అన్ని మండలాల్లో దీక్షా దివాస్

అన్ని మండలాల్లో దీక్షా దివాస్ నిర్వహించాలి

తెలంగాణ చరిత్రలో ప్రత్యేక గుర్తు దీక్షా దివాస్

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

దశాబ్దంన్నర క్రితం భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కె.సి.ఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలో 29 న శనివారం దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివాస్‌ను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

వనపర్తిలో దీక్షా దివాస్ సమావేశం

దీక్షా దివాస్ సమావేశంలో మాజి మున్సిపల్ చైర్మన్ పలస

వనపర్తి నేటిదాత్రి .

 

కె సిఆ ర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించామని వనపర్తి పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా.రమేష్ గౌడ్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీక్షా దివాస్ నిర్వహించాలని నాయకులు కార్యకర్తలు దీక్షా దివాస్ గురించి ప్రజలకు తెలుప లని కార్యకర్తలను కోరారు
14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం,10.సంవత్సరాల కె.సి.ఆర్ పరిపాలన యువతకు అవగాహన కలి పి చెందిoదుకు బీ ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,ఆవుల.రమేష్,విజయ్ కుమార్,ఉంగ్లం. తిరుమల్,బండారు.కృష్ణ, కంచ.రవి,సమద్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్, రమేష్ నాయక్,షేక్.జహంగీర్,జోహెబ్ హుస్సేన్,సునీల్ వాల్మీకి,ఎం.బాలరాజు,సుధాకర్,పెద్దముక్కుల.రవి,మంద.రాము,ముద్దసార్,నందిమల్ల.సుబ్బు వజ్రాల.సాయిబాబా తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version