జిల్లా కలెక్టర్ ఓటర్లకు ప్రజాస్వామ్యం కాపాడాలని ఆహ్వానం

ఓటు హక్కు ఉన్న ఓటర్ ఓటు వేసే ప్రజాసామ్య విలువలు కాపాడాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఓటు వేసే ప్రజాస్వామ్యలో విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యలయంలో అధికారుల తో ఓటరు దినోత్సవం పై ప్రతిజ్ఞ చేయించారు.భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య విలువలు సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత oగా జేరుగుటకు ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈకార్యక్రమంలో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.

బీహార్ ఓటర్ లిస్ట్ వివాదంపై కఠినంగా స్పందించిన ఎన్నికల సంఘం..

బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పై వచ్చిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది.
ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ మాట్లాడుతూ – “ఎన్నికల దోపిడీ ఆరోపణలు భారత రాజ్యాంగానికి అవమానం” అని హెచ్చరించారు.

అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే ఓటర్ల జాబితాలో మార్పులు చేయడానికి SIR చేపట్టామని ఆయన తెలిపారు. మొత్తం 1.6 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీల ప్రతినిధులు కలిసి డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేశారని స్పష్టం చేశారు.

“గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి హానికరం” అని గ్యానేశ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version