వ్యవసాయ మార్కెట్ కమిటి, కల్వకుర్తి శనివారం తేది:24.01.2026 న వచ్చిన వేరుశెనగకు అధిక ధరలు పలకడం రైతులను ఆశ్చర్యపరిచింది. క్వింటాల్ మరియు ధరలు వేరు శనగ : 306.60 క్వింటాలు. ఎక్కువ ధర. : 11029.00 తక్కువ ధర : 8689.00 మోడల్ ధర : 11009.00 వచ్చిన రైతులు : 34 బస్తాల సంఖ్య : 1022 ఏరు శీనుగా రైతులు ఆనందంగా వ్యక్తం చేశారు.
మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు
సారం పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య ఆధ్వర్యంలో. సీఎం కప్ .2026. గ్రామపంచాయతీ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో సీఎం కప్ క్రీడల పోటీలు ప్రారంభం జరుగుతున్నాయని. ఈ పోటీలలో అన్ని జట్ల క్రీడాకారులు పాల్గొంటారని. క్రీడల క్రీడాకారులకు ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని. క్రీడల్లో పాల్గొనడం గెలుపు ఓటమి సహజమని యువత ఎక్కువగా క్రీడలపై దృష్టి సారించాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడా పోటీలను ప్రారంభించిన స్థానిక సారం పెళ్లి సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో. గ్రామ ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ. వార్డు మెంబర్లు. రమేష్. వినోద. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు.మునిగలరాజు. కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.గడ్డమీదిశ్రీనివాస్. కుమారస్వామి. కిషన్. గుగ్గిళ్ళ శ్రీనివాస్. సునీల్. దేవదాసు. మహేష్. మధు. శరత్. అభిషేక్ తదితరులు పాల్గొన్నారు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఈనెల 25 నుండి ఫిబ్రవరి 31 వరకు నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు నడపడనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.ఇందుకు గాను సుమారు ముప్పైరెండు వేల పైగా ప్రయాణికులు నర్సంపేట నుండి మేడారం జాతరకు ప్రయాణిస్తారని అంచనా వేసామన్నారు.కాగా 145 బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పరిస్థితి బట్టి మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నుండి మేడారంకు పెద్దలకు రూ.270/- పిల్లలకు రూ.170/- గా టికెట్ ధర, కొత్తగూడ నుండి పెద్దలకు 330/-, పిల్లలకు 200/-నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యం సరియైన ధ్రువీకరణ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ప్రయాణానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.బూత్ కౌంటర్లు ఏర్పాటు చేసి మేడారం జాతరకు తరలివెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం, ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను బస్సులలో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు.టికెట్ కౌంటర్లు 24 గంటలు పనిచేస్తాయి.కాగా జాతరకు సుమారు 400 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం తగిన ఏర్పాటు చేయడం తో పాటు త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్, తగు సూచనలను, సలహాలను అందించడానికి హెల్ప్ డెస్క్, మెడికల్ సదుపాయం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ వివరించారు.భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవార్ల గద్దెల అతి సమీపం వరకు చేరుకుంటారని కావున ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందగలరని ఆమె కోరారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది అనంతరం అంగన్వాడి పర్యవేక్షణ , సహాయ కమిటీ కార్యక్రమం ఏర్పాటు చేసి గర్భిణి స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంతంపల్లి సుశీల, కార్యదర్శి మహమ్మద్ హరీఫ్, స్వప్న, ఉమారాణి, నిర్మల ,సౌజన్య తదితరులు పాల్గొన్నారు
సీఐ శ్రీనివాస్ ను సన్మానించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ సీఐగా ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇస్పెక్టర్ శ్రీనివాస్ ను జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా స్వంచంద సంస్థలు ఉంటూ ఎన్నో రంగాల్లో నిస్వార్థసేవలు అందించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ , ఏఎస్ఆర్ సంస్థ నిర్వాకుడు ఎర్రబోయిన రాజశేఖర్, విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సొరంగం,ఎస్సి,ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి,వేంకటాచారి,మొగిలిచర్ల రాము సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అనంతుల రాజ్ కుమార్ గౌడ్ తండ్రి రాములు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇంచార్జి గందె శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ మంద సుజాత రాజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మురాల ప్రతాపరెడ్డి, నాయకులు తౌట్ రెడ్డి రాజిరెడ్డి, ఇంగ్లీ రవి, అబ్బు విజయేందర్ రెడ్డి, వార్డు మెంబర్స్ గంగారావు వినయ్, హింగే రమేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిసెల యాదయ్యభక్తితో ముందుకు వచ్చి రూ.2.11 లక్షలు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందులో భాగంగా శనివారం రూ.లక్ష అడ్వాన్స్ ను దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గుడిసెల యాదయ్య మాట్లాడుతూ.. ధర్మం కోసం చేసే ఖర్చు ఎప్పుడూ వృధా పోదని.. స్వామి వారి సేవలో భాగస్వాములై తన వంతు విరాళాన్ని అందించానని అన్నారు. గుడిసెల యాదయ్య సామాజిక స్పృహను దైవభక్తిని గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.
మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్
కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు
జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ
2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్, పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు. గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు. సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో 30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం. ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
కోహిర్ నాయకులు హైదరాబాద్ చేరుకుని మజ్లిస్ పార్టీ కండువా కప్పుకున్న దళిత నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మజ్లిస్ కోహిర్ అధ్యక్షులు మొహమ్మద్ రఫియుద్దీన్ నేతృత్వంలోని కోహిర్ టౌన్తో అనుబంధంగా ఉన్న దళిత నాయకులు హైదరాబాద్ కార్యాలయంలో కోహిర్ ప్రతినిధి బృందంగా కలిసి మజ్లిస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, అసెంబ్లీ సభ్యుడు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మజ్లిస్ పార్టీ ఖాండ్వాను ధరించడం ద్వారా కోహిర్ దళిత నాయకులు గాబ్రియేల్ ప్రవీణ్ కుమార్ ఇతరులను మజ్లిస్ పార్టీలో అధికారికంగా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా, అసెంబ్లీ సభ్యుడు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహయోద్దీన్ మాట్లాడుతూ, దేశంలోని ప్రస్తుత పరిస్థితిలో ముస్లిం దళిత ఐక్యత అత్యంత ముఖ్యమైన అవసరం అని అన్నారు. రాబోయే కోహిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో కోహిర్ మజ్లిస్ పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేయాలని పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించడం ద్వారా కొత్తగా ఏర్పడిన కోహిర్ లో మజ్లిస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా, కోహిర్ మున్సిపల్ కౌన్సిల్తో సంబంధం ఉన్న మజ్లిస్ పార్టీ నాయకులు, మహ్మద్ బాబా మహ్మద్ మోయిన్ మరియు ఇతరులు కూడా హాజరయ్యారు.
జహీరాబాద్ 108 అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన క్వాలిటీ ఆడిటర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సాయంత్రం 108 అంబులెన్స్ ను ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ ఆడిటర్ ఫకీర్ దాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని వైద్య పరికరాల పనితీరు, స్టాక్, రికార్డుల నిర్వహణ, సేవల నాణ్యతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ బోయిని సంపత్, సంగారెడ్డి జిల్లా 108 కోఆర్డినేటర్ శాలి హుస్సేన్, 102 కోఆర్డినేటర్ కిరణ్, 108 సిబ్బంది EMT పండరి, PILOT శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్ శుక్రవారం నాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జహీరాబాద్ బొంబాయి నేషనల్ ట్రాన్స్పోర్ట్ అధినేత మహమ్మద్ ముజాహిద్ గారి కుమారుడు మహమ్మద్ ముఖ్తద్దిర్ గారి వివాహం లో పాల్గొని నూతన వధూవరుని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, మాజీ ఎంపీటీసీ అశోక్ ఏ.యం.సి.డైరెక్టర్ శేఖర్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,జె జె జావీద్,ఖాజా గారు,మొయిజ్ గారు,తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేంద్ర రావు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా అర్చకులు రాజేంద్ర రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు అర్చన, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అధికారులు భక్తులు పలువురు ప్రతినిధులతో కలిసి రాజేందర్ రావు ఊరేగింపుగా వెళ్లి పాత బజార్ లోని శివాలయం నుంచి పుట్ట బంగారం కోసం వెళ్లి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్ట బంగారం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన తదితర పూజ కార్యక్రమాల్లో రాజేందర్రావు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, పలువురు నేతలు, మహిళలు, భక్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమాజంలో అందరూ నాయకులు కాలేరు. నాయకులైనందరూ ప్రజా సేవకులు కారు. ప్రజల్లో నుంచి వచ్చి, ప్రజలను ప్రేమించి, ప్రజలకోసం పనిచేసి, ప్రజా సేవే పరమావదిగా సేవలందించేవారు నాయకులైతే ఆ ప్రజలకు ఏంతో మేలు. వారి జీవితాలకు వెలుగు. అలా ప్రజలంటే ప్రాణమిచ్చే నాయకుల్లో వద్దిరాజు రవిచంద్ర ఒకరు. ఆయన ప్రజల కోసం చేసే సేవ అంతా ఇంతా కాదు. తన జీవిత పర్యంతం ప్రజలకు సేవ చేస్తూనే వున్నారు. అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూనే వున్నారు. చిన్న అవసరాల నుంచి మొదలు, పెద్ద అవసరాలను కూడా ప్రజలకు తీర్చుతూ, వైద్య సేవల విషయంలో ఎంతో చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఎంతో మంది జీవితాలు నిలబెట్టారు. వారి జీవితాలను కాపాడారు. అంత గొప్ప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. వ్యాపారంలో వచ్చే లాభాలను సహజంగా ఎవరైనా ఆస్ధులు కూడబెట్టుకుంటారు. కాని వద్దిరాజు రవిచంద్ర తన ఆదాయాన్ని ప్రజలకు పంచుతూ వుంటారు. ప్రజల కోసం ఖర్చు చేస్తుంటారు. ప్రజాభిమానం కూడబెట్టుకుంటారు. ఇదీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గొప్పదనం. గొప్ప గుణం. అందుకే ఆయనను ఆదర్శవాది తోపాటు అజాతశత్రువు అని కొనియాడుతారు. పార్టీలకు అతీతంగా ఆయనను వ్యక్తిగా గౌరవిస్తారు. ఆయనను అభిమానిస్తారు. వద్దిరాజు రవిచంద్రకు ప్రజలంటే ఎంత ప్రాణమో, బిఆరఎస్ అధినేత కేసిఆర్ అంటే అంత దైవసమానం. కేసిఆర్ అంటే కూడా వద్దిరాజుకు ఎంతో గౌరవం. గురుసమానం. దైవ సమానం. అంతగా కేసిఆర్ను ఆరాదిస్తుంటారు. ఆయన బిఆరఎస్లో చేరిన నాటి నుంచి పార్టీ కోసం ఆయన అహర్నిషలు కషి చేస్తూనే వున్నారు. ఈసారి ఆయన నిర్ధేశి ంచుకున్న లక్ష్యం ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీని అధికారంలోకి తేవడం మళ్లీ కేసిఆర్ను ముఖ్యమంత్రిగా చూడడం, ఖమ్మం జిల్లాను బిఆరఎస్ కంచుకోటగా మార్చడం. ఖమ్మం జిల్లాలో బిఆరఎస్ను తిరగులేని శక్తిగా మార్చడం కోసం ఆయన ఎంతో కషి చేస్తున్నారు. రాజకీయంగా బిఆరఎస్ను ఎదురులేని శక్తిగా మార్చి, భవిష్యత్తులో బిఆరఎస్ మీద పోటీ చేయాలంటే ఇతర పార్టీలు వెనుకడగు వేసేంత బలంగా మార్చాలన్న కసితో పనిచేస్తున్నారు. ప్రజా సేవ తర్వాతే రాజకీయాలను ప్రాదాన్యతనిచ్చే వద్దిరాజు రవిచంద్ర అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలకు ప్రాణం. ఆయనతో ప్రత్యక్షంగా సేవలు అందుకోని వారు చాల తక్కువగా వుంటారు. అంతలా ఆయన ప్రజలకు సేవ చేశారు. ఆ సేవను ప్రజలు కూడా మర్చిపోలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీని గెలిపించే బాద్యతతోపాటు, తాను కూడా ఎమ్మెల్యేగా నిలిచి, గెలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వ్యక్తిగతంగానే ఎంతో సేవ చేసే వద్దిరాజు రవిచంద్ర ప్రజా ప్రతినిధి అయితే ఎంత సేవ చేస్తారో ఊహించుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని ప్రజలు ఎంతో బలంగా కోరుకుంటున్నారు. సహజంగా ఏ సామాజిక సేవకుడైనా సరే తన ప్రాంతం, తన జిల్లా వరకు మాత్రమే సేవ చేయడం కనిపిస్తుంది.. కాని వద్దిరాజు రవిచంద్ర అంటే అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన చేసినన్ని సామాజిక సేవలు ఎవరూ చేయలేదు. ఆయన పుట్టిపెరిగింది వరంగల్ జిల్లా అయితే, ఆయన వ్యాపార సామ్రాజ్యం ఖమ్మం జిల్లా. అందుకే ఆయన ఏ జిల్లాను విస్మరించలేదు. పుట్టిన జిల్లాకు సేవలందించారు. ఆదరించిన జిల్లాను కడుపులో పెట్టుకున్నారు. ఇలాంటి నాయకుడు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా వుండరేమో అంటే అతిశయోక్తి కాదు. అటు ఉమ్మడి వరంగల్, ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చేసిన ఆద్యాత్మిక సేవలు కూడా అన్నీ ఇన్నీ కావు. రెండు జిల్లాలో కలిసి ఎన్ని దేవాలయాల నిర్మాణాలకు ఆయన సహకరించారో లెక్కేలేదు. అంతగా ఆయన దైవ సేవలో కూడా పాలు పంచుకున్నారు. ఏ ఊరి నుంచి ఎవరు వచ్చి, గుడి కుడుతున్నామంటే చాలు, వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వడం అనేది ఒక్క వద్దిరాజు రవిచంద్రకే చెల్లింది. అంతలా దైవసేవతోపాటు, ఆయన చేసిన వైద్య సేవలు కూడా అనేకం వున్నాయి. లెక్కలేనన్ని సార్లు హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేశారు. ఎంతో మందికి వ్యక్తిగతంగా వైద్య సాయం అందించారు. అలా ఆయనతో సాయం పొందిన వారు ఎంతో మంది వున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా ప్రజలు గుర్తు చేసుకునేది వద్దిరాజు రవిచంద్రనే అంటే అతిశయోక్తికాదు. అంతలా ప్రజలకు చేరువయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. వారికి సేవ చేయడంలోనే వద్దిరాజు తరిస్తున్నాడు. పదవుల కోసం, రాజకీయాల కోసం ఆయన ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అలా అటు ఉద్యమకారులు, ఇటు ప్రజలు, సామాజిక బాధ్యతలు, అన్నీ ఏక కాలంలో నిర్వర్తించిన మనసున్న మారాజు వద్దిరాజు రవిచంద్ర అని ప్రజలు చెబుతుంటారు. నిస్వార్ధ సేవకు నిదర్శనం వద్దిరాజు రవిచంద్ర. ఆపన్నులకు అన్నం పెడుతూ, వారి ఆకలి తీర్చే నిండైన గొప్ప మానవతా మూర్తి వద్దిరాజు రవిచంద్ర. ఆయన చేసిన సేవలల్లో ప్రపంచమంతా చూసిన సేవలు అనేకం వున్నాయి. అందులో గత వర్షాకాలంలో వచ్చిన వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని వ్యక్తిగతంగా ఆదుకున్న ఏకైక నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. అకాల వర్షానికి ఖమ్మం జిల్లా కేంద్రంలోని అనేక కాలనీలు నీల మునిగాయి. రాత్రికి రాత్రే కురిసిన వర్షానికి అనేక కాలనీలు జలమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అప్పటికప్ప్పుడు షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి వసతీ సౌకర్యాలు కల్పించారు. వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాలకు దగ్గరుండి తరలించారు. ఇంతటి ప్రయత్నం ప్రభుత్వంలో వున్న పెద్దలు కూడా చేయలేదు. అంతే కాకుండా వరద నీళ్లు పోయిన తర్వాత ప్రతి కుటుంబానికి నెలకు అవసరమైన సామాగ్రిని ప్రతి ఇంటికి అందించిన ఏకైన నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఇదిలా వుంటే వరదల్లో చిక్కుకొని ఆర్తనాలు పెడుతున్న వారిని అప్పటికప్ప్పుడు జేసిబిలను పంపించి ప్రాణాలతో సురక్షింగా రక్షించారు. ప్రాణ హాని జరకుండా ఆ కుటుంబాలలో వెలుగులు నింపారు. ఇక కరోనా సమయంలో ఖమ్మం జిల్లా ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు వద్దిరాజు రవిచంద్ర చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు అప్ప్పుటి బిఆరఎస్ ప్రభుత్వం చేసిన సాయానికి తోడుగా వద్దిరాజు ఎంతోమందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. వేలాది కుటుంబాలకు బియ్యం, ఇతర సామాగ్రిని సరఫరా చేసి ఖమ్మం ప్రజల చేత దేవుడనిపించుకున్నారు. ఇప్పటికీ ఆయనను ప్రజలు కొలుస్తూ వుంటారు. అంతలా ప్రజలకు సేవ చేసిన వద్దిరాజు రవిచంద్రను ప్రజలు ఎమ్మెల్యే కాలనుకుంటున్నారు. మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిసి ్దతుల్లోనూ ఖమ్మం జిల్లాను బిఆరఎస్ కంచుకోటగా మార్చాలని వద్దిరాజు ఎంతో కషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో అందరికంటే ముందున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను బిఆరఎస్ స్వీప్ చేసేందుకు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఖమ్మం అడ్డా, గులాబీ గడ్డగా మార్చేందుకు ఆయన పడుతున్న శ్రమం అంతా ఇ ంతా కాదు. అలాంటి వద్దిరాజు రవిచంద్ర భవిష్యత్తులో మంచి ఉన్నత స్దానానికి చేరుకోవాలని, ప్రజలకు , పార్టీకి మరింత సేవ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నేడు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టిన రోజు. ఆయనకు అభిమానులు, బంధువులు, శ్రేయోబిలాషులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పార్టీ నాయకులు పెద్దఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. బిఆరఎస్ పార్టీ అదినేత కేసిఆర్ పుట్టిన రోజు జరుపుకుంటున్న వద్దిరాజుకు ఆశీస్సులు అందించారు. వద్దిరాజు రవిచంద్ర ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాయలతో జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, రాజకీయంగా ఉన్నత స్దానాలు పొందాలని నేటిధాత్రి ప్రత్యేకంగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు, అభినందనలు అందిజేస్తోంది.
మండలం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాహసిల్దార్ రాణి కార్యాలయ సిబ్బంది చే ఓటర్ల బాధ్యత ను తెలియజేస్తూ భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛ, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం,జాతి,కులం,వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించండం జరిగింది,స్కూల్ పిల్లలతో మండల కేంద్రములో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు అవశ్యకత పై అవగాహన కల్పించారు,ఓటర్ల దినోత్సవం పై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానము చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాణి,కార్యాలయ సిబ్బంది,మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు, ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్స్,ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మొగిలిపేట్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామంలో నేతాజీ యూత్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సర్పంచ్ ఉప సర్పంచ్ నేతాజీ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ మహనీయుడు కి ఘననివాళులు ఆర్పీస్తూ జాతి గర్వించదగిన గొప్ప దేశభక్తుడు , భారత జతి కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావులు స్వాతంత్ర్యం
అంటే అడిగి తిసుకొనే బిక్ష కాదు పోరాడి సాధించుకునే హక్కు అని ఆజాద్ హిందు పౌజ్ స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అంటూ చలో ఢిల్లీ జైహింద్ అంటూ నినాదాలతో భరతమాత స్వతంత్ర తెచ్చిన మహానుభావులు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళా రమేష్, ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, వీడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్, బిజెపి మొగిలిపేట గ్రామ అధ్యక్షుడు శివరాత్రి వెంకటేష్ నేతాజీ యూత్ సభ్యులు ఎస్పి రమణ, ఎండి మహబూబ్ ఖాన్, దరిపెల్లి అశోక్, గ్రామ ప్రజలు ఎస్పీ బాపు స్వామి సామ శ్రీనివాస్ నైనే ని రాజేందర్, దూలురి సుధాకర్, చిన్న అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు ఉన్న ఓటర్ ఓటు వేసే ప్రజాసామ్య విలువలు కాపాడాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఓటు వేసే ప్రజాస్వామ్యలో విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యలయంలో అధికారుల తో ఓటరు దినోత్సవం పై ప్రతిజ్ఞ చేయించారు.భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య విలువలు సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత oగా జేరుగుటకు ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్
రెండో రోజు కొనసాగిన ఎంసిపిఐ(యు) రాష్ట్ర శిక్షణ తరగతులు
నర్సంపేట,నేటిధాత్రి:
పెత్తందారి పోకడలతో అశాంతిని సృష్టిస్తూ ఇతర దేశాలపై విచక్షణారహితంగా పనులను విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంపు అవలంబిస్తున్న వినాశనకర విధానాలకు బిజెపి మోడీ ప్రభుత్వం వత్తాసు పలకడం దేశ ప్రజలకు హానికరమని ఎం సి పి ఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద నియంతృత్వ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచశాంతి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి లో జరుగుతున్న ఎంసిపిఐ (యు) రాష్ట్ర స్థాయి సైతాంతిక రాజకీయ రెండో రోజు శిక్షణా తరగతుల్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ పరిణామాలు కమ్యూనిస్టులు కర్తవ్యం అనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ వంగల రాగసుధ అధ్యక్షత వహించగా జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ హాజరై మాట్లాడారు.ప్రపంచంలో యుద్ధాలను ప్రేరేపిస్తూ అశాంతిని సృష్టించే విధంగా తద్వారా తన దేశంలోని అణ్వయుధాల వ్యాపారాన్ని విస్తృతపరచుకోవడానికి లాటిన్ అమెరికా దేశాల చమురుపై గుత్తాధిపత్యాన్ని సాధించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలోనే వెనిజులా అధ్యక్షుడు మధురోను అక్రమంగా బంధించి తన నియంతృత్వాన్ని చాటాడని తనను సమర్థించని ఇతర దేశాలపై పన్నుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.పరోక్షంగా యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారని అలాంటి సామ్రాజ్యవాద అమెరికా ట్రంప్ విధానాలకు మోడీ వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం అని అయినా ట్రంపు మాత్రం భారత్ పై పన్నుల భారం మోపుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోట్లాదిమంది ప్రజలకు రోజువారి ఉపాధి కరువై కనీసం అవసరాలు తీర్చుకోలేక రెండు పూటల తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ఎంతో కొంత ఉపయోగపడే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగార్చే విధంగా చట్టాన్ని మార్చివేశారని ఇది సరైన చర్య కాదన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ పేరుతో కోట్లాదిమంది ప్రజల ఓట్లను కుంటిసాకులతో తొలగించి తమకు అనుకూలమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచుతున్నారని తద్వారా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అభాష్యం పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు కార్మిక కూలి వ్యతిరేక విధానాలతో శ్రామికుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న మోడీ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు.
ప్రపంచీకరణ నూతన ఆర్థిక కార్పోరేట్ విధానాలను అవలంబించే బూర్జువా పార్టీలు ప్రజలకు ఏమి చేయవని. కార్మిక వర్గ, సామాజిక స్పృహ కలిగి మార్క్సిజం – ఫూలే, అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన వర్గ, సామాజిక జమిలి సిద్ధాంత ప్రత్యామ్నాయం ఏర్పాటు ద్వారా మాత్రమే మనువాద, బ్రాహ్మణ ఫాసిస్టు ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, ప్రత్యామ్నాయం ఏర్పాటు ద్వారా నిర్మించాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.వర్గ సామాజిక జమిలి ప్రత్యామ్నాయం కోసం ఏర్పడ్డ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడి 7 సంవత్సరాల సందర్భంగా జనవరి 25 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఎఫ్ జెండాలను ఎగురవేయాలని అన్నారు. మావొయిస్టు పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో బయటికి వచ్చిన కామ్రేడ్సు యంసిపిఐ(యు)తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష సామాజిక శక్తులతో కలిసి పోటీ చేయాలని బూర్జువా భూస్వామ్య పెట్టుబడి దారీ పాలక వర్గం వ్యతిరేకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి సభలను విజయవంతం చేసేందుకు ప్రజలు ప్రజాతంత్రవాదులు సహకరించాలన్నారు.ఈ శిక్షణ తరగతులలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, కుంభం సుకన్య, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి,మంద రవి,రాష్ట్ర కమిటీ సభ్యులు నర్రా ప్రతాప్,కుసుంభ బాబురావు, గుండెబోయిన చంద్రయ్య, తుడుం అనిల్ కుమార్,కర్ర దానయ్య, జబ్బర్ నాయక్, నీల రవీందర్, కర్ర రాజిరెడ్డి, కనకం సంధ్య, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి, దుగ్గొండి మండల కార్యదర్శి సింగతి మల్లికార్జున్ వివిధ జిల్లాల నాయకత్వం స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలో వివేకవర్ధిని హై స్కూల్ విద్యాసంస్థల అధినేత, టస్మా జిల్లా అధ్యక్షుడు, కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాలెండర్ను ఆయన తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైందని తెలిపారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. నూతన సంవత్సరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విద్యారంగంలో మరిన్ని విజయాలు తీసుకురావాలని, ప్రతి పాఠశాల నాణ్యమైన విద్యకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రైమరీ క్యాంపస్ ఇన్చార్జి చిర్ర విజయ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ఐక్యతతోనే విద్యాసంస్థల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ బోధనా విధానాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చీకటి బీరయ్య, మహమ్మద్ గౌస్, డెక్క లక్ష్మణ్, సతీష్, ప్రవళిక, హారతి ఠాగూర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అలాగే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గండు మురళి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయ బృందం సభ్యులు హాజరై, నూతన సంవత్సరంలో ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నూతన సంవత్సర శుభాకాంక్షలతో సార్థకంగా కొనసాగింది.
చేనేత రుణమాఫీలో భాగంగా మండల కేంద్రంలోని చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ,9,00,000 లను చెక్ రూపంలో అందజేయడం తో మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో పనిచే స్తున్న చేనేత కార్మికులకు ఊర ట లభించింది. ఇందుకుగాను చేనేత ఔలి శాఖ ఏడి విజయ లక్ష్మి మరియు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లకు మాజీ ఎంపీపీ తెలంగాణ రాష్ట్ర కార్మిక మినిమమ్ వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్ర కాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేపట్టి న రుణమాఫీ కార్యక్రమాన్ని స్వాగతించారు. కార్మికులకు రుణమాఫీ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రుణమాఫీ చేసి తో డ్పాటు అందించడం ఆనం దకరమని తెలియజేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.