మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…

స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మండేపల్లి సర్పంచ్ గాదగోనీ సాగర్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో వారసంతపు సొంత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ మండపల్లి వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరుగుతుందని. కనుక ఈ వారంతపు సంతలు నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయని ఇందులో కూరగాయలు కానీ నిత్యవసర వస్తువులు కానీ ఇతర ఏ వస్తువులైన అన్ని సదుపాయాలు ఉంటాయని ప్రజలు పట్టణాలకు వెళ్లి తీసుకువచ్చేఅవకాశలు లేకపోగా సమయం వృధాగా అందుబాటులో ఉండకపోవడంతోసమయం కలిసొస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి వారం మూడు గంటలకు ప్రారంభమై సాయంకాలం ముగుస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరికీ అందుబాటులో విధంగా సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా రాబోయే రోజులలో పశువుల అంగడి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలు గాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాని అందరు సహకరించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ చుట్టుపక్కల గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా అందరు సహకరించాలని గ్రామంలో మైకు ద్వారా ప్రచారం నిర్వహించారుఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version