నడికూడ మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు

నడికూడ,నేటిధాత్రి:

మండలం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాహసిల్దార్ రాణి కార్యాలయ సిబ్బంది చే ఓటర్ల బాధ్యత ను తెలియజేస్తూ భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛ, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం,జాతి,కులం,వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించండం జరిగింది,స్కూల్ పిల్లలతో మండల కేంద్రములో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు అవశ్యకత పై అవగాహన కల్పించారు,ఓటర్ల దినోత్సవం పై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానము చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాణి,కార్యాలయ సిబ్బంది,మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు, ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్స్,ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ఓటర్లకు ప్రజాస్వామ్యం కాపాడాలని ఆహ్వానం

ఓటు హక్కు ఉన్న ఓటర్ ఓటు వేసే ప్రజాసామ్య విలువలు కాపాడాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఓటు వేసే ప్రజాస్వామ్యలో విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యలయంలో అధికారుల తో ఓటరు దినోత్సవం పై ప్రతిజ్ఞ చేయించారు.భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య విలువలు సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత oగా జేరుగుటకు ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈకార్యక్రమంలో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version