ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొన నాయకులు

*ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొన నాయకులు*

◆ ప్రభుత్వ ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన పట్టణ బి.ఆర్.ఎస్ నాయకులు.

*జహీరాబాద్ నేటి దాత్రి:*

జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు గారి జన్మదినం పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పట్టణ బిఆర్ఎస్ నాయకులు ప్రారంభించడం జరిగింది

… ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.. పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకుని వృధా ఖర్చులు చేయకుండా ఎమ్మెల్యే గారు మంచి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు… సీనియర్ నాయకుడు నామారవి కిరణ్,
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ తంజీం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మహ్మద్ యూసుఫ్, పట్టణ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ యాకూబ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా, పురుషోత్తం రెడ్డి, గణేష్, అప్పి రాజ్, ఆశమ్, జుబేర్ ,వహీద్, ఇబ్రహీం, అలీమ్, సలీం అశోక్ రెడ్డి, ప్రవీణ్ చింటూ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version