గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి…

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి

•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్
* రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం తిరుమలాపూర్* గ్రామానికి చెందిన పెండ్లి రవి ఇటీవల మరణించగా నేడు వారి నివాసాలకు వెళ్లి పెండ్లి రవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేశారు.అదే గ్రామానికి చెందిన కంచు చంద్రమ్మ* ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి రవి, యూత్ అధ్యక్షుడు రాంబాబు, చిట్యాల టౌన్ యూత్ అధ్యక్షులు అల్లం రాజు, కొత్తపల్లి రాము గోపగాని శివకృష్ణ, గోల్కొండ మహేష్, ఎలగొండ చిరంజీవి, గోపగాని వెంకటేశ్వర్లు, నీరటి నారాయణ, నాగిరెడ్డి శంకర్, కంచు తిరుపతి, గొర్రెటి ఓదెలు, గద్దల తిరుపతి, జన్నె జనార్ధన్, కలవేన ప్రవీణ్, నగరపు సాయి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version