కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ బద్దెనపల్లి ఇందిరమ్మ .కాలనీలొకాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లిశ్యామ్.గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ మేము చేయలేదు అని చెప్పిన కేసీఆర్ కు తన కూతురు కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ముఖ్య సాక్షిగా నా ఫోను నా భర్త ఫోన్ టాప్ చేసింది మా నాన్న మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పడం. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులు ఎన్నో అక్రమాలు చేసిన వారిని వదల వద్దని. గతంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ టాపింగ్ చేస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అవినీతి అక్రమాలు ప్రజలకు. తెలవాలని. ఇలా తెలంగాణ పేరు చెప్పి ఎన్ని అక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారని దీనిపై సిట్ అధికారులు గత ప్రభుత్వంలొ జరిగినటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా సీట్ విచారణ చేస్తున్నారని. ఇలాంటి అవినీతి వెలికి తీయాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని విషయాలు బయటకు రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మన ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన ప్రభుత్వంలో పెద్దల ఇతర మంత్రుల సహాయంతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఓర్వలేక అనేక అబండాలు వేస్తూ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా. ఇలా. ఇలా చేస్తే వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని. ప్రజాక్షేత్రంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని. ఎలాంటి తప్పు చేయని మీకు భయం ఎందుకని సిట్ విచారణ చేస్తే తప్పేము ఉంటుందని దానికి సహకరించాలి తప్ప ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఇకనైనా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వాటి సభ్యులు. వడ్డేపల్లి రామా. ముందాటి శారద. భరత్. కాంగ్రెస్ నాయకులు. శ్రీరామ్. నరేష్. లక్ష్మిపతి. రంగయ్య. సుదర్శన్. రాజు. శ్రీనివాస్. రమేష్. కిషన్. గురునాథ్. రవి. రామచంద్రం. రాజు. కిరణ్. శ్రీనివాస్. లక్ష్మణ్. మహిళ నాయకులు. యమునా. భాగ్యలక్ష్మి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్న రేవంత్ ప్రభుత్వం: గండ్ర వెంకట రమణా

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం

హరీష్ రావు ని విచారణకు పిలవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వారిని విచారణకు పిలవడం హేయమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా పరిగణించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి హరీష్ రావు పై కేసులు పెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు.
హరీష్ రావు పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నిన్న మళ్లీ విచారణకు పిలవడం అనేది పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని అసహనానికి నిదర్శనం.
భారత రాష్ట్ర సమితికి ఉన్న అపార ప్రజాదరణను చూసి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదు.
ఎంతమందిని విచారణలకు పిలిచినా, ఎంతమంది కార్యకర్తలను వేధించినా, బీఆర్‌ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు ప్రజాపక్షంలో పోరాడటం ఖాయం. ఈ క్రమంలో అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బొగ్గు కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతిని ధైర్యంగా బయటపెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.లేకపోతే, ఇలాంటి నిరంకుశ చర్యలతో చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. వారు హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version