సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-77-2.wav?_=1

 

సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి

ఉత్పత్తిలో వెనుకబడిన వారు వేగం పెంచాలి

రెండు షిఫ్ట్ లలో ఉత్పత్తి చేయాలి

త్వరలో ఆర్డర్ల బిల్లులు చెల్లిస్తాం

చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా
రామయ్యార్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో సమీక్ష

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తి ఆర్డర్ ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సూచించారు. ఎస్ హెచ్ జీ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరై, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుక బడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు ఏకరూప చీర చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు.ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్ లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించడం జరిగిందని వివరించారు. మొత్తం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50 శాతం పూర్తి అయిందని వెల్లడించారు. మిగతా ఆర్డర్ ను వచ్చే నెల 15వ తేదీ లోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు పవర్ లూమ్స్, కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో వెనుకబడిన వారు తమ ఆర్డర్ పూర్తి చేయని పరిస్థితుల్లో మిగతావారికి దానిని అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమ బాధ్యుల వద్ద ఉన్న వస్త్రాన్ని వెంటనే గోదాముకు తరలించాలని సూచించారు. దీంతో మిగతా ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిరంతరం ప్రభుత్వ ఆర్డర్లు అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలోని యంత్రాలను ఆధునీకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. దీంతో మార్కెట్ తో పోటీ పడే అవకాశం ఉంటుందని, మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు.వస్త్ర పరిశ్రమ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, జీఎస్టీ తదితర సమస్యలను పరిశ్రమ బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆట సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకువెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ జేడీ, టెస్కొ సీజీఎం ఎన్ వీ రావు, ఏడీ రాఘవరావు, అధికారులు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

బేతేలు ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుక

 

బేతేలు ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుక

మాజీ కౌన్సిలర్ మడికొండ శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి

మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డ్ సీఎస్ఐ కంపౌండ్ ఆవరణలోని బెతెల్ ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆశ్రమంలోని మథర్ థెరిసా పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించి ఆశ్రమంలోని పిల్లలకు చాక్లెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదర్ థెరిస్సా సమాజానికి చేసిన సేవలను కొనియాడారు,తన జీవతాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహనీయురాలని,మానవ సేవే మాధవ సేవ అని బోదించి,సమాజంలోని వికలాంగులను వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని,కన్నతల్లి కన్నా కంటికి రెప్పలా కాపాడినారని, అందుకే మదర్ థెరిస అమ్మలా పిలవబడ్డారని,ప్రార్థించే పెదవుల కంటే సాయoచేసే చేతులే మిన్న అని తన జీవితం ద్వారా నిరూపించిన మానవతా మూర్తి,భారతరత్న మదర్ థెరిసా అని కొనియాడారు.

గ్రామ స్థాయిలో సర్పంచ్ లు లేకపోవడంతో కుంటుపడుతున్న అభివృద్ధి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-75-1.wav?_=2

 

గ్రామ స్థాయిలో సర్పంచ్ లు లేకపోవడంతో కుంటుపడుతున్న అభివృద్ధి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామాల్లో పాలకవర్గాల పాలన లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని బి అర్ ఎస్ యువ నాయకులు షేక్ సోహేల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ప్రత్యేకాధికారుల ముగిసి పాలన సాగుతోంది అని. ప్రత్యేకాధికారులు వారివారి బాధ్యతల్లో బిజీగా ఉండటంతో పాలన గాడితప్పింది అన్నారు. ఇప్పటికే పలుమార్లు పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని తెలిపినా అధికారుల్లో మార్పు రావడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయితే ప్రతీ చిన్న పనికి ప్రత్యేకాధికారుల అనుమతి తీసుకుని రావాల్సి వస్తోంది. వారు అందుబాటులో లేని సమయాల్లో కార్యదర్శులు ఇబ్బందులు పడుతూ పంచాయతీల్లోని విధులు ఎలాగోలా నెట్టుకు వస్తున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఏడాదిగా విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని వెంటనే పాలకవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించాలని కోరారు..

సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-74-2.wav?_=3

సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు

నిందుతుణ్ణి ఢిల్లీలో పట్టుకున్న జిల్లా సైబర్ టీమ్

వివారలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఢిల్లీకి చెందిన సత్యం అనే వ్యక్తి ప్రస్తుతం CA చదువుతూ దొంగిలించిన మొబైల్ ఫోన్స్ యొక్క లాక్ లు తన తండ్రి మొబైల్ రిపేర్ షాప్ నందు లాక్ లు తీసి అట్టి మొబైల్స్ మరియు కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగు కడప జిల్లా చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తికి కొరియర్ ద్వారా పంపగా ఇద్దరు కలసి ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు కాల్స్ చేస్తు హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని చెప్పి బాధితులకు దొంగిలించిన మొబైల్స్ నుండి కాల్ చేస్తూ వారికి ఒక లింక్ పంపించి ఆ లింకు ఓపెన్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని మోసాలకు పాల్పడుతున్నరు.
అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలంలో ధమ్మా రాజిరెడ్డి అనే బాధితునికి మరియు వేములవాడ టౌన్ పరిధిలో బొల్గమ్ ప్రేమ కుమార్ అనే బాధితులకు నిందుతులు సత్యం మరియు సలీం మాలిక్ కాల్ చేసి ఆరోగ్య శ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని చెప్పగా బాధ్యతలు నమ్మి UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా ముస్తాబాద్ కి చెందిన రాజిరెడ్డి నాలపైఆరు వేల రూపాయలు, ప్రేమ కుమార్ పదివేల రూపాయలు నష్టపోవడం జరిగినది. రాజిరెడ్డి పిర్యాదు మేరకు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, మరియు సిబ్బంది గంగారెడ్డి,రాజు, కిట్టు, మహేష్,ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం లు టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా గతంలో సలీం మాలిక్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని, సత్యంను ఢిల్లీ లో అదుపులోకి తీసుకొవడం జరిగిందని,సత్యం అనే నిందుతునిపై తెలుగు రాష్టాల్లో NCRP పోర్టల్ నందు 118 ఫిర్యాదులల్లో సుమారు 90 లక్షల మోసాలు చేసినట్టు గుర్తించడం జరిగిందని,
నిందుతుణ్ణి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. నిందుతులను పట్టుకోవడంలో కృషి చేసిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,సైబర్ టీం ఆర్.ఐ ఎస్.ఐ జునైద్ ,సైబర్ సిబ్బంది కిట్టు, గంగారెడ్డి,మహేష్, రాజు, ముస్తాబద్ కానిస్టేబుల్ కాశిం,
లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో డేరింగ్‌ కింగ్‌

-డైమనిక్‌ పాలిటిక్స్‌లో ఆరి తేరిన లీడర్‌!

-ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడు.

-రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు.

-ఎవ్వరి సలహాలు తీసుకోడు.

-తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు.

-తన నిర్ణయాలు వెంట నడిచే వారిని వదులుకోడు.

-ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు.

-రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని తెలుసు.

-అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు.

-ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడు.

-రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు.

-తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు.

-ఎదురయ్యే సమస్యలను క్షణాలలో మరిపించగలడు.

-రెండేళ్ళలలో జరిగిన పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు.

-తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు.

-మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోగలడు.

-ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు.

-రాజకీయ వ్యతిరేకుల చేత కూడా దటీజ్‌ రేవంత్‌ అనిపించుకోగలడు.

-రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి.

-ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

డైవర్ట్‌ అనే మాట లేకుండా దేశంలో రాజకీయాలు సాగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు అదే అనుసరిస్తున్నాయి. ఆ దారిలోనే నడుస్తున్నాయి. అలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ఎవరు సమర్థవంతంగా పోషిస్తే రాజకీయాలలో వాళ్లే కింగ్‌లౌతున్నారు. అలాంటి నాయకులే దేశమంతటా సాగుతున్నారు. డైవర్షన్‌ రాజకీయాలే ప్రపంచమంతా సాగుతున్నాయనేది కూడా ముమ్మాటికీ నిజం. అలాంటి రాజకీయాలను నమ్ముకుంటే తప్ప రాణించలేమని నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. రాజకీయం కూడా ఒక లక్ష్యం చేసుకొని నాయకుడవ్వాలి. రాజకీయాలలో డైవర్షన్లు, డైమెన్షన్లు సహజం. అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావు. నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడలాంటే లాజిక్‌ల కన్నా మ్యాజిక్‌లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నమ్మకాల విన్యాసాలే రాజ్యమేలుతాయి. జనం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త దనం కోరుకుంటారు. ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడు విజేత అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మడికట్టుకునే రాజకీయాలు సాధ్యం కాదు. భీమ్మించుకొని కూర్చుంటే అసలే సాధ్యం కాదు. ఎత్తుకు పైఎత్తులలో అవతలి వారిని చిత్తు చేయాలంటే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే..గత పాలకుల కన్నా భిన్నంగా పాలిస్తానని నాలుగు మాటలు చెబితే ప్రజలు ఆహ్వానించే రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పిన వారిని కూడా ప్రజలు ఆదరించిన సందర్భాలు కూడా లేవు. జనం కోరుకునే వాటినైనా నాయకులు కళ్ల ముందు వుంచుతామనే మాటలు చెప్పి ఒప్పించాలి. లేకుంటే నాయకుడి ఆలోచనల్లోకైనా జనాన్ని రప్పించి గోల్‌ కొట్టాలి. ఒక్కసారి వెనుకబడితే ముందుకొచ్చే రోజులు కావు. ఎదురొచ్చిన వారి నుంచి తప్పుకుంటూ కాకుండా, వారిని తప్పిస్తూ ముందుకు వెళ్తేనే సక్సెస్‌ అవుతున్న రోజులు. ఈ ఎత్తులు, వ్యూహాలు ఆది నుంచి అనుసరిస్తూ, ఆచరిస్తూ ముందుకెళ్లి సక్సెస్‌ అయిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆయన అవకాశాలు ఎదురు రాలేదు. అవకాశాలను తన వైపు తిప్పుకొని గెలుస్తూ వచ్చాడు. నిజం చెప్పినా సరే తనదైన శైలిలో చెప్పి గెలిచాడు. అబద్దాలు చెప్పినా సరే జనం అవే వాస్తవమని నమ్మేలా చేశాడు. డైరెక్ట్‌గా డైవర్షన్‌ పాలిటిక్స్‌లో కింగ్‌ అయ్యారు. రాజకీయాలలో ఎలా గెలిచారన్నది ఎప్పుడూ పాయింట్‌ కాదు. గెలిచారా లేదా? అన్నదే కీ పాయింట్‌. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచారు. అవతలి వారిని ప్రతిసారి ఊహించని దెబ్బ కొట్టడంలో ఆరి తేరిన నాయకుడనిపించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అసమ్మతి నుంచి సమ్మతి పొందిన నాయకుడై వెలుగొందుతున్నారు. బరి గీసి నిలబడి, ఎదురించి నిలబడి విజయాన్ని దాసోహం చేసుకుంటున్నారు. దటీజ్‌ రేవంత్‌ రెడ్డి అని ప్రత్యర్థుల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాజకీయాలలో రకరకాల భిన్నాభిప్రాయాలు వుండొచ్చు. అభిప్రాయ బేధాలు పొడసూపొచ్చు. కానీ కాదనుకున్న వారి చేత కొనియాడబడే స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ సాధ్యం అసలే కాదు. అందుకు అకుంఠిత దీక్ష అవసరం. కష్టాలు, నష్టాలు తరుముతున్నా నిలబడే ధైర్యం కావాలి. అన్నిటికన్నా గుండె నిబ్బరంగా వుండాలి. కష్టాలను చిరు నవ్వు తో స్వాగతించే మనస్తత్వం అలవడాలి. గెలుపే లక్ష్యం తప్ప మిగతావన్నీ చాలా చిన్న సమస్యలుగానే చూడాలి. లక్ష్యం పెద్దదైనప్పుడు ఎదురయ్యే సమస్యలు గడ్డిపరకలుగా మార్చుకోవాలి. ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినను అనే రాజకీయాలు చేయడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి దిట్ట. మనకంటూ కొన్ని పక్కా వ్యూహాలు సొంతగా వుండాలి. వాటికి తోడు ఇతర నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మొత్తం ఇతరుల మీద ఆధారపడితే మొదటికే మోసం రావొచ్చు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అందుకే రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అటు కేసిఆర్‌ ను పదే పదే రెచ్చగొట్టి, మీడియా అటెన్షన్‌ అంతా తనవైపు తిప్పుకునే వారు. పిసిసి అధ్యక్షుడుగా వున్న సమయంలో ఒక్కరోజు కూడా రాజకీయాలకు దూరంగా వున్నది లేదు. కేసిఆర్‌ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు. మల్లన్న సాగర్‌ బాదితుల పక్షాన పోరాటం చేసినా, బాసర విద్యార్థుల పక్షాన నిలిచే రాజకీయం చేసినా ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు. తన నిర్ణయాలతో వెంట నడిచే వారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఇంతటి మంచి తనం రేవంత్‌ రెడ్డి సొంతం. అందుకే పార్టీలకు అతీతంగా రేవంత్‌ రెడ్డి ని ఇష్టపడతారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా వ్యక్తుల మధ్య వుండే స్నేహపూర్వక సంబంధాలు వేరు. ఇప్పుడున్న రోజులలో రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని రేవంత్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఎలాంటి గాడ్‌ ఫాదర్‌ లేకుండా రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం రేవంత్‌ లా అందరికీ సాధ్యం కాదు. ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడగా తనను తాను నిరూపించుకున్నాడు. నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడు కూడా ఒక మాట అనడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నాడు. గతంలో కేసిఆర్‌ ఉద్యమ కాలంలో ఎంతటి వారినైనా సరే చీల్చి చెండాడే వారు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఒక రకంగా జంకుతున్నాడు. ఎందుకంటే తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు రేవంత్‌ రెడ్డి. తన పాలనలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎదురైన అనేక సమస్యలను క్షణాలలో మరిపించగలిగేలా ఎత్తులు వేస్తూ వస్తున్నాడు. రెండేళ్ళలలో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. దానిని వివాదం చేయాలని బిఆర్‌ఎస్‌ ఎంత చూసినా ఆ పార్టీకి సాధ్యం కాలేదు. బిఆర్‌ఎస్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిన దాని ముందు సుంకిశాల ఎంత చిన్నది అని ఎదురుదాడి కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి మొదలుపెట్టారు. దానిని పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్‌ దంటూ బిఆర్‌ఎస్‌ ను దబాయించారు. ఆఖరుకు ఆ పాపం కూడా బిఆర్‌ఎస్‌ ఖాతాలో వేసి ఎదురుదాడి చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు బిఆర్‌ఎస్‌ సుంకిశాల మీద మాట్లాడిరది లేదు. అలా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరికించడం రేవంత్‌ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పకతప్పదు. ఆ మధ్య ఎస్‌ఎల్బీసి టన్నెల్‌ వ్యవహారం ఎటు పోయిందో కూడా తెలియనంతగా రాజకీయాలను తన వైపు తిప్పుకోగల సమర్థవంతమైన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కాకపోవడానికి కూడా కేసిఆరే కారణమని ప్రజలను నమ్మించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. కేవలం కేసిఆర్‌ చేసిన అప్పుల మూలంగా నెల నెల మిత్తీలకే 6 వేల కోట్లు చెల్లిస్తున్నానని చెప్పి, ప్రజలను నమ్మించి పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు ఒక్క సీటు కూడా రాకుండా రాజకీయం చేసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. రాజకీయంగా తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు. మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోవడంలో రేవంత్‌ రెడ్డి దిట్ట. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

యజూర్ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ కరాటే చాంపియన్..

యజూర్ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ కరాటే చాంపియన్..

https://youtu.be/1w_Z9GZ39NA

అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో రోలింగ్ షీల్డ్ సాధించిన యజుర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్, కరాటే కుంగ్ ఫూ , టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలలో వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.. హనుమకొండ జిల్లా నుండి వివిధ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనగా యజూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వివిధ విభాగాలలో పథకాలను సాధించారు. తమ కృషి శిక్షణ మరియు ప్రతిభతో మెరిసిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రోలింగ్ షీల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఏకైక పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.

ఈ ఛాంపియన్షిప్ పోటీలలో యజుర్ పబ్లిక్ స్కూల్ నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పాల్గొనగా ఇందులో 26 మంది స్వర్ణ పథకాలు, 10మంది రజత పథకాలు, ముగ్గురు కాంస్య పథకాలు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు..ఈ విజయంతో యజూర్ పబ్లిక్ స్కూల్ మరో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందిందని ఈ గొప్ప విజయంలో విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ క్రాంతి కుమార్ ను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ అహ్మద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంతా అభినందించారు..

కరాటే టోర్నమెంట్స్- 2025 పోటీల్లో ఛాంపియన్షిప్ సాధించిన యజూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు..

అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో రోలింగ్ షీల్డ్ సాధించిన యజుర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్, కరాటే కుంగ్ ఫూ , టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలలో వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.. హనుమకొండ జిల్లా నుండి వివిధ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనగా యజూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వివిధ విభాగాలలో పథకాలను సాధించారు. తమ కృషి శిక్షణ మరియు ప్రతిభతో మెరిసిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రోలింగ్ షీల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఏకైక పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.

ఈ ఛాంపియన్షిప్ పోటీలలో యజుర్ పబ్లిక్ స్కూల్ నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పాల్గొనగా ఇందులో 26 మంది స్వర్ణ పథకాలు, 10మంది రజత పథకాలు, ముగ్గురు కాంస్య పథకాలు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు..ఈ విజయంతో యజూర్ పబ్లిక్ స్కూల్ మరో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందిందని ఈ గొప్ప విజయంలో విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ క్రాంతి కుమార్ ను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ అహ్మద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంతా అభినందించారు..

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్.

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
కాంగ్రెస్ యాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బిజెపి నాయకులు
అక్రమ అరెస్టులను ఖండించిన బిజెపి నాయకులు

నేటిధాత్రి ఐనవోలు :-

 

వర్ధన్న పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జనహిత పాదయాత్రను అడ్డుకోవడానికి వెళుతున్న ఐనవోలు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మాదాసు ప్రణయ్ పొన్నాల రాజు , బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు పులిసాగర్ గౌడ్, కట్కూరి రమేష్ లను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రణయ్ మాట్లాడుతూ బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి జనహిత పాదయాత్ర పేరుతో జనాలను ముంచే పాదయాత్ర చేస్తూ కాలం వెళ్లిబుచ్చే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని ప్రభుత్వంను ప్రశ్నించేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.

మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,.

మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,

కేసముద్రం/ నేటి దాత్రి

 

రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని జనవిజ్ఞాన వేదిక కేసముద్రం మండల అధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్, ప్రధాన కార్యదర్శి బండారు నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.

వారు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్( పి ఓ పి) విగ్రహాలను నదులు, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఆ విగ్రహాల్లో వాడే కెమికల్ రంగులు నీటిని కలుషితం చేసి, చేపలు మరియు జలచరాల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నాయి. చివరికి ఇది మనిషి ఆరోగ్యానికే హానికరమవుతోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మట్టితో తయారు చేసిన విగ్రహాల ప్రాముఖ్యతను వివరించారు. మట్టి విగ్రహాలు నీటిలో కరిగిపోవడం వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదని, మట్టి తిరిగి నేలలో కలిసిపోయి భూమి సారాన్ని పెంచుతుందని తెలిపారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఇది ఉపయోగకరమని, స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మట్టి విగ్రహాల వాడకం సహకరిస్తుందని అన్నారు.

ప్రజలందరూ పర్యావరణ హిత దృక్పథంతో ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలనీ, శుభ్రమైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో భాగస్వాములు కావాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం అధికారులు తనిఖీ.

ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం అధికారులు తనిఖీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రంలో వివిధ ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం సబ్ ఇన్స్పెక్టర్ పాటిల్ క్రాంతి కుమార్ మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం యూరియా నిల్వల గురించి సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది ,
యూరియా ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు అమ్మవలెను, ఎరువుల నిల్వ మరియు ధరల వివరాలను స్టాక్ బోర్డు మీద రోజు వారిగా పొందుపర్చాలని సూచించారు.
అధిక ధరలకు అమ్మిన యెడల సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధున్ని ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు.

రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధున్ని ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ఎస్.కె గఫాషా( 80) అనే వృద్ధుడు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై గాయాలతో పడి ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి 108కు సమాచారం ఇవ్వడంతో అట్టి అంబులెన్స్ లో వృద్దున్ని చికిత్స నిమిత్తం వేములవాడ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం వృద్ధుడు మాత్రల కోసం మెడికల్ షాప్ కు వెళుతుండగా ఏమి జరిగిందో తెలువదు కానీ రోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నాడని వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి గణేష్ నాయక్, పైలట్ తోట నరేందర్, గ్రామస్తులు ఉన్నారు.

యూరియా కోసం బిఆర్ఎస్ ధర్నా – కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసి పరిషత్..

లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసీ పరిషత్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని లింగగూడెం మండల పరిషత్ పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు మాట్లాడుతూ పాఠశాల దుస్థితి శిథిలావస్థకు చేరి ఉన్నదని ఈ యొక్క పాఠశాల ను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అలాగే మండలంలోని వివిధ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి గుత్తేదారులు అసంపూర్తిగా పనులు చేశారని వాటినన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండెకట్ల మహేందర్ ఉపాధ్యక్షులు ఇసం లెనిన్ కోశాధికారి అరేం సందీప్ దొర మండల కార్యదర్శి ఇసం శివాజీ సలహాదారులు పెండేకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సిర్గాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రైతుల ధర్నా…

సిర్గాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రైతుల ధర్నా…

◆:-ముఖ్య అతిథిలుగా హాజరైన సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్…

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు,

◆:- నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* …

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నల్లవాగు ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల నీళ్ళు వదులుతూ ప్రజల మన్ననలు పొందాలని చూస్తే ఎవ్వరు పిక్చోలు లేరు అని డిమాండ్ చేశారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టు పైన మీ ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేశారు తెలపాలి
నల్లవాగు ప్రాజెక్టుకు మీరు ఎలాంటి రిపేర్లు చెయ్యలేదు నిధులు గాని మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ వారి వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్నారు మీరు. కాలువలు మరమ్మత్తులు గాని పూడిక తీయడం గాని చేసింది మా బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలోనని ఉన్న నీటిని అన్నారు. వ్యవసాయదారులకి అందించకుండా కాలయాపన చేసింది మీరు అని ఎద్దేవ్య చేశారు రైతులకు నీళ్లు ఇవ్వాలని మా పంటలు ఎండిపోయిన నష్టపోయే ప్రమాదం ఉందని ముందుకు వచ్చేసరికి ప్రజలు తిరగబడతారని ఉద్దేశంతో నేడు వచ్చి నీరు విడుదల చేస్తున్నావ్ కానీ మీరు నల్లవాగు ప్రాజెక్టు పైన ఇలాంటి నిధులు మంజూరు చేయలేదు ఇలాంటి పనులు చేయలేదు.కానీ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారూ.. కానీ ఇప్పటికైనా మీరు రైతులకు కనీసం యూరియా కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులను తప్పు దోవ పట్టించడం మానుకొని వాళ్లకు అందించాల్సిన యూరియా గాని నల్లవాకు ప్రాజెక్ట్ పైన కుడికాలువ ఎడమకలవల నీళ్లను గాని సకాలంలో అందిస్తూ అభివృద్ధికి పాటుపడేలా తప్ప మందిపై బురద జలగం మానుకోవాలని ఎద్దేవా చేశారు.

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల వైద్య శిబిరం…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు, టాబ్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, రోహిణి, నిహారిక, పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరి ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని వినాయక చవతి పండగ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడారు.రసాయన రంగులు అద్దిన విగ్రహాలను వాడొద్దని వాటి వల్ల నీరు కలుషితమై అటు వ్యవసాయానికి,ప్రజలు అనునిత్యం తాగే నీళ్లు చెరువు నుండి డ్యామ్లనుండి అలాగే గంగనుండి సేకరించి మిషన్ భగీరథ ద్వారా నీటిని మన ఇంటికి పంపుల ద్వారా అందిస్తున్నారు.కాబట్టి ఇప్పటికే మనం ఎన్నో మందులు లేని జబ్బులతో సతమవుతాం అవుతున్నామని,ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి గురై జబ్బులు వస్తాయని ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ గణేష్ మండపాలలో మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని తెలియజేశారు.అలాగే తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైభవం కోసం వైభోగం కోసం హంగులు ఆర్ బాటల కోసం పెద్ద పెద్ద ప్యారో ప్లాస్టో విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని పాడు చేయద్దని దిశా నిర్దేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. ఏదో పనిమీద వేరే ఊరి వెళ్ళినప్పుడు తాడి చెట్టు అంత ఎత్తున విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూచాయిగా దానికి ఎంత అయింది అని అడిగినప్పుడు 2,50,000 అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఎంపీడీవో స్పందించి ఇదే డబ్బులు మీరు పెదా,నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత పంచి వారి కుటుంబ పోషణకు ఉపయోగపడాలని అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ డబ్బులు డైవర్ట్ చేయమని సలహా ఇచ్చారన్నారు.ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తాండూర్ మండల ప్రజలు కూడా ఈరోజు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తాండూర్ మండలం ఆటో కార్మికులని,అధ్యక్షులని అభినందించారు. కార్యక్రమము తనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు కొత్తగా వచ్చిన తాసిల్దార్ ని,ఎంపీడీవో ని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.అదేవిధంగా హబీబ్ పాష మాట్లాడుతూ.. పార్కింగ్ స్థలాలు,ఆటో భవన్ నిర్మాణం కోసం ఆటో కార్మికులకు ఒక 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మార్వోకి ,ఎంపిడిఓకి తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ కి ,మాదారం ఎస్సై సౌజన్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆటో కార్మికులకి, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆటోమాలి,తీర్మాన కమిటీ సభ్యులు నీలపల్లి మల్లేష్,అచ్చులాపూర్ ఆటో కార్మికులు చందు,విజయ్ చింతల లచ్చన్న,కుచ్చుల సంతోష్,చంద్రవెల్లి నాగేష్,బట్టి తిరుపతి,తంగళ్ళపల్లి డ్రాగన్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T164829.319.wav?_=4

 

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిమండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డిహాజరై వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత రైతులను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేసిందని తెలిపారు.రైతులకు ఎరువులు సమయానికి అందకపోవడం వల్ల పంట నష్టాలు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకువచ్చి, ఎరువుల సరఫరా నిరవధికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి మండల రెవెన్యూ అధికారి గారికి ఈ విషయాన్ని తెలియజేసాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరాం,” అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.అలాగే, గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రైతుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ జిల్లా ఉపధ్యక్షుడు బొడ నరసిహ్మ పట్టణ అధ్యక్షులు బబిదేవ్ జిల్లా కాన్సిల్ సభ్యులు కిష్టారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు రహ్మతులా, pacs వైస్ చైర్మన్ శ్యాంసుందర్, గoగధర్,మండల ప్రధాన కార్యదర్శులు బచలకుర శ్రీశైలం,శ్రీను,ముదిరాజ్ నప శివ, ఉపాదేక్షులు బాలకృష్ణ, రాజశేఖర్, పానుగంటిశివ,మంద రజురెడ్డి, లిoగారెడ్డి,నాగరాజు,సురేష్ గౌడ్, వెంకటేష్, వినయ్ రెడ్డి, అంజనేయులు,అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం డిమాండ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-93-1.wav?_=5

నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వం

.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి….

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్

యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా మలహలరావు మండలం లోని కొయ్యూరు గ్రామంలోని ఆదివాసి గిరిజన కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది 60 కుటుంబాలు ఉన్న నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నాం నిరుపేదలైన ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వాయిస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఆ కాలనీవాసులను మందలించగా మాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ కాలనీ వెనుకబడిపోతుందని తక్షణమే సర్వే నిర్వహించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా అధికారులకు ఆదేశించాలని లేనియెడల నిరుపేదలను సమీకరించి ఆందోళనలో పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ దళితులకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి కూడా ఇల్లు అచ్చిన దాకాలు కానరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లన్న సేద మల్లేష్ గొట్టం సమ్మక్క అరవండి లక్ష్మి సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-92-1.wav?_=6

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

రామాయంపేట ఆగస్ట్ 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన 400 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎం. దేవేందర్ గారు పంపిణీ ప్రారంభించారు.

Clay Ganesha Distribution

ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను అందజేస్తోందని కమిషనర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తదనంతరం మిగిలిన విగ్రహాలను మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులకు వార్డు అధికారులు, మహిళా రిసోర్స్ పర్సన్‌ల సమక్షంలో పంపిణీ పూర్తి చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Exit mobile version