ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు..

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించనలేదని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandra babu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించనలేదని ప్రశ్నించారు.

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్…

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మ‌హిళా పారిశ్రామిక‌వేత్తను త‌యారు చేసే ప్రణాళికలు అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి వేదికగా లోకేశ్ మాట్లాడారు.

మూసీ ప్రాజెక్టుపై మాటల యుద్ధం

· బీఆరఎస్ ప్రణాళిక నీటిశుద్ధి, కొన్ని ప్రాంతాల సుందరీకరణకే పరిమితం

· ప్రపంచ స్థాయి రివర్‌బెడ్‌గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రణాళిక

· ఈ కారణంగానే ప్రాజెక్టు ఖర్చు పెరిగింది: ప్రభుత్వం

· కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం బఫర్‌జోన్ 50 మీటర్లు తప్పనిసరి

· వరదలనుంచి రక్షణకు ఇది అవసరం

· ఆ పరిధిలో వున్న ఇళ్లను తొలగించాల్సి వచ్చినా తప్పదు

· స్పష్టం చేస్తున్న నిబంధనలు

· పునరావాస ప్యాకేజీతో ప్రభుత్వం ముందుకు

· బాధితులతో చర్చించకుండా ముందుకెళ్లడమేంటన్నది విమర్శకుల వాదన

· 10 నుంచి 15వేల ఇళ్లకు తొలగింపు గండం

హైదరాబాద్, నేటిధాత్రి: 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు మొత్తం వివాదాల్లో చిక్కుకుంది.ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నదని ఆరోపించడమే కాదు “మూసీ దండి మార్చ” వంటి ర్యాలీలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును కేవలం రూ.16800 కోట్లతో పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు రచించామని, పేదల ఇళ్లను కూల్చే పరిస్థితే ఉత్పన్నం కాకుండా మొత్తం మూసీనది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని బీఆరఎస్ ఆరోపిస్తోంది. మూసీ సుందరీకరణకు పేదల ఇళ్లు కూలగొట్టాల్సిన అవసరం లేదన్నది హరీష్‌రావు, కేటీఆర్‌ల వాదన. కేవలం రూ.15వేలనుంచి రూ.16వేల లోపు ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.1.5లక్షలకు పెంచేసిన రేవంత్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదనేది వారి వాదన.

నిజానికి ఈ మూసీ రివర్ ప్రాజెక్టు పొడవు 55 కిలోమీటర్లు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో విస్తరించిన కారిడార్ ఇది. ప్రాజెక్టు తొలిదశలో ఉస్మాన్ సాగర్, హిమయత్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టు పనులు చేపడతారు. ప్రస్తుత ప్రభుత్వం మొదట్లో రూ.58వేల కోట్ల అంచనాల తో ఈ మొత్తం ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటికీ, అంతర్‌సిటీ మౌలిక సదుపాయాలు, మెట్రోరైల్‌విస్తరణ వంటివి కూడా జతచేయడంతో ప్రాజెక్టు ఖర్చు ఏకంగా రూ.1.5లక్షల కోట్లకు చేరింది.అయితే గత బీఆరఎస్ ప్రభుత్వం ప్రధానంగా మూసీనది నీటిని ప్రక్షాళన చేయడానికి ప్రాధాన్య తనిచ్చింది. ఇందుకోసం 31 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించి నీటిని శుద్ధి చేయడం తర్వాత గోదావరి జలాలను మూసీలోకి తరలించడం ద్వారా దీన్ని ఒక జీవనదిగా మార్చాలన్న ఉద్దే శంతో ముందుకెళ్లింది. ఈ సీవేజ్ ప్లాంట్లతో నగరాలనుంచి విడుదలవుతున్న 1200 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేయవచ్చునని బీఆరఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారు. 57.5 కిలోమీటర్ల పొడవునా నదికి ఇరువైపులా గోడలను నిర్మించడం ద్వారా వరదలను నివారించవచ్చన్నది ఆయన వాదన. 

ఇందుకు ఉదాహరణగా నాగోల్ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు 5 కిలోమీటర్ల మేర ఇళ్లు కూలగొట్టకుండానే తాము అభివద్ధి చేసిన ప్రాంతాన్ని చూపుతున్నారు. అందువల్ల ఇళ్లు కూలగొట్ట కుండానే, మూసీనది పర్యావరణ వ్యవస్థను శుద్ధి చేయడం లక్ష్యంగా తమ ప్రణాళిక కొనసాగిం దని బీఆరఎస్ నేతలు చెబుతున్నారు.ఇందులో భాగంగానే స్ట్రాటిజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎసఎన్‌డీపీ)కింద డ్రైనేజీ, వరద నిర్వహణపై బీఆరఎస్ ప్రభుత్వం తొలిదశలో దష్టి కేంద్రీకరించడం వల్ల బుల్డోజర్‌లకు పనిచెప్పాల్సిన అవసరం రాలేదు. కాగా సింగపూర్‌కు చెందిన మె యిన్‌హార్‌దత్ కన్సార్టియమ్‌ను ఈ ప్రాజెక్టు డిపీఆర్, మాస్టర్ ప్లాన్ తయారుచేయడానికి నియమించడాన్ని బీఆరఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇతరదేశాల్లో ఆర్థిక అవకతవకలు పాల్పడిన ఆరోపణలతో పాటు, లీగల్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్న ఈ కంపెనీకి మాస్టర్‌ప్లాన్, డీపీఆర్ పనులు అప్పగించడమేంటని బీఆరఎస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. 

ఈ ప్రాజెక్టు కింద మరో వివాదమేంటంటే బఫర్‌జోన్ పరిధిలో పదివేల నుంచి పదిహేనువేల నిర్మాణాలను కూలగొట్టాలని నిర్ణయించడం నిత్య నిరసనలకు దారితీసింది. దశాబ్దాల తరబడి ఇ క్కడ నివసిస్తూ ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తూ వస్తున్న తాము ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందన్న భయం ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. తగిన పరిహారం, ప్రత్యామ్నాయాలను చూపకుండానే ప్రభుత్వం తమను నిరాశ్రయులను చేస్తుందన్న భయం వీరి ఆందోళనకు, ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం. అదీకాకుండా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) లేదా ప్రజల పునరావాస పాలసీని ప్రకటించకుండానే, అధికార్లు కూలగొట్టాల్సిన ఇళ్లకు మార్కింగ్‌లు వేయడంతో, ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదన్న అభిప్రాయం ఈ ప్రాంత వాసుల్లో నాటుకుపోయింది. ఈ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల వసతి కల్పిస్తామని చెబుతోంది. అసలు విధానానికి తుదిరూపం ఇవ్వకుండా, బాధిత కుటుంబాలతో చర్చించకుం డా ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళుతుందని విమర్శకులు లేవనెత్తుతున్న ప్రశ్న. 

ప్రభుత్వం మూసీ నది ఒడ్డున బాపూ ఘాట్ వద్ద “గాంధీ సరోవర”ను అభివద్ధి చేయాలని చూస్తున్నది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్నవారికి సమగ్ర పునరావాస చర్యలు చేపడతా మని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇందులో భాగంగా ఈ మూసీనది ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పో యే పేదలకోసం సుమారు 16వేల ఇందిరమ్మ ఇళ్ల (2బీహెచ్‌కే) యూనిట్లను కేటాయించింది. వీరిలో రివర్‌బెడ్‌లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం మానవతా సహాయంగా ఈ చర్య చేప ట్టింది. అయితే బఫర్ జోన్‌లలో నివాసం వుండేవారు “ఆరఎఫ్‌సీటీఎలఏఆరఆర్ చట్టం`2013” కింద నష్టపరిహారానికి అర్హులు. భూమి మార్కెట్ విలువతో పాటు, ఇంటి నిర్మాణ విలువను కూడా నిర్ణయించి ఆ మొత్తం చెల్లిస్తారు. ఇక ఎటువంటి పట్టాలు లేని భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల (2బీహెచ్‌కే) కేటాయింపు వుంటుంది. ఇక రివర్‌బెడ్‌లో నివసించే కుటుంబాలు తరలి వెళ్లడానికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.25వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాదు ఈవిధంగా తరలించిన వారి జీవనోపాధి, వారి పిల్లలను సమీప స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇక మధు పార్క్‌రిట్జ్ వంటి మధ్యతరగతి ప్రజలు నివాసముండే అపార్ట్‌మెంట్‌లకు రూ.80లక్షల నగదు పరిహారం లేదా ప్రభుత్వం గుర్తించిన 11 గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు ఐచ్ఛికాల్లో ఏదో ఒకదాన్ని అపార్ట్‌మెంట్ వాసులు ఎంచుకోవాల్సి వుంటుంది. 

ఇక మూసీ ప్రాజెక్టు తొలిదశలో 300 ఎకరాల్లో బాపు ఘాట్‌ను ప్రపంచ స్థాయి ఎక్స్‌పర్‌మెంటల్ కేంద్రంగా అభివద్ధి చేస్తారు. ఇక్కడ 123 అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతారు. ఇప్పటివరకు పాట్నాలో నిర్మించిన 72 అడుగల ఎత్తయిన విగ్రహం దేశంలోనే ఎత్తయినది గా పరిగణిస్తున్నారు. కాగా ఇక్కడ నిర్మించబోయేదీ దాన్ని అధిగమించనుంది. ఇక్కడే గాంధీ ఫి లాసఫీ, ఆయన సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన అతిపెద్ద నేషనల్ మ్యూజి యంను నెలకొల్పుతారు. స్థానిక సంప్రదాయ చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు వీలుగా ఒక హ్యాండ్లూమ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. నగరాన్ని వీక్షించేందుకు “లండన్ ఐ స్టెíల్ వీల”ను ఏర్పాటు చేయనున్నారు. ధ్యాన కార్యక్రమాల నిర్వహణకు మెడిటేషన్ విలేజ్‌ను ఏర్పాటు చేస్తారు.బాపు ఘాట్ వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపడతారు. ఇక్కడినుంచి దిగువకు ఫిల్టర్‌చేసి శుద్ధి చేసిన నీటినే దిగువకు వదిలేవిధంగా ఈ నిర్మాణం వుంటుంది. 

తాము ఇళ్లను కూలగొట్టే అవసరం లేకుండానే మూసీనది ప్రక్షాలన చేయవచ్చునని బీఆరఎస్ నేతలు చేస్తున్న వాదనకు సమాధానంగా, 2020 నాటి వరదల విధ్వంసం పునరావతం కాకుండాచూడాలంటే, బీఆరఎస్ చేపట్టిన కార్యక్రమం సరిపోదని, మరింత విస్తరించాల్సిన అవసరం వున్నదని పట్టణ నిపుణులు, అధికార్లు చెబుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలంలో నగర భద్రతకు బీఆరఎస్ ప్రణాళిక సరిపోదని వారు స్పష్టం చేస్తున్నారు. కేవలం నదినీటిని శుభ్రం చేస్తే సరిపోదు. నదీ ప్రవాహానికి తగినంత ప్రదేశం వుండాలి. నదీప్రాంతం ఆక్రమణలకు గురికావడం వల్లనీటి ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడి చుట్టుపక్కల నగర ప్రాంతాలకు ముంపునకు గుర య్యాయన్న సంగతిని వారు 2020 వరదలను ప్రస్తావిస్తూ వివరిస్తున్నారు. మరి బీఆరఎస్ ప్రభుత్వం 2017లో ఈప్రాజెక్టును మొదలు పెడితే ఇంతవరకు 31 సీవేజ్ ప్లాంట్ల నిర్మాణం, నదిలో అతిపెద్ద ఆక్రమణల తొలగింపు వంటివి పూర్తికాలేదన్న సంగతిని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక నదికి 50మీటర్ల బఫర్ జోన్ వుండాలి. వర దలనుంచి రక్షణకు ఈ బఫర్‌జోన్ తప్పనిసరి. ఇందుకోసం ఆయా ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించుకు న్నవారిని అక్కడినుంచి వేరే ప్రదేశానికి తరలించాల్సి వచ్చినా దీన్ని అమలు చేయాల్సిందేనని బఫర్ జోన్ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా నీటిశుద్ధి, కొన్ని ప్రాంతాల సుందరీకరణ వంటి పరిమిత పనులకు బీఆరఎస్ ప్రణాళిక సరిపోతుంది. కానీ ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్‌ను రూపొందించేందుకు పై ప్రణాళిక సరిపోదని, సమగ్రమైన రీతిలో వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని ప్రభుత్వం చెబుతున్నది.

చిన్న మిల్లర్లు పేనుకుంటున్న ఉరితాళ్లు!?

`రాష్ట్ర నాయకుల్లారా ఇప్పటికైనా సిగ్గుపడండి?

`అసలు డిఫాల్టర్ లు మిల్లర్లా! పాలకులా?

`పాలకులను ప్రశ్నించలేని యూనియన్లు ఎందుకు?

`బకాయిల పేరుతో పెరుగుతున్న ఒత్తిళ్ళు?

`చిన్న మిల్లర్ “చితి”కి పోతున్నా యూనియన్ నాయకులు కదలరా?

`500 మంది కోసం 3000 మందికి ఉరితాళ్లు పేనుతారా?

`ఆమె ప్రాణం ఖరీదు.. పెండింగ్ లో వున్న మిల్లింగ్ చార్జీలు కాదా?

`ఈ పాపం యూనియన్ నాయకులది కాదా!

`పదేళ్లుగా మిల్లింగ్ ఛార్జిలను చెల్లించని పాలకులది కాదా?

`గత ప్రభుత్వం చేసిన పాపానికి మిల్లర్లు బలి కావాలా?

`మహిళా మిల్లర్ ఆత్మహత్యకు కారకులెవరు?

`పదేళ్లుగా మిల్లింగ్ చార్జీలు పాలకులు ఇవ్వకుంటే అడగరా?

`ఎవరి ప్రయోజనాల కోసం నాయకులయ్యారు?

`పెద్ద నాయకుల నిర్లక్షానికి చిన్న మిల్లర్లు ప్రాణం తీసుకోవాలా?

`పదేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై నోరేత్తరా?

`చిన్న మిల్లర్లను బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా?

`చిన్న మిలర్ల మెడలో డిఫాల్టర్లని బోర్డు వేసి దొంగలను చేస్తారా?

`ప్రాణం తీసుకున్న ఆ “మహిళ మిల్లర” పాడే మోయడానికి అసలు మీరు ఎలా అర్హులవుతారు?

`రాష్ట్ర నాయకుల స్వార్థానికి పాడేనెక్కుతున్న మిల్లర్లు?

`బకాయిలు చెల్లిస్తే ఆమె ప్రాణం తెచ్చిస్తారా?

`కేసులు నమోదు చేస్తామనే అధికారులకు వాస్తవాలు తెలుసా?

`మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మిల్లింగ్ బకాయిలు ఎప్పుడైనా చూసుకున్నారా?

`మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో నాయకులు?

`ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మాయం చేసిన గజదొంగలు ఎవరు?

`నాయకుల లెక్కల్లోని బొక్కలే చిన్న మిల్లర్ల పాలిట శాపాలు!

`నాయకుల బకాయిల బండారాలు బయట పడతాయానే నోరు మూసుకున్నారా?

`మిల్లు లేని వాడు మిలర్ల నాయకుడా?

`మిల్లు కిరాయికి ఇచ్చినవాడు అధ్యక్షుడై మిల్లర్ల హక్కులు కాపాడతాడా?

`నాయకులుగా చెలామణి అయ్యేందుకు వారికి సిగ్గు అనిపించడం లేదా?

`వారిని నాయకులుగా ఎంచుకోవడానికి మిల్లర్లకు బుద్ధి లేదా?

`మైనింగ్ మాఫియా కు పాలకుల అండదండలా?అన్నం పెట్టే మిల్లర్ల మెడకు బకాయిల గుది బండలా?

`పది సంవత్సరాల పెండింగ్ మిల్లింగ్ బకాయిలు అడగొద్దా?

`బకాయిలు చెల్లించమని చిన్న మిల్లర్లకు వేధింపులా?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

సీత కష్టం సీతది..పీత కష్టం పీతది అని సామెత. అలాంటివే కొంత మంది చిన్న మిల్లర్ల పరిస్దితి. పైన పటారం లోన లొటారంలా వుంది. తెలంగాణలోని చిన్న మిల్లర్ల జీవితాలు పైకి కనిపించేంత గొప్పగా ఏమీ వుండవు. పైన సిల్స్ షర్టు వేసుకున్నా, లోపల చిరిగిన బనియన్ వెక్కిరిస్తూనే వుంటుంది. అది పైకి కనిపించనట్లే, చిన్న మిల్లర్లు ఎదుర్కొనే కష్టాలు ఎవరికీ కనిపించేవి కాదు. సహజంగా మిల్లర్లు అనగానే ధనవంతులు, భవంతులు, ఆడంuరాలు అని అందరూ అనుకుంటారు. కాని వాళ్లుపడే వేదన, కష్టం ఎవరికీ చెప్ప్పుకోరు. ఎవరికి చెప్ప్పుకున్నా తీరేవి కాదు. అందుకే వారి కష్టం, నష్టం ఎవరికీ చెప్ప్పుకోరు. అందుకే తెలంగాణలోని చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు. నలిగిపోతున్నారు. నానా తంటాలు పడుతున్నారు. యాతన పడుతున్నారు. గట్టెక్కే మార్గం లేక కొంత మంది ఉరితాళ్లు పేనుకుంటున్నారు. పరువు కోసం జీవితాలను త్యాగం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగింది. వారికి శత్రువులు ఎవరో కాదు. మర్రిచెట్టులా పాతుకుపోయిన పెద్ద మిల్లర్లు, కనికరం చూపని పాలకుల మూలంగా చిన్న మిల్లర్ల జీవితాలు ఆగమౌతున్నాయి. ఊపిరి తీసుకోలేనంత కష్టం వెళ్లదీస్తున్నారు. దినదిన గండంగా బతుకుతున్నారు. ఇటీవల ఓ మహిళా మిల్లర్ల ఆ కష్టాలను నుంచి బైటపడే మార్గం కనిపించక తనవు చాలించింది. అంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. వాళ్లు చేసిన పాపం లేదు. మోసం లేదు. కాని జీవితాలు బలి చేసుకోవాల్సి వస్తోంది. బలన్మరణాలను కోరుకోవాల్సి వస్తోంది. ప్రాణం తీసుకునేంత పుట్టెడు దుఖం కడుపులో వుంటే తప్ప ఎవరూ అంతటి కఠినమైన నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే చిన్న మిల్లర్ల గోస చూసేవారు లేరు. వారి గోడు వినిపించుకునే వారు లేరు. వారిని పట్టించుకునే నాధుడే కరువుయ్యాడు. అంతటి దౌర్భాగ్య స్దితిలో బతుకులీడుస్తున్నారు. వింటేనే కన్నీళ్లు ఆగడం లేదు. అలాంటి నరకం అనుభవిస్తున్న వారి జీవితాలు ఎంత ఆగమ్య గోచరంగా వున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ వారు చేసిన పాపం ఏమిటి? గత పది సంవత్సరాల కాýంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మిల్లింగ్, ట్రాన్స్‌పోర్టు ఇలా కొన్ని రకాల చార్జీలు అందడం లేదు. ఇదిగో వస్తాయి..అదిగో వస్తాయని పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వడ్లను తీసుకొని మిల్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి అందిస్తున్నారు. కాని వారికి రావాల్సిన చార్జీలు మాత్రం అందడం లేదు. అందుకే వారు ఆ చార్జీల కోసం చకోర పక్షులుగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లు క్రితం ప్రభుత్వం మారింది. ఇప్పటి ప్రభుత్వమైనా తమను ఆదుకుంటుంది. తమకు రావాల్సిన బకాయి చార్జీలు వస్తాయని చిన్న మిల్లర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా వాటి జాడ లేదు. చార్జీలు వచ్చింది లేదు. వస్తాయన్న నమ్మకం ఇప్పట్లో కనిపించడం లేదు. పైగా చిన్న మిల్లర్లు కొన్ని సార్లు తప్పని పరిస్తితుల్లో ప్రభుత్వానికి పెట్టాల్సిన బియ్యం పెట్టలేకపోయారు. ప్రభుత్వం నుంచి చార్జీలు రాపోవడంతో వాళ్లు అప్ప్పులు చేశారు. ఆ అప్ప్పులకు వడ్డీలు చెల్లించుకునే స్దితి కూడా లేకపోవడంతో అప్ప్పులు ఇచ్చిన వారితో వేధింపులు పెరుగుతున్న తరుణంలో ప్రభ్వుతం ఇచ్చిన వడ్లకు సరిపడ ధాన్యం పెట్టలేకపోయారు. ఇదొక్కటే మిల్లర్లు చేసిన పొరపాటు. ఆ పొరపాటు కూడా గ్రహపాటు అవుతుందని మిల్లర్లు అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వున్న ధాన్యం బకాయిలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే. అయితే ఆ బకాయిలుపై కూడా ప్రభుత్వం 25శాతం అదనపు సుంకం విధించడంతో చిన్న మిల్లర్లు లబో దిబో మంటున్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు ఓ వైపు తమకు రావాల్సిన మిల్లింగ్ ఇతర చార్జీలు ఇవ్వడం లేదు. పైగా తామ బకాయిలు చెల్లించమంటూ అధికారులు వేదిస్తున్నారు. కేసులు నమోదు చేస్తామంటున్నారు. జైలు పాలు చేస్తామంటున్నారు. ఆస్దులు జప్తు చేస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దారి కనిపించడం లేదు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పోలీసులు ఓ మిల్లర్ దంపతులను నేరస్ధులను అరెస్టులు చేసి మీడియా ముందు నిలబెట్టినట్లు నిలబెట్టడంతో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా మిల్లర్ మనస్తాపానికి గురయ్యారు. తమ పరిస్దితి కూడా అలాగే వుంటుందేమో అని భయపడ్డారు. ఇంత బతుకు బతికి, దొంగలుగా, నేరస్ధులుగా నిలబడాల్సి వస్తుందా? అని తనలో తానే కుమిలిపోతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో చిన్న మిల్లర్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వంతు కూడా అలాగే వస్తుందా అని భయపడుతున్నారు. ఇందుకు కారకులు పాలకులు కాదా? అది ఎవరైనా సరే గత పాలకులు ఎనమిది సంవత్సరాల పాటు బకాయి చార్జీలు చెల్లించలేదు. ఈ పాలకులు వచ్చి రెండేళ్లయినా వాటిని విడుదల చేయడం లేదు. దాంతో చిన్న మిల్లర్లంతా దిగులుపడుతున్నారు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చిన్న మిల్లర్ల వున్న బకాయిలు మాత్రమే చూస్తున్నారు. కాని మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిల మీద దష్టిపెట్టడం లేదు. వాళ్ల uకాయిలు క్లియర్ చేస్తామని మాట ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చేదాని గురించి మాట్లాడకుండా, ప్రభుత్వానికి మిల్లర్లు ఇచ్చే దాని గురించే ప్రస్తావిస్తున్నారు. అదికారులు బెదిరిస్తున్నారు. తెలంగాణలో చిన్న మిల్లర్లు సుమారు 3000 మంది వుంటారు. ఆ 3000 మంది పరిస్దితి ఇదే విదంగా వుంది. వీళ్లను డిఫాల్డ్ మిల్లర్లు ముద్ర వేశారు. వారిని దొంగలుగా సమాజం చూపించే స్దితికి తెచ్చారు. కాని అసలు డిఫాల్టర్లు వీళ్లు కాదు. వీళ్ల uకాయిలు ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కాని మొత్తం 3500 మంది మిల్లర్లలో 500 మంది బడా మిల్లర్లు వున్నారు. అసలైన డిఫాల్డ్ మిల్లర్లంతా ఈ 500 మందిలోనే ఎక్కువగా వున్నారు. ఈ 500 మంది పెద్ద మిల్లర్లలో ఓ పది మంది మిల్లర్ల వున్న uకాయిల మొత్తంకూడా ఈ 3000 మంది చిన్న మిల్లర్ల uకాయిలు. చిన్న మిల్లర్ల సంఖ్య ఎక్కువగా వున్నప్పటికీ వారు చెల్లించే బకాయిలు వడ్లలో తాలంత కాదు. కాని తక్కువ మంది వున్న బడా మిల్లర్ల బకాయిలు కొండత. ప్రభుత్వ పెద్దలు, అదికారులు ఆ బడా మిల్లర్ల జోలికి వెళ్లరు. వారి బకాయిల ఊసెత్తరు. ఆ బడా మిల్లర్లు తప్పించుకునేందుకు ఈ చిన్న మిల్లర్లను ఎరగా వేస్తుంటారు. చిన్న మిల్లర్లను చిదిమేస్తున్నారు. వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ చిన్న మిల్లర్ల నాయకులు కూడా బడా మిల్లర్ల యజమానులే. ఈ చిన్న మిల్లర్ల పేరు చెప్పి రాజకీయం చేసే వాళ్లే.. ఈ చిన్న మిల్లర్ల సమస్యను ప్రబుత్వ పెద్దల దష్టికి తీసుకుపోరు. ప్రబుత్వం చిన్న మిల్లర్లను వేదిస్తుంటే చోద్యం చూస్తుంటారు. తమ మీదికి అదికారులు రాకుండా మాత్రం చూసుకుంటారు. దాంతో చిన్న మిల్లర్లే అదికారులకు టార్గెట్ అవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలంటూ చిన్న మిల్లర్ల మీద పడుతున్నారు. యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు కనీసం ఒక్క శాతం చిన్న మిల్లర్ల కోసం పనిచేసినా వారికి ఈ కష్టాలు వచ్చేవి కాదు. పేరుకు మాత్రం మిల్లర్ల యూనియన్ అసోసియేషన్లకు నాయకులు. కాని చిన్న మిల్లర్ల సమస్యలు పట్టించుకోరు. చిన్న మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్ చార్జీలు ఇప్పించరు. తమ తోటి మిల్లర్ల సమస్యలు పరిష్కారం కోసం కషి చేయని నాయకులు ఎందకు? పాలకుల దష్టికి చిన్న మిల్లర్ల సమస్యలు తీసుకెళ్లలేనప్ప్పుడు ఆ నాయకులకు పదవులు ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం నాయకులయ్యారు. ఓ మహిళా మిల్లర్ల బలన్మరణానికి గురైతే కూడా పట్టించుకునే తీరిక లేదా? లేక మీకు మనసు కరుగుతలేదా? పెద్ద నాయకుల నిర్లక్ష్యానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు తీసుకోవాలా? ప్రబుత్వం నుంచి చిన్న మిల్లర్లకు రావాల్సిన బకాయిలపై నాయకులు నోరెత్తరా? చిన్న మిల్లర్లను బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా? చిన్న చిన్న మిల్లర్లను డిఫాల్లర్లని ముద్రలు వేసి వారిని దొంగలను చేస్తారా? రాష్ట్ర నాయకులు స్వార్ధానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు బలి చేసుకుంటున్నారు. అయినా మిల్లే లేని వ్యక్తులు మిల్లర్ల యూనియన్‌కు నాయకులు కావడమేమిటి? తన మిల్లును కిరాయికి ఇచ్చిన వ్యక్తి మిల్లర్ల హక్కులు కాపాడుతారన్న నమ్మకమేమిటి? నాయకులుగా అలాంటి వారిని ఎన్నుకునేందుకు చిన్న మిల్లర్లకు కూడా ఇంగితం లేకుండాపోయిందా? ఇప్ప్పుడు సమస్య ఉరితాడులా వేలాడుతుంటే కూడా మిల్లర్లలో చైతన్యం రాదా???

అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మహిళలకు ప్రత్యేకమైన రోజుగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళల సాధన,కృషి, విజయాలను గుర్తించి,లింగ సమానత్వం,హక్కులను గుర్తిస్తారు.

మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2026కు సంబంధించి మహిళా సాధికారత,సమానత్వం, నాయకత్వంపై దృష్టి సారిస్తూ థీమ్ రెడీ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఈసారి ప్రత్యేక థీమ్ ‘గీవ్ టూ గైన్,అంటే ఒకరికి ఒకరు సహాయం చేస్తే,అందరికీ ప్రయోజనం కలుగుతుందని,సమాజంలో పురోగతి సాధ్యమవుతుందని ఈ థీమ్ సూచిస్తుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట అమెరికాలో 1900లో ప్రారంభమైంది.ఆ కాలంలో మహిళలకు ఎక్కువగా పని గంటలు ఉంటూ జీతం తక్కువగా ఉండేది.ఆ పరిస్థితిని తట్టుకోలేని మహిళలు వారి హక్కుల కోసం తిరుగుబాటు మొదలుపెట్టారు.వారు తగిన వేతనం,పని గంటలు తగ్గించడం, ఓటు హక్కు వంటి అంశాలపై పోరాటాలు చేశారు.1910లో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరి

ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ రోడ్డు దగ్గర చెత్త దుర్గoదం పందుల స్వైర విహారం…

ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ రోడ్డు దగ్గర చెత్త దుర్గoదం పందుల స్వైర విహారం
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లారీ ధర్మారెడ్డి ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో చెత్త దుర్గంధం పందులు దుర్గoద o చేస్తున్నాయని దుర్గంధం సీజనల్ వాతావరణం సందర్భంగా ఇండ్ల లోకి దోమలు ఈగలు వస్తున్నాయని కాలనీవాసులు దాచ లక్ష్మీనారాయణ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ విషయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని పట్టణ ప్రణాళిక లో భాగంగా అక్కడ ఉన్న దుర్గంధం చెత్తను తొలగించాలని ఆయన కోరార లేనిచో సోమవారం నాడు వనపర్తి మున్సిపల్ అధికారులపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మీనారాయణ విలేకరులకు చెప్పారు

వనపర్తి లో ఆక్రమణలను కూలగొట్టాలి చైర్మన్ కు వినతిపత్రం…

వనపర్తి లో ఆక్రమణలను కూలగొట్టాలి చైర్మన్ కు వినతిపత్రం

ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని స్థలాన్ని మున్సిపాలిటీ కి స్వాధీనo చేసుకోవాలని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ మీడీదొడ్డి మాధవి రమేష్ కు ఆమె నివాసంలో కలిసి వినపత్రం ఇచ్చామని సతీష్ యాదవ్ తెలిపారు కర్నూల్ రోడ్డులో పానగల్ రోడ్డులో రోడ్డు చిన్నదిగా ఉన్నదని తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంతవరకు కూలగొట్టలేదని ఆయన ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ఆదేశాలు పరిగణలోకి తీసుకొని విది విధానాలు రూపొందించి వెంటనే రోడ్ల విస్తరణ పనులు ఆక్రమణాలను కూల గొట్టాలని ఆయన కోరారు అదేవిధంగా వనపర్తి పట్టణంలో పార్కుల స్థలాలు కబ్జాల కు గురయ్యాయని కొంతమంది రోడ్ల పక్కన మోరీలపై షెడ్లు నిర్మించి అద్దెలకు ఇచ్చారని మోరీలపై రేకుల షెడ్లు వేశారని వాటిని తొలగించాలని ఆయన కోరారు రోడ్ల విస్తరణలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వనపర్తి లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి జరిమానాలు విధించాలని ఆయన కోరారు పాత మార్కెట్ యార్డులో సమీకృత షాపింగ్ కాంప్లెక్స్ ను టెండర్లు నిర్వహించి అద్దెలకు ఇవ్వాలని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని అదేవిధంగా చిన్న కిరాణం వ్యాపారస్తులకు స్వల్ప అద్దె కు ఇవ్వాలని కోరారు కమాన్ చౌరస్తా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోడ్డు చిన్నదిగా ఉండడం వల్ల సంత ప్రతి ఆదివారం ఉంటుందని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు పాత మార్కెట్ యార్డ్ సమీకృత షాపింగ్ కాంప్లెక్స్ కూరగాయల వ్యాపారులకు చిన్న కిరాణా వ్యాపారులకు అక్కడ వ్యాపారం చేసుకొనుటకు షాపులు ఇప్పించాలని ఆయన కోరారు రాజీవ్ చౌక్ నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల వివేకానంద చౌరస్తా నుండి కర్నూల్ రోడ్డు వరకు రోడ్డు సెంటర్ నుండి అటు ఇటు ఎవరికి నష్టం జరగకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆక్రమణలను కొలగొట్టాలని ఆయన చైర్మన్ కి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు అదేవిధంగా మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు పట్టణ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ ను కోరారు చట్టంలో అందరు సమానులేనని అక్రమ ఆక్రమణలపై మున్సిపల్ లో కమిషనర్ తో చర్చించి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆదేశాలను పరిగణంలోకి తీసుకొని తొలగించాలని ఆయన కోరారు ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొత్త గొల్ల శంకర్ వెంకటేశ్ చంద్రశేఖర్ దయనంద్ ముదిరాజ్ రామస్వామి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

ఎరువుల షాపుల తనిఖీలు.

ఎరువుల షాపుల తనిఖీలు.

జిల్లా వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు
మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచారకులు అజ్మీరా శ్రీనివాసరావు కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న తో కలిసి తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి డీలరు రైతులకు యూరియా విధిగా యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే సరఫరా చేయాలని వారు తెలిపారు, అదేవిధంగా ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు పి ఓ ఎస్ బ్యాలెన్స్, గోదాం బాలన్స్ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కేసముద్రం మండలంలోని తార్యతండ గ్రామ శివారులో వరి పంట క్షేత్రాలను గ్రామ రైతులతో కలిసి సందర్శించడం జరిగింది, ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు మోగి పురుగు మరియు జింక్ లోపాలను గమనించడం జరిగింది, వారు మాట్లాడుతూ అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ అనే మందు ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు కలిపి పిచికారి చేయాలని అదేవిధంగా పొడ తెగులు నివారణకు ప్రొపికొనోజోల్ అనే మందు ఒక లీటర్ నీటికి1 మిల్లీమీటర్, అదేవిధంగా మొగి పురుగు నివారణకు కాట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే పురుగుమందు లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి పిచికారి చేయాలని, సూక్ష్మధాతు అయినా జింకు లోపాన్ని నివారించడానికి చీలేటెడ్ జింకు ఒక గ్రాము లేదా రెండు గ్రాములు ముడి జింకు కలిపి పిచికారి చేసి పైన తెలిపిన తెగుళ్లు మరియు పురుగులను నివారించవచ్చని వారు సూచించారు, అదేవిధంగా ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ, యాసంగి పంట నమోదు తప్పకుంట చేయించుకోవాలని వారు సూచించారు .
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి.వెంకన్న, మరియు రైతులు మూడవత్ బుజ్జి శంకర్, రాజ్ కుమార్, రవీందర్, పాల్గొన్నారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 17, 31, 32, 33 వార్డులలో చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి,వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.గ్రామ,మండల,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం,అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లలు భద్రత,వ్యవసాయం, విద్య,యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి

వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం…

వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య.

కారేపల్లి నేటిదాత్రి

దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు కూచించుకు పోతుంది అని. రూపాయి విలువ రోజురోజుకు దిగజారిపోయి సంక్షోభం వైపు పరుగులు తీస్తుందని. ఆదాని అంబానీ లాంటి కుబేరులు మరింత పెరిగిపోతూ సంపన్నులుగా మారిపోతున్నారని. పేదలు మాత్రం కటిక దరిద్రంలోకి నెట్టబడుతున్నారని అర్ధాకలితో అలమటిస్తూ అన్నమో రామచంద్ర అంటూ దేహరించాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధాని వ్యవసాయ కూలీలు రైతాంగ కార్మిక వర్గం లాంటి అన్ని వర్గాలపై తన దాడిని ఎక్కిపెట్టిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకే ఎంఎస్ ఖమ్మం డివిజన్ ప్రధమ మహాసభ కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలో అమరుడు లక్ష్మీనరసు నగర్ లో కూరాకుల నరసయ్య అధ్యక్షతన జరిగింది.

మా సభకు ముందుగా డివిజన్ అధ్యక్షులు కూరాకుల నరసయ్య జండా ఆవిష్కరించారు ఈ మహాసభకు ప్రారంభ ఉపన్యాసకులుగా గుమ్మడి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అనేక చట్టాలను మార్చి కొత్తవి చేసి ప్రజలను పీడిస్తుందని. యాట రెండు కోట్ల ఉద్యోగాల మాట అటకెక్కిందని. నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామని ప్రజలను దగా చేసిన ప్రధానిగా మోడీ నిలిచారని. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని. భారతదేశం వెలుగు పోతుందని తెగ ప్రచారం చేసుకుంటున్నా భారత పాలకులు ఆకలి సూచికల్లో 127 దేశాల్లో 105వ స్థానంలో ఉన్నదని అంటే మన పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని గుమ్మడి నరసయ్య అన్నారు.

ఈ మహాసభలో కార్యదర్శి కే లో పాపారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వివిధ కారణాలతో రైతాంగ కార్మిక పోరాటాలలో అమృతం పొందిన అమరవీరులకు సంతాపం తెలియజేశారు.
మహాసభలో ఖమ్మం డివిజన్ అధ్యక్షునిగా కూరాకుల నరసయ్య ఉపాధ్యక్షులుగా చల్ల రాజు ప్రధాన కార్యదర్శిగా కే లోతు పాపారావు సహాయ కార్యదర్శిగా కోడెం సీతారాములు కోశాధికారిగా ఎస్ కె హుస్సేన్ బి తో పాటు 16 మందిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
మహాసభ కొత్తగా తెచ్చిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని.
200 రోజులు పని దినాలు కల్పించాలని.
ఎలాంటి షరతులు లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని. 12 వేల రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని మహాసభ తీర్మానించనైనది. మార్చి 24 25 తేదీలలో కామారెడ్డిలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సభ అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు సిపిఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ ఏఐపీకే ఎంఎస్ నాయకులు చల్ల రాజు రావుల నాగయ్య మేక రామనాథం పొట్లపల్లి కృష్ణ కోడం సీతారాములు గుమ్మడి ఎర్రయ్య గుమ్మడి సరోజిని అనసూర్య సీత సమ్మక్క సత్తిరెడ్డి సక్రు రాము రమణ తదితరులు.

గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే…

గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
చిన్నారుల విజయానికి ఘన సత్కారం
ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాంబాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ శివకుమార్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

కొండాపూర్‌లోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు తమ తొలి విద్యా మెట్టును అధిరోహించి పై తరగతులకు వెళ్తున్న తరుణంలో నిర్వహించిన ఈ వేడుక కంటికి పండువగా సాగింది.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్న వయసులోనే ఇటువంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే గొప్ప భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అకాడమిక్ కోఆర్డినేటర్ శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ధను కొనియాడారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రావంతి మరియు పీపీటీ ఇన్‌చార్జ్ నళిని కొండ సమక్షంలో విద్యార్థులకు పట్టాలు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు. తమ పిల్లల తొలి విజయాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వంగా, ఆనందంగా భావించారు. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలి. రాజకీయ రంగాలలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి.

లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలి. రాజకీయ రంగాలలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలంలోని ఖాసింపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు ఉత్సవాలు జరుపుకున్నారు..ఈ కారీక్రమంలో కేక్ కట్ చేసి ఒకరి కొకరు తినిపించుకోవడం జరిగింది. తదనంతరం కరిక్రమంలో పల్గొనడానికి విచ్చేసిన మహిళల్ని ఉద్దేశించి మాట్లాడిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మహిళలకు మద్దతుగా ఎవరు రానక్కరలేదు. వాళ్ళకు ఒక గళం ఉంది. దాని ఉపయోగించు కోడానికి ముందుకు వచ్చినప్పుడు సాధికారత సాధించినట్లే .అన్ని రంగాలలో అడుగు పెట్టాలి ఇంకా మనల్ని వెనకకు లాగుతోంది ఏంటో తెలుసుకోవాలి ?ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం కోరడం, ఏ సమస్య ఎదురైన నిబ్బరంగా ఎదుర్కుంటూ ముందుకు వెళ్ళండి-ప్రతి సవాలూ మనలో ధైర్యాన్ని నింపుతుంది. కొత్త విషయాలు నేర్పుతుంది అంతేకాని నావల్ల ఏమీకాదు. నేనేమీ చేయలేను అని ఊరుకుంటే అక్కడే ఉండిపోతాం అలాగే నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి మన హక్కులు బాధ్యతలను గ్రహిస్తూ, శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగడమే అసలైన మహిళా సాధికారత.ఈ కారీక్రమంలో మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు చంద్రకళ, స్వప్న, ఈశ్వరమ్మ, భాగ్యలక్ష్మి, బుజ్జమ్మ, పారమ్మ, వినోద, భరతమ్మ, సిద్దమ్మ, సువర్ణ, సురేఖ, సంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి..

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

పలు వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ 20 వ వార్డులో
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మున్సిపల్ కమిషనర్ ఉదయ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దేవన్ కౌన్సిలర్లు రాజు నాయక్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డులలో ఈరోజు పర్యటించడం జరిగింది సైడ్ కాలువలను డ్రైనేజీలను శుభ్రం చేయడం వార్డులలో చెత్త చెదారం లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు

జమ్మికుంటలో రేపు ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం

జమ్మికుంటలో రేపు ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం

 

 

మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 8న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట శాఖ, రెనోవా క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఇందులో క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, రక్త పరీక్షలతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్ నిపుణులు ఉచితంగా వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తారు.

అబాది జమ్మికుంట సెయింట్ థామస్ పాఠశాల అధ్యాపకుల…

అబాది జమ్మికుంట సెయింట్ థామస్ పాఠశాల అధ్యాపకుల ఆహ్వానం మేరకు కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ డే లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట ( నేటి ధాత్రి )

 

 

 

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ మాట్లాడుతూ సెయింట్ థామస్ పాఠశాల ప్రారంభం నుండి చుట్టు పక్కల గ్రామాల పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించి ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతస్థాయికి వెళ్ళేలా విద్యను అభ్యసించిన పాఠశాల అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ గారు కౌన్సిలర్లూ ఎగిత సుజాత అశోక్, మైస శిరీష రవి, చింతల శ్రీనివాస్, పోల్నెనీ అజయ్ , కొలుగూరీ సురేష్ , మంద రాధ.రాజేష్, పోలు దివ్య బిక్షపతి, పోల్నెనీ శిల్పా వేణు పాఠశాల అధ్యాపకులు చరణ్ తేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

షార్ట్ సర్క్యూట్తో మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం…

షార్ట్ సర్క్యూట్తో మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం

జమ్మికుంట ( నేటి ధాత్రి )

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం
పక్క వీధిలో గల శ్రీదేవి ఫార్మసీ మెడికల్ స్టోర్ లో శనివారం రోజున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మెడికల్ స్టోర్ లోని ఫ్రిడ్జ్ లో మంటలు చెలరేగి మెడికల్ స్టోర్ పూర్తిగా దగ్ధమైంది ప్రమాదం జరిగిన సమయంలో షాపు యజమాని జడల పండరి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రక్కన నివసిస్తున్న వారు షాప్ యజమాని ఇంటి నుంచి మరో తాళపు చెవి తెప్పించి షాప్ తెరిచి ఎగసిపడుతున్న మంటలను బకెట్ల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడం జరిగింది

మెడికల్ స్టోర్ లో మందులు చాలా వరకు దగ్ధం కాగా మిగతా మందులు పనికిరాకుండా పోయాయి షాపులోని ఫర్నిచర్స్ పనికిరాకుండా పోయింది అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టం దాదాపు రెండు లక్షల వరకు ఉంటుంది అని అంటున్న షాప్ యజమాని.

ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు…

ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు

భాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం,సరుకుల వితరణ కార్యక్రమాలు

ప్రజల కష్టాలలో ముందుంటున్న మాజీ కౌన్సిలర్ రజిని నవీన్

పరకాల,నేటిధాత్రి

 

గెలిచినా ఓడినా ప్రజా సేవే తమ లక్ష్యమని,ప్రజలే తమకు దైవమని పరకాల మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరకాల పట్టణంలోని 17వ వార్డు నుండి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా శనిగరం రజినీ నవీన్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క బ్యాలెట్ ఓటుతో ఓడిపోయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ప్రజల మధ్యనే ఉండి సేవ కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా రజినీ నవీన్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజమని తెలిపారు.ప్రజల కోసం పని చేయడమే తమ అసలు లక్ష్యమని చెప్పారు. ప్రజలు చూపిన ఆదరణ,విశ్వాసం తనకు మరింత బాధ్యతను కలిగించిందని అన్నారు.గతంలో తాము పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని ఆయన తెలిపారు.తమ సేవలను గుర్తించిన ప్రజలు రిజర్వేషన్‌లో భాగంగా 17వ వార్డులో పోటీ చేయాలని కోరడంతో పాటు పార్టీ ఆదేశానుసారం ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు.అయితే ఎన్నికల్లో కేవలం ఒకే ఓటు తేడాతో ఓటమి చెందినప్పటికీ ప్రజలపై ఉన్న నమ్మకం ఏమాత్రం తగ్గలేదని ఆయన అన్నారు.తమకు ఓటు వేసిన వారే కాకుండా ఓటు వేయని ప్రజల కోసం కూడా సమానంగా సేవ చేస్తానని తెలిపారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండటం తన బాధ్యతగా భావిస్తున్నానని వార్డు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఇటీవల 17వ వార్డులో మరణించిన కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా అవసరమైన సహాయం కూడా అందిస్తున్నారు.ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ప్రజల పట్ల చూపుతున్న ఈ స్పందన చర్చనియమైంది.ప్రజా సమస్యల విషయంలో వెంటనే స్పందిస్తూ ప్రజల మధ్య ఉండడం ఆయన నాయకత్వ లక్షణాన్ని చూపిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటికీ ప్రజా సేవలో వెనుకడుగు వేయకపోవడం అభినందనీయమని వార్డు ప్రజలు చెబుతున్నారు.ప్రజల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మధ్యనే ఉంటానని మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి….

ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి

అభివృద్ధి సమన్వపర్య వేక్షణ కమిటీ (దిశ) సమావేశం

శాయంపేట నేటిధాత్రి:

హన్మకొండలోని కలెక్టర్ కార్యా లయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వ హించిన జిల్లా అభివృద్ధి సమ న్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడి యంకావ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమా వేశంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావుపాల్గొన్నారు.సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురో గతి, ప్రజ లకు అందుతున్న సేవలపై అధికారులు వివరా లు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకుల మరియు ప్రభుత్వ పాఠశాలలో టాయి లెట్స్ అంతర్గతo లేకుండా ,కోతుల బెడద లేకుండా , కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయా లని, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని, అదే విధంగా మండలంలోని గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్య లేకుండా,అభివృద్ధి కార్యక్ర మాలు వేగవంతంగా అమలు చేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత అధికారు లకు తగిన సూచనలు చేశా రు. ఈ సమావేశంలో దిశ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ మేయర్ గుండు సుధారాణి , కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజిపై , జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధు లు మరియు సంబంధిత విభా గాల అధికారులు పాల్గొన్నా రు.

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర…

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. తనిఖీలో భాగంగా ఆయన పరిశీలించిన
తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్, విద్యార్థుల బోధనాంశాలను అడిగి తెలుసుకున్నారు. గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు.
ఉపాధ్యాయులు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. గోడపై ఉన్న మ్యాథ్స్ చార్టులను
గమనించి, ఉన్నత విద్యా ప్రమాణాలపై చర్చించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు హాస్టల్ వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.
పాఠశాల ఆవరణను, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి…

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థుల చదువు స్థాయి, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రత, పోషకాహారం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధవి, యువ నాయకులు సందీప్, శ్రీకాంత్, గ్రామస్తులు గోరేమియా, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version