కేసీఆర్ పై సిట్ నోటీసులు: పెద్ది సుదర్శన్ తీవ్ర ఖండన

తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు సిట్ నోటీసులా?

ప్రతీకార పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

నిప్పులాంటి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఖబర్దార్!

రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత,
రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్
తెలంగాణ తెచ్చినందుకే నోటీసులా?.
తెలంగాణను ప్రగతి పథంలో నడిపించినందుకే నోటీసులా?..
రైతుబంధు ఇచ్చినందుకే నోటీసులా?
రైతన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చినందుకు కేసీఆర్ కు నోటీసులా?..అని ప్రశ్నించారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సిఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు.రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడిపై కుట్రలు పన్నడం రైతుల హృదయాలను అవమానించడమే అని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో పదేండ్ల అద్భుత ప్రగతి తొలి సీఎం కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం..ఆయన పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో చారిత్రాత్మక అభివృద్ధి సాధించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతుకు గౌరవం తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం,సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన దూరదృష్టి.. కేసీఆర్ ది అని పేర్కొన్నారు.మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా..
సాగునీరు, త్రాగునీరు,విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేసిండు కేసీఆర్..
గ్రామీణాభివృద్ధి, పట్టణ విస్తరణ, రహదారుల అభివృద్ధి చేసి,
పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక బలం పెంపు చేసిండు… కేసీఆర్…దళిత బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలతో దేశానికి ఆదర్శవంతమైన సామాజిక సంక్షేమం అమలు చేసినందుకా కేసీఆర్ కు నోటీసులా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగారు.పేదల సంక్షేమానికి అంకితమైన పాలన చేసి..విద్య, వైద్య రంగాల్లో మౌలిక మార్పులు చేసి
తెలంగాణ ఆత్మగౌరవం పెంచి ప్రపంచానికి చాటిన మాజీ సిఎం కేసీఆర్..సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం పెంచి,ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచిన కేసీఆర్ పై ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన చేస్తున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
రోజుకో డ్రామా, రోజుకో డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.
నిప్పు లాంటి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్! అని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణి టెండర్లలో అవకతవకలు, సృజన్ రెడ్డి వ్యవహారం పై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ పై చేస్తున్న కుట్రలు — ప్రజల మద్దతుతో విఫలం అవుతాయి..నాలుగు కోట్ల తెలంగాణ సమాజంలో 60 లక్షలమంది బి ఆర్ ఎస్ సైన్యం నీ కుట్రలను తిప్పికొడతారని పేర్కొన్నారు.కేసీఆర్ పై రాజకీయ కక్షతో చేస్తున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్న రేవంత్ ప్రభుత్వం: గండ్ర వెంకట రమణా

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం

హరీష్ రావు ని విచారణకు పిలవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వారిని విచారణకు పిలవడం హేయమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా పరిగణించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి హరీష్ రావు పై కేసులు పెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు.
హరీష్ రావు పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నిన్న మళ్లీ విచారణకు పిలవడం అనేది పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని అసహనానికి నిదర్శనం.
భారత రాష్ట్ర సమితికి ఉన్న అపార ప్రజాదరణను చూసి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదు.
ఎంతమందిని విచారణలకు పిలిచినా, ఎంతమంది కార్యకర్తలను వేధించినా, బీఆర్‌ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు ప్రజాపక్షంలో పోరాడటం ఖాయం. ఈ క్రమంలో అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బొగ్గు కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతిని ధైర్యంగా బయటపెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.లేకపోతే, ఇలాంటి నిరంకుశ చర్యలతో చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. వారు హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version