, ఇలా రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తొందరలోనే అదే రైతన్నలు భూస్థాపితం చేస్తారు అని చెప్పారు. రైతన్నలకు మద్దతు ధర ఇవ్వడంలో కాని, ఎరువుల సప్లై లో కాని, రైతు బీమాలో కాని రైతన్నను కేసీఆర్ చూసుకున్నట్లు ఎవరు చూడట్లేదని, ఆయనను మించిన నాయకుడు ఈ దేశలోనే లేడు అని అన్నారు. స్థానిక జిల్లా మంత్రి కొండా సురేఖ ఈ ఏనుమముల మార్కెట్ లో మద్దతు ధర కాని రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మరియు గుమస్తాలు, దడవాయిలు, హమాలీ కార్మికులు పడుతున్న సమస్యలు ఇబ్బందులు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు అని అన్నారు. ఇలా మద్దతు ధర ఇవ్వకుండా రైతన్నలను నానా గోసలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు రైతన్న పక్షాన కొట్లాడటానికి మా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తూర్పు కార్యకర్తలు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.

BRS leaders

సంగారెడ్డి కాంగ్రెస్ సారథిగా… ఉజ్వల్ రెడ్డి?

■డీసీసీ అధ్యక్షుడిగా నియమించేలా అధిష్టానం కసరత్తు

” దాదాపుగా ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటన

■జిల్లా కీలక నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్ణయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా పగ్గాలు డాక్టర్ సిద్ధంరెడ్డి ఉజ్వల్ రెడ్డికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. అధి కారికంగా ప్రకటించడమే మిగిలినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా దిన్నర కావొస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇచ్చేలా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉజ్వల్ రెడ్డిని నియమిం చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో వైద్యుడిగా సేవలు!

జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లికి చెందిన సిద్దం రెడ్డి ఉజ్వల్ రెడ్డి కొన్నేళ్లుగా అమెరికాలో వైద్యుడిగా సేవలందిస్తూ వచ్చారు. మరోవైపు ఉజ్వల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు న్నారు. పన్నెండేళ్లుగా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో తన ట్రస్టు ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా వివిధ పోటీలనూ నిర్వహిస్తుంటారు.
వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది. ఉజ్వల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి గతంలో జహీరా బాద్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానూ కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా సారథిగా ఆయనను నియమించేలా కసరత్తు పూర్తయింది.

కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వడంతో!

నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షు రాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తర్వాత ఆమెకు టీజీఐఐసీ చైర్ పర్సన్ గా అవకాశం
ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టీజీఐఐసీ కార్పొరేషన్
ఛైర్ పర్సన్ తో పాటు జిల్లా అధ్యక్షురాలిగానూ
కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఉజ్వల్ రెడ్డిని
సారథిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నించారు. చివరకు పార్టీ అధిష్టానం సురేష్ షెట్కార్ వైపే మొగ్గింది. ఈ క్రమంలో ఉజ్వల్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version