మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రానికి చెందిన పిట్టల మల్లయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి మండల నాయకులు తో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి మల్లయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉండి పార్టీకి ఎలా లేని సేవలు చేశారు ఆయన అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన వెంట జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు పెంతల కొమరారెడ్డి, హౌసింగ్, రమేష్ తదితరులు ఉన్నారు.
