నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే

నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే.

జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపాలో చేరికలు.

నర్సంపేట,నేటిధాత్రి:

రాబోయే రోజుల్లో రాజకీయంగా నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు.త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నిక నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల వార్డు ఇన్చార్జుల పోటీకి సిద్ధమైన అభ్యర్థుల విజయ సంకల్ప సభ బిజెపి పట్టణ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్,నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి శ్రీమతి రావు పద్మ, జిల్లా ఎన్నికల కో కన్వీనర్ కంభంపాటి పుల్లారావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుపుతూ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ప్రతి ఇంటికి చేరవేసేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధంగా పనిచేయాలని సూచించారు. బిజెపికి 60 శాతం ఓట్లు వేయించే విధంగా ప్రణాళిక చేసుకోవాలని కోరారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిన ఉద్యమాలు ప్రజలకు ఒక్కసారి గుర్తుచేసి ఓటు అడగాలని అన్నారు. రాబోవు ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై స్థానిక నాయకులతో కలసి చర్చించారు.

బీజేపీ పార్టీలో భారీగా చేరికలు..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వపురం 5వ,6వ వార్డులలో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల నుండి యువనాయకుడు అంజపెల్లి రాజు అద్వర్యలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన పార్టీలో చేరగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రావు పద్మ, జిల్లా ఎన్నికల కో కన్వీనర్ కంభంపాటి పుల్లారావులు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగరడం ఖాయం అని అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని జిల్లా పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల కో కన్వీనర్ వడ్డేపల్లి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాబేటి వెంకట్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, గడల కుమార్, కందిమల్ల మహేష్, బాల్నే జగన్,జిల్లా కార్యదర్శులు గుడుపూడి రాధాకృష్ణ, గోకే వెంకటేష్, మంద శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్, మండల అధ్యక్షులు గూడూరు సందీప్, జిల్లా నాయకులు బండి సాంబయ్య యాదవ్, కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునారెడ్డి పొట్టి శ్రీనివాస్ గుప్తా, నియోజకవర్గ నాయకులు శీలం సత్యనారాయణ, జుర్రు రాజు, కొనుముల పృధ్వీరాజ్, పంజర్ల రామ్, పొదిళ్ళ రామచందర్ మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ భాజపాకు ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం: సీతారాం నాయక్

ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.

రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.

మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్

కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు

జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ

2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్,
పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు.
గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు.
సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో
30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం.
ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి…

మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

త్వరలో జరగబోయే నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో కషాయం జెండా ఎగవేసేందుకు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్
గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలలో 30 వార్డులలో అభ్యర్థులుగా నిలబడి విజయం సాధించడానికి కష్టపడాలని తెలిపారు.అలాగే బిఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పాలనను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
అవినీతి పరమైన బిఆర్ఎస్ పట్ల,
దౌర్జన్యపరమైన కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చూపిన 420 హామీల పట్ల ప్రజలు విసుకుచెందారని దీంతో ప్రజలందరూ కూడా బిజెపికి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.పోటీచేసే అభ్యర్థులు ప్రతీ బూత్ ను పటిష్టంగా చేసుకొని గడప గడపకు ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను తీసుకెళ్లాలని దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ , సీనియర్ నాయకులు కూనమళ్ళ పృథ్వి రాజ్ , జూలూరి మనీష్ గౌడ్ , శీలం సత్యనారాయణ, బాల్నే జగన్,
జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత,పట్టణ నాయకులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version