దసరాకు నిరుపేదలకు చీరలు ఇవ్వాలి: జాగో తెలంగాణ డిమాండ్…

నిరుపేదలకు రానన్న దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి

◆:- జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే తెలంగాణ పండుగ అంతటి ప్రాధాన్యత ఉన్న పండుగకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నిరుపేద ప్రజలకు కెసిఆర్ గారి మంచి ఆలోచనతో తెలంగాణలో దసరా పండుగ అందరు జరుపుకోవాలని ప్రజలు ఆనందంగా సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్న బతుకమ్మ చీరలు బందు చేశారు నిరుపేద తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు మంచి నూనె సబ్బులు సరఫరా చేయాలి రాష్ట్రంలో నిరుపేద ప్రజలు లక్షలాదిగా ఉన్నారు అందరూ ఉన్నవాళ్లే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వము అని గొప్పలు చెప్పుకోవడం కాదు పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం వారికి దసరా పండుగ జరుపుకోవడానికి అన్ని సదుపాయాలు చేయడం అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలు నిర్ణయిస్తారు జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత మొహమ్మద్ ఇమ్రాన్ ప్రధాన కార్యవర్గ సభ్యులు, మరియు, మాదినం శివప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది,

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T145638.080.wav?_=1

 

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక షాప్ ల వద్ద చెప్పులను లైన్లో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు కానీ రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను అరిగోస పాలు చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఆకునూరు తిరుపతి మల్లారెడ్డి ఉద్దమరి మహేష్ ఆది రఘు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

 తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

 

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎట్టకేలకు అసెంబ్లీ అమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిచింది. మంత్రి సీతక్క అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి.

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T153405.039.wav?_=2

 

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని అందుకోసం నర్సంపేట డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటారని ఎంసిపిఐ (యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వెల్లడించారు.పార్టీ నర్సంపేట మండల కమిటీ సమావేశం భైరబోయిన నరసయ్య అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. తొలుత వామపక్ష నేతలు సురవరం సుధాకర్ రెడ్డి , ఎంసిపిఐ యు కేరళ నాయకులు నారాయణన్ మృతిపట్ల శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం హాజరైన రమేష్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ , మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు బాటకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ బడాబాబులకు ధారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మతం పేరుతో భారత పౌరుల పట్ల చిచ్చు పెడుతున్న బిజెపి సర్కార్,విదేశీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నదని ఆరోపించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు,వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,గుర్రం రవి గణిపాక బిందు,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మడి పెళ్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలి లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీ ఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం వంశీకృష్ణ గౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ లు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులు చేయూత పెన్షన్ దారులతో మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ తీసుకుంటే మీకు వికలాంగులకు 4016 లు చేయూత పెన్షన్ దారులకు 2016 లు వస్తున్నాయి కానీ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మాకు అధికారం ఇస్తే వచ్చే నెల నుంచి వికలాంగులకు 4016 లు ఉన్న పెన్షన్ 6000 చేయూత పెన్షన్ దారులకు 4000 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి నేటికీ 20 నెలలు గడుస్తున్న కానీ పెన్షన్ పెంచకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి కూటమి ప్రభుత్వం వికలాంగులకు 6000 భరోసా పెన్షన్ దారులకు 4000 ఇస్తుందని మరియు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి మేరకు కండరాల క్షీణత ఉన్న వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ పెంచి ఇస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పెన్షన్ పెంచకుండా ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే పెంచుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేస్తోందని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న వికలాంగులు చేయూత పెన్షన్ దారులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ పెంచడం కోసం జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరియు సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ హైదరాబాదులో జరుగు వికలాంగుల చేయుట పెన్షన్ దారుల మహా గర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు
నోముల శ్రీనివాస్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మిరపట్టి అశోక్ మాదిగ జిల్లా నాయకులు మంద కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఒంటెరి రాజేష్ మాదిగ ఎంఎస్పి టౌన్ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ ఒంటెరి సమ్మయ్య మాదిగ దోర్నాల నరేష్ మాదిగ ఒంటేరు నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

చెన్నూర్‌లో బాల్క సుమన్ కాంగ్రెస్ పరిపాలనపై విమర్శ…

కాంగ్రెసోళ్ళు ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కారు…

కాంగ్రెస్ కర్కశ పరిపాలనలో పథకాలకు ఎగనామం పెడుతున్నారు…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

10 ఏండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగించారని , ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన కర్కశ పరిపాలనగా కొనసాగుతోందని ,గడిచిన 20 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులకు నియోజక వర్గం నోచుకోలేదని, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాల్క సుమన్ నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ తో కలిసి పాల్గొన్నారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, మున్సిపాలిటీల కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. పరిపాలన అప్పుడే మంచిగుండే మా పోరాటం మా గ్రామం నుండే అనే నినాదంతో నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని , అందులో భాగంగానే ఈ నెల 28 న చెన్నూర్, భీమారం, జైపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Congress Governance

గడిచిన 20 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన అధ్వానంగా తయారయిందని, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో నూతన ఫ్యాక్టరీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ,యువతకు 45 వేల ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించేందుకు కృషి చేస్తానని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గద్దెనెక్కారని ,పదవి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదని, తన ఇంట్లో మాత్రం రెండు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.చెన్నూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=3

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-3.wav?_=4

 

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T153720.610-1.wav?_=5

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు షరతులు లేకుండా యూరియా – బీఆర్ఎస్ డిమాండ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-1.wav?_=6

షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి

రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

వ్యవసాయ ఆధికారికి వినతి పత్రం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…

రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ
పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు సోమవారం
మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంతో రావుల సోమయ్య మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వం కళ్ల మూచుకొనీ ఉందన్నారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

స్కాలర్షిప్ మరియు రీయింబర్స్మెంట్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T155249.795.wav?_=7

 

స్కాలర్షిప్ మరియు రీయింబర్స్మెంట్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి

జిల్లా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ ఆధ్వర్యంలో దీక్ష

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని. ఈ ఫీజు దీక్ష ను ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శులు మల్లారపు అరుణ్ కుమార్, ఎర్రవెల్లి నాగరాజు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8158 వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉన్నత చదువుల కోసం వెళ్లాలంటే ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు డబ్బులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థితి నెలకొందని అన్నారు ఇప్పటివరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచడంలో విఫలమైందని అన్నారు అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ ప్రకటించుకొని విద్యార్థులందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 

ఫీజు దీక్షలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఫీజు దీక్షకు మద్దతుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్, సీ.ఐ.టీ.యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లారెడ్డి రమణ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గుండెల్లి కళ్యాణ్, ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన జిల్లా కమిటీ సభ్యులు శివ, భరత్, జశ్వంత్, నాయకులు తిరుపతి, మహేష్, నవీన్, శివ చరణ్, అజయ్, దినకర్, ప్రసంగి, జలంధర్,అఖిల,అక్షయ, ప్రనుష తదితరులు పాల్గొన్నారు.

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T153118.778-1.wav?_=8

 

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

యూరియా లేక రైతుల ఇబ్బందులు

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఘనపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం విషయంలో మాట తప్పిందని కనీసం రైతులకు యూరియా అందించలేని దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని లేనిపక్షంలో రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ధర్నా చేస్తామని అన్నారు
కార్యక్రమంలో వారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు తోట మానస శ్రీనివాస్, పెంచల రవీందర్, నాయకులు బైరగాని కుమారస్వామి, ఉడుత సాంబయ్య, పేరాల దేవేందర్ రావు, మామిండ్ల సాంబయ్య, గాజర్ల చింటూ, వాజిద్, తదితరులు ఉన్నారు

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు….

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు

*వాహనదారులు ప్రజల భయాందోళన

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండల
అధ్యక్షులు రావుల జానకి రావు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.

ములుగు జిల్లాలో, ముఖ్యంగా మంగపేట మండలకేంద్రంలో వందలాది ఇసుక లారీలు రోడ్లపై తిరుగుతూ వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లారీల పైన పట్టాలు కట్టకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల వాహనదారుల కళ్లలో ఇసుక రేణువులు పడుతూ నిత్యం ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. పాదాచారులు సురక్షితంగా రోడ్లను ఉపయోగించలేక, భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతున్నాయని బిజెపి నేతలు కార్యకర్తలు అన్నారు.

ఇలాంటి ఇసుక లారీల వల్ల ప్రజలకు, వాహనదారులకు కలిగే భీభత్సాన్ని గుర్తుచేసి, వెంటనే లారీలను నియంత్రించి, సరైన పార్కింగ్‌లో ఉంచేటట్టు, రోడ్ల భద్రతను, ప్రజలకు సౌకర్యాన్ని కల్పించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముందస్తు బిజెపి నాయకుల అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T161436.372.wav?_=9

ముందస్తు బిజెపి నాయకుల అరెస్ట్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అర్ధరాత్రి అరెస్టులుబీజేపీ పోరాటాన్ని అణగదీయలేరుభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు రేపు నిర్వహించబోతున్న
చలో సెక్రటేరియట్ కార్యక్రమం సందర్భంగా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తూ ముందస్తు అరెస్ట్ చేశారుబిజెపి గణపురం మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్,బిజెపి గణపురం మండల ఉపాధ్యక్షుడు మాధాసు మొగిలి నీ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తీసుకువెళ్ళడం జరిగింది.
ఈ అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాపాలనకు నిదర్శనం.
ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా, బీజేపీ నాయకులు వెనక్కి తగ్గరు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు మా పోరాటం ఆగదు.
పోరాటమే మా శక్తి ప్రజలే మా బలం.

అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T160734.964-1.wav?_=10

 

అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు
పనుల జాతర 2025 (పనుల ప్రారంభోత్సవం కొత్తగా ప్రారంభించే పనులకు భూమిపూజ కార్యక్రమం) లో బాగంగా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో అంగన్ వాడి భవనమునకు శంకుస్థాపన,పిఎచ్ సి భవనము ప్రారంభోత్సవం,జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు సైన్స్ ల్యాబ్ కు భూమి పూజ కార్యక్రమం, క్యాటింన్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన,అలాగే రాయపర్తి గ్రామంలో అంగన్వాడి భవనం ప్రారంభోత్సవంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని,ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన ధ్యేయం అని అన్నారు.గత ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమయ్యారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-73-2.wav?_=11

ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు

హామీల అమలుకై సమరశీల పోరాటాలు

మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

వేతనాలు నెలవారి సక్రమంగా చెల్లించాలి సిఐటియు డిమాండ్

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి…

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా నేటికీ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని హామీల అమలుకై పంచాయతీ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గుమ్మడవెల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు క్రమం తప్పకుండా బ్యాంకు ద్వారా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు వారికి పిఆర్సి అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ ,రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా గుమ్మడవెల్లి కృష్ణ, అధ్యక్షులుగా గాంధర్ల ధనంజయ్, ప్రధాన కార్యదర్శిగా చర్ప సాంబశివరావు ట్రెజరర్ గా ఉప్పలి సాంబశివరావు లతోపాటు పదిమంది ని కమిటీ సభ్యులుగా కంగాల సురేష్, వడ్లకొండ శ్రీను, కొమరం ప్రశాంత్, మెంతిని శంకర్, కల్లూరి రమేష్ నిట్టా ప్రసంగిలను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పాల్గొన్నారు

స్థానిక సమరం.. ఎవరికీ అనుకూలం?

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-67.wav?_=12

స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం!

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అంచనాలు ఉన్నా యని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పదేండ్ల టిఆర్ ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంపాటు పడితే గెలిచిన అనంతరం తమను పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపుదార్లకే పెద్ద పీటా చేస్తున్నారని చాలా రకాలుగా పార్టీల క్యాడర్ మండిపడుతోంది.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన క్యాడర్ ని కాదని గత బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుప ట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపోవడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే అయితే అటు కేంద్రంలో కాం గ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికారంలో ఉంది. పదేళ్ల రాష్ట్రంలో పాలన సాగించిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలుకు కట్టడాల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆరు గ్యారెంటీలు అమలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం కాబట్టి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో! ఆలోచించాల్సి ఉంది.

తెలంగాణ ఐఏఎస్‌ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-66.wav?_=13

తెలంగాణ ఐఏఎస్‌ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడిన ఐపీఎస్‌ అధికారి డి.ఎస్‌. చౌహాన్‌, ఐ.ఎ.ఎస్‌ అధికారి హరి చందనలపై ఆల్‌ ఇండియా సర్వీస్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు సురేష్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. మంగళవారం ఢల్లీిలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖా మంత్రి జితేంద్ర ప్రసాద్‌ కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌ (ఎమ్మెల్సీ), బాల్క సుమన్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌లు

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-5.wav?_=14

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల,నడికూడ,దామెర,ఆత్మకూరు మండల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని,గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు సమావేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని, మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలన్నారు.స్థానిక సంస్థలు ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలిస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందిఅని,సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అన్నారు.విలేజ్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్లి ప్రజా సమస్యలకు ప్రియార్టీ ఇస్తామని,వచ్చే ఆదివారం సమావేశాల్లో ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని 60 ఓట్లకు ఒక బాధ్యున్ని నియమించాలన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతున్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలోని సమస్యలను చర్చించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు.గ్రామాల వారిగా జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపట్ల ప్రజలలో నమ్మకం కలిగిందని అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2-6.wav?_=15

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చత్రపతి అని పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులంలో పుట్టడం గర్వ కారణం అని మొగులు సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని ప్రభుత్వం పట్టించుకునే పాపను పోలేదన్నారు. ఆ మహనీయుని చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటుకు కృషి చేస్తున్నారని వచ్చే జయంతి వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సభ్యులు బజార్ సిద్దా గౌడ్, వెల్దుర్తి బాల్ రాజా గౌడ్, బజార్ వెంకట గౌడ్,చంద్ర గౌడ్, బజారు చిన్న తిరుమల గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్,బజారు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,అంజా గౌడ్, పర్షరాములు గౌడ్, వినయ్ గౌడ్, బొప్పాపూర్ రాజు గౌడ్, సత్య గౌడ్, చంద్రకాంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version