గుర్తు తెలియని వ్యక్తి మృతి
జమ్మికుంట, నేటి ధాత్రి:
ఉప్పల్ -జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య భీంపల్లి గ్రామ సమీపంలో రైలు పట్టాల ప్రక్కన సిమెంట్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు బహుశా ఎదో రైలు బండి నుండీ క్రింద పడగ చనిపోయి ఉంటాడు. మృతుడు నవీ బ్లూ ఫుల్ టీ షర్ట్, నవీ బ్లూ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు మృతుని వద్ద ఏపీఎస్ ఆర్టిసి బస్సు టికెట్ గుడివాడ నుండి విజయవాడ కలదు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని వస్తువులు గాని లేవు. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చరీ లో భద్రపర్చానైనది. ఇట్టి కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం పరిశోదన చేయుచున్నాను ఏమైనా వివరాలు తెలిసినచో ఫోన్ నెంబర్ 9949304574, 8712658604 కి సమాచారం ఇవ్వగలరని కోరారు.
