షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి
రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
వ్యవసాయ ఆధికారికి వినతి పత్రం అందజేత
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…
రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ
పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు సోమవారం
మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంతో రావుల సోమయ్య మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వం కళ్ల మూచుకొనీ ఉందన్నారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.