నర్సంపేట నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు

నర్సంపేట నుండి మేడారం ప్రత్యేక బస్సులు

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఈనెల 25 నుండి ఫిబ్రవరి 31 వరకు నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు నడపడనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.ఇందుకు గాను సుమారు ముప్పైరెండు వేల పైగా ప్రయాణికులు నర్సంపేట నుండి మేడారం జాతరకు ప్రయాణిస్తారని అంచనా వేసామన్నారు.కాగా 145 బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పరిస్థితి బట్టి మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నుండి మేడారంకు పెద్దలకు రూ.270/- పిల్లలకు రూ.170/- గా టికెట్ ధర, కొత్తగూడ నుండి పెద్దలకు 330/-, పిల్లలకు 200/-నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యం సరియైన ధ్రువీకరణ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ప్రయాణానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.బూత్ కౌంటర్లు ఏర్పాటు చేసి
మేడారం జాతరకు తరలివెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం, ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను బస్సులలో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు.టికెట్ కౌంటర్లు 24 గంటలు పనిచేస్తాయి.కాగా జాతరకు సుమారు 400 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం తగిన ఏర్పాటు చేయడం తో పాటు త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్, తగు సూచనలను, సలహాలను అందించడానికి హెల్ప్ డెస్క్, మెడికల్ సదుపాయం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ వివరించారు.భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవార్ల గద్దెల అతి సమీపం వరకు చేరుకుంటారని కావున ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందగలరని ఆమె కోరారు.

మేడారం మహాజాతరకు వరంగల్ నుంచి 290 ప్రత్యేక బస్సులు

మేడారం మహాజాతరకు వరంగల్ నుంచి 290 ప్రత్యేక బస్సులు

వరంగల్ బస్ స్టేషన్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు.

వరంగల్ నుంచి మేడారంకు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా టికెట్ ధరలు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతాం.

… డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్.

వరంగల్, నేటిధాత్రి.

 

మేడారం మహాజాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ బస్ స్టేషన్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ నుంచి మేడారం జాతరకు సుమారు లక్షకు పైగా ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, అందుకు అనుగుణంగా 290 బస్సులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పరిస్థితిని బట్టి మరిన్ని బస్సులను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు వరంగల్ ఓసిటి గ్రౌండ్ సమీపంలో బస్సులను పార్కింగ్ చేసి, అవసరాన్ని బట్టి అక్కడి నుంచి బస్సులను బస్ పాయింట్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ నుంచి మేడారంకు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా టికెట్ ధరలను నిర్ణయించారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా నాలుగు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు. టికెట్ తీసుకున్న అనంతరం క్యూలైన్ల ద్వారా నేరుగా బస్సుల్లో ఎక్కేలా ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణలో భాగంగా సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం చలువ పందిళ్లు, త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన సమాచారం, సూచనలు అందించేందుకు హెల్ప్‌డెస్క్, ప్రత్యేక మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ మాట్లాడుతూ, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని, మేడారం మహాజాతరతో పాటు అగ్రహంపాడు జాతరకు కూడా వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

ఇందు డిపో మేనేజర్ భూపాలపల్లి

భూపాలపల్లి నేటిధాత్రి

 

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్‌టిసి టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఇందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక్క రోజులో భూపాలపల్లి నుండి కొమురవెల్లి, కొండ పోచమ్మ వేములవాడ, కొండా గట్టు, ధర్మపురి సందర్మించి రాత్రి భూపాలపల్లికి బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు :-680/-
ఒక్క రోజులో భూపాలపల్లి నుండి భద్రచలం, పర్ణశాల , మల్లూరు దేవాలయాలను సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:- 700
ఒక్క రోజులో భూపాలపల్లి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుదని . ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:-770/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి బీజపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఆలంపూర్ జోగులాలు దేవాలయాలను సందర్శించి మరుసటి రోజు రాత్రి భూపాలపల్లికి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ -పోనూ చార్జీలు:- 1700/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి విజయవాడ కనక -దుర్గా అమ్మవారి దేవాలయం, అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి సందర్శించుకొని మరుసటి రోజ రాత్రి భూపాలపల్లి కి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ…పోనూ చార్జీలు :-2150/-
ఇలా ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలు బస్సులు నడపాలని నిర్ణయించాముని, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పూర్తి సమాచారం కోసం :- 9959226707, 9701967519, 9849425319, 9908336391

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version