కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం.నరసింహుల.పల్లి గ్రామంలో యాదవ రెడ్డి యదా.లక్ష్మి కూతురు వివాహానికి.పుస్తె. మట్టలు. అందజేసిన కరీంనగర్ డైరీ. ఈ సందర్భంగా చిన్న లింగాపూర్ రూట్ సూపర్వైజర్ గడ్డం సతీష్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ డైరీ. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా .కళ్యాణమస్తు పథకంలో. భాగంగా ఆడబిడ్డ పెళ్లికి ఇస్తే మట్టలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం .నరసింహుల.పల్లి గ్రామంలో పాడి రైతు కొండేటి యాదిరెడ్డి.యాదలక్ష్మి ల కూతురు వెన్నెల వివాహం జరుగుతుండగా వారి వివాహానికి కరీంనగర్ డైరీ. ఆధ్వర్యంలో.పుస్తె .మట్టల పథకంలో భాగంగా .అడవిడ్డ పెళ్లికి అందజేయడం జరిగిందా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. నరసింహుల.పల్లి పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు మంద దేవయ్య. డైరెక్టర్లు.కోoడేటి.రాములు. పల్లె నర్సింలు. సెక్రెటరీ గో డిసెలబాబు. తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండల జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఉపాధి హామీని వెంటనే కొనసాగించాలని. ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని. రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని.2025.వ. విద్యుత్ సవరణ .బిల్లురద్దుకై. ప్రభుత్వ రంగ పరిశ్రమల .పరిరక్షణకై కనీసవేతనాల .పెంపుకై. మతోన్మాద. కార్పోరేట్ రాజకీయాలకు .వ్యతిరేకంగా అమాలి కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని. ప్రధానంగా. ఉపాధి హామీ పథకంలో. దేశవ్యాప్తంగా 12 కోట్లమంది.పనిచేసుకునే. జీవనోపాధి .పొందుతున్నారని. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 వేల మంది ఉపాధి కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.2005లో వామపక్షాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టగా. గ్రామీణ ప్రాంతంలో వలస నివారణకు పట్టెడు అన్నం దొరికే అవకాశం ఉన్న పథకం ఉపాధి హామీ పథకం అని. ఈ పథకంలో .12 కోట్లమంది. పనిచేయగా. ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం నిర్వీవరం. చేయడానికి ఈ పథకానికి 1,50,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండగా కేవలం 85 కోట్ల బడ్జెట్తో కొనసాగించడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతనాలులేక సమయానికి బకాయిలు పెండింగ్ ఉండడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని. సంవత్సరంలో 200 రోజుల పరిధిలో కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని. తెలియజేస్తూ .బిజెపి ప్రభుత్వం .ఈజిఎస్.పథకాన్ని రద్దుచేసి. కార్పొరేట్ శక్తులకు ఉపయోగ పడే విధంగా చట్టాన్ని .తీసుకువచ్చిందని. ఈ సంవత్సరంలో 125. రోజుల పని కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం డొల్లమాటలు చెబుతుందని. ఒక 100. 25 రోజుల. పని కల్పిస్తామని చెబుతుందని. పని కల్పిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని సంవత్సరంలో 100 రోజులు ఆ పని కల్పిస్తే 1.50.000. కోట్ల బడ్జెట్ పెట్టండి. బీజేపీ ప్రభుత్వం మరియు 125 రోజుల పని దినాలను ఎట్లా .కూర్చుతుందో ఆ బిజెపి మాటలు .డొల్లతనం అని .తెలియజేస్తుందని. కేంద్ర ప్రభుత్వము 90 శాతం నిధులు తోటి ఈజీఎస్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది కానీ. బిజెపి ప్రభుత్వం కొత్త చట్టంలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని దుర్మార్గమైన నిర్ణయం చేస్తుందని. ఉపాధి హామీ చట్టాన్ని .నిర్వీరం చేయడానికి తెలుగు రాష్ట్రాల పైన 2900. కోట్ల భారం పడి ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టు ముట్టాడుతున్న. రాష్ట్రాల పైన మరొక భారం పడడం. ఇది తక్షణమే. వి.పి.జి. రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని. తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గుంటి వేణు. మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్. సిపిఐ మండల నాయకులు బచ్చపల్లి శంకర్. రాజేందర్. బాలయ్య. రాములు. మల్లయ్య. శంకర్. ఆనందు. రవి. నరసయ్య. గోవిందు. తదితరులు పాల్గొన్నారు

ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మత్తులు….

ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మత్తులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల అంకుసాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోనీ. చంద్రవంక మొదటి కాల్వ నుండి గడ్డం అంజయ్య పొలం వరకు ఉన్న రహదారికి .మొరం పోయడంతోపనులను ప్రారంభించారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడo తోపాటు రైతులకు వ్యవసాయ కార్యకలాపాలకు. వచ్చే పోయే వారికి అసౌకర్యం లేకుండా ఉండడంతోపాటు వర్షాకాలంలో ఎదురయ్యే రహదారి సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని. ఇట్టి కార్యక్రమాన్ని .అంకుసాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులను ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ అచ్చ శ్రీనివాస్ రెడ్డి. ఉప సర్పంచ్ రాజేశం. గ్రామ సెక్రెటరీ సంతోష్. ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి. గ్రామ వార్డు సభ్యులు.సవా వణపల్లిబాలయ్య. కార్యం పరిస.రాములు. తుమ్మల కనకయ్య. రేగులశ్రీనివాస్. రోడ్లమధు. కోడి కనకయ్య. గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

సారంపల్లి గ్రామంలో సీఎం కప్–2026 క్రీడల పోటీలు ప్రారంభం

సారం పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య ఆధ్వర్యంలో. సీఎం కప్ .2026. గ్రామపంచాయతీ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో సీఎం కప్ క్రీడల పోటీలు ప్రారంభం జరుగుతున్నాయని. ఈ పోటీలలో అన్ని జట్ల క్రీడాకారులు పాల్గొంటారని. క్రీడల క్రీడాకారులకు ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని. క్రీడల్లో పాల్గొనడం గెలుపు ఓటమి సహజమని యువత ఎక్కువగా క్రీడలపై దృష్టి సారించాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడా పోటీలను ప్రారంభించిన స్థానిక సారం పెళ్లి సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో. గ్రామ ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ. వార్డు మెంబర్లు. రమేష్. వినోద. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు.మునిగలరాజు. కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.గడ్డమీదిశ్రీనివాస్. కుమారస్వామి. కిషన్. గుగ్గిళ్ళ శ్రీనివాస్. సునీల్. దేవదాసు. మహేష్. మధు. శరత్. అభిషేక్ తదితరులు పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసరాలు అందజేత

చనిపోయిన కుటుంబానికి బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలo లొ బదనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన బూర్ల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ స్పందించి వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించగా.వారి కుటుంబానికి పరామర్శించి. తక్షణ సహాయం కింద బియ్యంతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు సరుకులు అందజేసిన అధికారులు. అలాగే ప్రభుత్వపరంగా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు వెల్లడించారు.ఇట్టి విషయమై మృతుడు లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే .మహేందర్రెడ్డి ల దృష్టికి తీసుకువెళ్లి. వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ తెలిపారు. మృతి పై స్పందించి లక్ష్మీనారాయణ మృతి చెందగా వారి కుటుంబానికి కుటుంబానికి. బూర్ల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా ఇందిరమ్మ కాలనీ మాజీ ఉపసర్పంచ్.అల్వాల సాయిరాం .స్పందించి లక్ష్మీనారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు అలాగే. కష్ట సమయంలో ప్రజల కు ఆపద సమయంలో వారి వారి కుటుంబాలకు.అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇందిరమ్మ కాలనీ మాజీ ఉపసర్పంచ్ సాయిరాం తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. వేముల నరేష్. కిషన్. ప్రశాంత్. నరసయ్య. రాకేష్ నాయకులు గ్రామ ప్రజలు పార్టీలకతీతంగా గ్రామంలో ప్రజలందరూ పాల్గొని పరామర్శించారు

మండపల్లిలో ఘనంగా కాట్రేగుల సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కాట్రేగుల పలు కార్యక్రమాల సంబరాలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా కాట్రేగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గ్రామంలోని రాములవారి గుట్ట వద్ద రైతులు పశువులను దైవంగా భావించి పూజించి అంతరించిపోతున్న సాంస్కృతిక సంప్రదాయాలను పునరుద్ధరించే సందర్భంలో పశువులకు .జాజు.నూనె రాసి కాట్రేగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శీతాకాలంలో పశువులకు వచ్చే గాలి కుట్టు వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని మంటల వేడి మరియు పొగ పశువుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని రైతులు నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద పెద్ద ఎత్తున సంక్రాంతి పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారని అలాగే గ్రామంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని. M.P.L. క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్న సందర్భంగా క్రికెట్ టీం లకు లక్కీ ఈవెంట్స్.. టాటా. AIG. హెల్త్ ఇన్సూరెన్స్ వారు క్రికెట్ టీం సభ్యులకు .టీషర్ట్లు అందించడం జరిగింది. దీనికి సూపర్ అసిస్టెంట్ గుర్రం నవీన్ టీ షర్ట్లు అందించడం జరిగింది ఇట్టి.సంక్రాత్రి సంబరాలకు గ్రామంలోని యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఉప సర్పంచ్ యాస సందీప్. వార్డు మెంబర్లు. అమర గోoడప్రభుదాస్. మూర్తి .మైపాల్రెడ్డి. రాయి పెళ్లి కృష్ణారెడ్డి. ఆసాని మహిపాల్ రెడ్డి..కరోబార్ దుర్మట్లలచ్చిరెడ్డి. హరికృష్ణ. కోమ్మటదేవయ్య. దాసరి దేవయ్య. కుల మల్లేశం. రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

బస్వాపూర్ గ్రామంలో వాలీబాల్ పోటీలు ప్రారంభం

వాలీబాల్ పోటీలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఇట్టి వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని. తన తాత అయిన పూర్మాని ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని. ఇట్టి పోటీలను స్థానిక గ్రామ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో 8 జట్లు పాల్గొన్నట్లు పోటీలలో గెలుపొందిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేసినట్లు పేర్కొంటూ గ్రామ క్రీడల శరీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని. క్రీడలు ఆడటం వల్ల యువకులు మంచి ఫిట్నెస్ సాధిస్తారని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని గెలుపోటములు సహజమని. గ్రామస్థాయి క్రీడాకారులు ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని. ఇట్టి కార్యక్రమానికి హాజరై యువతకు క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా స్థానిక బస్వాపూర్ సర్పంచి. సర్పంచులఫోరం మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ యువకులు ప్రజలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మండపల్లిలో సంక్రాంతి క్రికెట్ పోటీలు

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.మండేపల్లిలో క్రికెట్ పోటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్ ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి పండుగ పురస్కరించుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు యువత నాయకులు మాట్లాడుతూ. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నా ఎందరో వచ్చి పోతున్న కూడా గ్రామంలో యువతకు క్రీడా ప్రాగణం లేకపోవడంతో యువత గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి స్థలం లేకపోవడంతో ఈ పాలకవర్గమైన గ్రామ పరిసరాల్లో యువతకు అనుకూలంగా క్రీడలకు స్థలం కేటాయించవలసిందిగా దాని ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి ఒక మినీ స్టేడియం నిర్మించాలని గ్రామంలోని ప్రతి ఒక్కరు యువత ప్రజలు నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గాన్ని కోరడం జరిగిందని దీనిపై స్పందించిన సర్పంచ్ సాగర్ సాధ్యమైనంత త్వరలో క్రీడా ప్రాగానం నిర్మాణం చేపట్టే విధంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి యువతకు ఆటలు ఆడుకునే విధంగా ప్రాగణం ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా యువతకు గ్రామ ప్రజలకు యువకులకు నాయకులకు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని తదనంతరం క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగిందని ఇట్టి పోటీలలో గెలుపొందిన జట్లకు తగిన పారితోషకం బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ యువత క్రీడాకారులు క్రికెట్ కు సంబంధించిన పలు గ్రామాల జట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పాపాయిపల్లిలో ఘనంగా ముగ్గుల పోటీలు

ముగ్గుల పోటీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో కులమత భేదాలకు లోను కాకుండా పార్టీలకతీతంగా ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటూ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు ఇట్టి పోటీల కార్యక్రమానికి గ్రామంలోని యువకులు యువత ప్రజలు మహిళలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version