మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి..

మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి..

క్షేత్రస్థాయిలో పనిచేయండి.. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి..

సిట్ విచారణ అనంతరం ప్రత్యేక భేటీ..

నేటి ధాత్రి, పఠాన్ చేరు:

 

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం సిట్ విచారణ అనంతరం హైదరాబాదులోని నంది నగర్ లో గల కెసిఆర్ నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికలలో స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జండా ఎగరవేసి క్లీన్ స్వీప్ సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారని గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పని చేసి బిఆర్ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించుకొని వస్తామని గూడెం మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం..

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.కాగా.. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్‌లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్‌ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్‌‌ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజకీయ కక్షసాధింపులా?

*ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజకీయ కక్ష్య సాధింపులా…*

◆-: ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలను మోసం చేస్తుంటే హామీలను వెంటనే అమలుచేయాలని ప్రశ్నిస్తే మా పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు చర్య, కాంగ్రెస్అవినీతిని ప్రశ్నిస్తే మాజీ మంత్రి హరీష్ రావు గారిపై సిట్ విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం దారుణం ఇటువంటి పిరికి చర్యలకు బిఆర్ఎస్ పార్టీ ఏమాత్రం భయపడేది లెదు ఇంకా అవినీతి గురించి ఎక్కువ ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎన్నికల ముందు ఇలాంటి చీప్ ట్రిక్కులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే,కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version