మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సందేశం అందించాలి

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఎమ్మెల్యే మాధవరెడ్డితో కలిసి నర్సంపేట డివిజన్ చర్చిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రార్థనలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అన్ని మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపని ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడమే నిజమైన అభివృద్ధికి సంకేతమని రాష్ట్ర ఐటీ పరిశ్రమ, వాణిజ్యం,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.క్రిస్టమస్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం తిమ్మరాయన్ పాడ్ లో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలాగే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ పండుగా
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు ఆరోగ్యం సమృద్ధి నిండాలని కోరుకుంటూ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నామని తెలిపారు.

స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది దీక్ష దివాస్…

స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది దీక్ష దివాస్.

#తెలంగాణ ప్రజల చిరకాల ఆంక్షను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.

నల్లబెల్లి,నేటిధాత్రి:

 

తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వఘట్టమని బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు.దీక్ష దివస్ కార్యక్రమం నేపద్యంలో మండలంలోని గోవిందపురం గ్రామంలో ఉద్యమకారుల చిత్రపటానికి పూలమాలలతో అమరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయనీ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజునే దీక్ష దివస్ గా అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టమని అన్నారు.ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని తెలిపారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ దీక్ష దివస్ నిలుస్తుందని స్పష్టం చేశారు.2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.
దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు.సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ దీక్షా దివస్ కలిపిందన్ని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందే మో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు తొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ కరివెదుల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవ్ సింగ్, గ్రామ పార్టీ అధ్యక్షులు మోతిలాల్, మంజిలాల్, నాయకులు సురేష్, సంపత్ రావు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version