కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ బద్దెనపల్లి ఇందిరమ్మ .కాలనీలొకాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లిశ్యామ్.గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ మేము చేయలేదు అని చెప్పిన కేసీఆర్ కు తన కూతురు కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ముఖ్య సాక్షిగా నా ఫోను నా భర్త ఫోన్ టాప్ చేసింది మా నాన్న మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పడం. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులు ఎన్నో అక్రమాలు చేసిన వారిని వదల వద్దని. గతంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ టాపింగ్ చేస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అవినీతి అక్రమాలు ప్రజలకు. తెలవాలని. ఇలా తెలంగాణ పేరు చెప్పి ఎన్ని అక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారని దీనిపై సిట్ అధికారులు గత ప్రభుత్వంలొ జరిగినటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా సీట్ విచారణ చేస్తున్నారని. ఇలాంటి అవినీతి వెలికి తీయాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని విషయాలు బయటకు రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మన ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన ప్రభుత్వంలో పెద్దల ఇతర మంత్రుల సహాయంతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఓర్వలేక అనేక అబండాలు వేస్తూ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా. ఇలా. ఇలా చేస్తే వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని. ప్రజాక్షేత్రంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని. ఎలాంటి తప్పు చేయని మీకు భయం ఎందుకని సిట్ విచారణ చేస్తే తప్పేము ఉంటుందని దానికి సహకరించాలి తప్ప ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఇకనైనా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వాటి సభ్యులు. వడ్డేపల్లి రామా. ముందాటి శారద. భరత్. కాంగ్రెస్ నాయకులు. శ్రీరామ్. నరేష్. లక్ష్మిపతి. రంగయ్య. సుదర్శన్. రాజు. శ్రీనివాస్. రమేష్. కిషన్. గురునాథ్. రవి. రామచంద్రం. రాజు. కిరణ్. శ్రీనివాస్. లక్ష్మణ్. మహిళ నాయకులు. యమునా. భాగ్యలక్ష్మి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం..

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.కాగా.. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్‌లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్‌ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్‌‌ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version