మట్టి గణపతులను ఉంచి పర్యావరణాన్ని రక్షించాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T160541.014-1.wav?_=1

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలి

పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వలన జల కాలుష్యం ఏర్పడి జీవవైవిధ్యానికి నష్టం కలుగుతుందని,ఈ సందర్భంలో ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.వినాయక చవితి పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా,ఆనందోత్సాహంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version