శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాజేంద్ర రావు

శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేంద్ర రావు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా అర్చకులు రాజేంద్ర రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు అర్చన, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అధికారులు భక్తులు పలువురు ప్రతినిధులతో కలిసి రాజేందర్ రావు ఊరేగింపుగా వెళ్లి పాత బజార్ లోని శివాలయం నుంచి పుట్ట బంగారం కోసం వెళ్లి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్ట బంగారం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన తదితర పూజ కార్యక్రమాల్లో రాజేందర్రావు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, పలువురు నేతలు, మహిళలు, భక్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజనగరంలో అయ్యప్పస్వామి మండల పూజ ఊరేగింపు

అయ్యప్పస్వామి మండల పూజ సందర్భంగా స్వాములు ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి .

 

రాజనగరం అయ్యప్పస్వామి ఆలయంలోకి శుక్రవారం మండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఊరేగింపు నిర్వహించారుమండల పూజ
ఉత్సవంలో స్వామి వారి ఆభరణాలు అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చీర్ల.కృష్ణ సాగర్ గురుస్వామి అద్యర్యము లో ఊరేగింపు నిర్వహించారు అయ్యప్ప స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తు కృష్ణ గురుస్వామి,కోశాధికారి పాపిరెడ్డి,ప్రచార కార్యదర్శి అమర వాది చిట్యాల నరేందర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మండల పూజ భక్తిశ్రద్ధలత జెరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమములో ఆలయ అర్చకులు అచ్చితాపురం రమేష్ బాబు ,బీచుపల్లి యాదవ్ ,వాకిటి.శ్రీధర్ నందిమల్ల.అశోక్, యాదగిరి,ఆవుల.రమేష్ ,భక్తులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version