మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బానోత్ సారంగపాణి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అనంతుల రాజ్ కుమార్ గౌడ్ తండ్రి రాములు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇంచార్జి గందె శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ మంద సుజాత రాజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మురాల ప్రతాపరెడ్డి, నాయకులు తౌట్ రెడ్డి రాజిరెడ్డి, ఇంగ్లీ రవి, అబ్బు విజయేందర్ రెడ్డి, వార్డు మెంబర్స్ గంగారావు వినయ్, హింగే రమేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లిలో బిజెపి నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

బిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరిక.

#ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

#మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తలకు అండగా ఉండి కంటిరెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన స్వగృహం వద్ద నల్లబెల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు కొండ్లె శ్రావణ్, రాజేష్, జక్కోజు కృష్ణ, ఉడుత సాయి, వంశీయులు బిజెపి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ న్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాష్ మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం యాదవ్, మాజీ ఎంపిటిసి వైనాల వీరస్వామి, మాజీ సొసైటీ డైరెక్టర్ సట్ల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, యూత్ నాయకుడు మేడిపల్లి రాజు గౌడ్, కొత్తపల్లి రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version