ప్రజాస్వామ్యానికి పునాది ఓటు
నడికూడ,నేటిధాత్రి:
మండలం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాహసిల్దార్ రాణి కార్యాలయ సిబ్బంది చే ఓటర్ల బాధ్యత ను తెలియజేస్తూ భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛ, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం,జాతి,కులం,వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించండం జరిగింది,స్కూల్ పిల్లలతో మండల కేంద్రములో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు అవశ్యకత పై అవగాహన కల్పించారు,ఓటర్ల దినోత్సవం పై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానము చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాణి,కార్యాలయ సిబ్బంది,మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు, ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్స్,ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
