ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు.!

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే వ్యవసాయం సాగిస్తున్నారు దీనితో వర్షాలు సకాలంలో రాకపోవడం వలన పంటలు ఎండిపోయి కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు.
వర్షాధారంపై పోడు వ్యవసాయం చేస్తూ నిరుపేద ఆదివాసి రైతులను ప్రభుత్వమే ఆ యొక్క రైతులకు వ్యవసాయ బోర్లు కరెంట్ లైన్ లేదా బోర్లు మోటార్లతోపాటు సోలార్లు మంజూరు చేసి ఈ యొక్క నిరుపేద ఆదివాసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి కరెంటు తెచ్చుకోలేని సన్న కారు చిన్న కారు ఆదివాసి రైతులకు సోలార్ విద్యుత్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వర్షాలు తక్కువ ఉన్నా కానీ బోరు మోటర్ సోలార్ ఉండటంతో దళారుల ఊబి నుండి బయటపడడమే కాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చుకోకుండా అప్పుల ఊబి నుండి వారిని వారు కాపాడుకోవడం కాకుండా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారంగా మారుతుందని వారు సూచించారు. అంతేకాకుండా పోడు వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు హక్కు పత్రాలు అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అంతేకాకుండా హక్కు పత్రాలు వచ్చినకాని కొన్ని గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు ఇవ్వకపోవడం వలన చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి నిరుపేద ఆదివాసి రైతులకు తక్షణమే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అంతేకాకుండా ముద్రించిన అడవి హక్కు పత్రాలు ఆఫీసు బీరువాల్లో ఉంచుకుంటున్నారే తప్ప ఆ యొక్క రైతులకు చేరవేయడం లేదు ఇదిలా ఉంటే కొంతమంది దళారులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర రైతులకు కూడా అటవీ హక్కు పత్రాలను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిశీలించి రద్దు విధంగా చర్యలు తీసుకోవాలని ఇక నిరుపేద ఆదివాసి రైతులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసి రైతులకు ఇవ్వడంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపంతో పూర్తిగా విఫలమైనారని వారు ఆరోపించారు ఇలాంటి తప్పిదాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఆ యొక్క అటవి హక్కు పత్రాలను ఆ రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినారు. ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ బోర్లులను 6 సంవత్సరాల వ్యవధి కాకుండా 1 సంవత్సరం లోపే సోలార్ బోర్డులను ఆదివాసి రైతులకు అందే విధంగా చూడాలని వారు అన్నారు అదేవిదంగా ఈ నెల 25న ఎన్నుకోబోయే నూతన మండల కమిటీకి మండలములోని ఆదివాసీ యువకులు హాజరుకగలరని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ ,జిల్లా కోశాధికారి పూనెం జనార్దన్ మండల నాయకులు చుంచ అనిల్, చింత శ్రీకాంత్, పులుసం హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

24 న మాదన్నపేటలో అమరవీరుల సంస్మరణ సభ

24 న మాదన్నపేటలో అమరవీరుల సంస్మరణ సభ

ఎంసిపిఐ (యు) డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 24న నర్సపేట మండలం మాదన్నపేట గ్రామంలో జరిగే అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.ఈ మేరకు మంగళవారం మాదన్నపేట లో సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.పీడిత ప్రజల కోసం,మనిషిని మనిషి దోపిడి చేసే వ్యవస్థ మార్పుకోసం దొరల దోపిడి దారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ సంస్మరణ సభ జరుగుతుందన్నారు.వరంగల్ జిల్లాలో ఉప్పెనల ప్రజా పోరాటాలను చూసిన నాటి పాలకవర్గ పార్టీ కాంగ్రెస్ అండదండలతో భూస్వాములు , ప్రజా కంఠకులు , పీడిత ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి సాగించిన మారణహోమంలో ఆణిముత్యంలాంటి విప్లవ ముద్దుబిడ్డలు నేలకొరిగారని గుర్తు చేశారు.ఈ సభలో పార్టీ రాష్ట్ర నాయకుల ప్రసంగాలు,ప్రజానాట్యమండలి కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించబడతాయన్నారు.వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని రాజమౌళి కోరారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,అనుమాల రమేష్,గుర్రం రవి పాల్గొన్నారు.

ఘనంగా సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భావ దినోత్సవం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు రష్యా విప్లవోద్యమ నేత కామ్రేడ్ లెనిన్ జయంతిని, సిపిఐ (ఎం-ఎల్) 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుండాల మండలంలోగుండాల, కాచనపల్లి, చెట్టుపల్లి, కొడవటంచ,చీమల గూడెం, నర్సాపురం తండ, కన్నాయిగూడెం, లక్ష్మీపురం,రోళ్లగడ్డ, ముత్తాపురం, గలభ, తూరుబాక, తూరుబాక ఎస్సీ కాలనీ తదితర గ్రామాలలో ఘనంగా లెనిన్ జయంతి, సిపిఐ (ఎంఎల్ )ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, జిల్లా నాయకులు కొమరం సీతారాములు, మండల కార్యదర్శి అరెం నరేష్ మాట్లాడుతూ 1968 లో సిపిఎం రీజనిస్ట్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ 1969 ఏప్రిల్ 22న పీడిత ప్రజల ఆశాజ్యోతి సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భవించి దున్నేవానికే భూమి కావాలని నినాదంతో గోదావరి లోయ పరివాహక ప్రాంతాలలో గిరిజనులను, గిరిజనేతర పేద ప్రజలను సమీకరించి లక్షలాది ఎకరాల పోడు భూములను కొట్టించి వాటి పట్టాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి పట్టాలు సాధించిందని అన్నారు.
ఈ క్రమంలో అతివాద ,మితవాద ధోరణులకు గురై అనేక చీలికలకు గురైనప్పటికీ ఇప్పటికీ సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ పేద ప్రజల తలలో నాలుకల పనిచేస్తుందని అన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విపలమయ్యాయని అన్నారు.
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, పర్శక రవి, గడ్డం లాలయ్య,ఈసం కృష్ణన్న, పూణెం నరసన్న, మోకాళ్ళ సూర్యనారాయణ, భానోతు లాలు, మానాల ఉపేందర్, వాగబోయిన సుందర్రావు, పూణేం పొట్టయ్య, తాటి రమేష్, మోకాళ్ళ పోతయ్య, కల్తీ ప్రభాకర్, గడ్డం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు.!

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం

వనపర్తి నేటిదాత్రి :

సోమశిల శివుని పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూజే ఐ జే యు విలేకరుల సమావేశం
నిర్వహించారు ఈ సమావేశములో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి జాతీయ నాయకులు దేవులపల్లి అమర్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ పాల్గొన్నారు . రాష్ట్ర విలేకరుల కమిటీ సోమశీల లో సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి దేవులపల్లి అమర్ ను విలేకరులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ విలేకరులు మల్యాల బాలస్వామి పోలిశెట్టి బాలకృష్ణ కొంతం ప్రశాంత్ డి మాధవరావు కల్వరాల రాజేందర్ విజయ్ డి మన్యం అంజి వహీద్ నరసింహ రాజు శ్రీనివాసరావు నాకొండ అరుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మల్ల రాములు  పాల్గొన్నారు

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను.!

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయండి. 
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశలో 27న జరిగే 25 వసంతల రజతోత్సవ చలో వరంగల్ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలను కార్యకర్తలను వచ్చి విజయవంత చేయవలసిందిగా కోరారు ఈ సమావేశం లో ముఖ్యఅతిథులుమాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు మరియు, మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బొల్లి రాంమోహన్ కుంబాల మల్లారెడ్డి నాగరాజు, యాదవ్ వివిధ మండలాల మాజీ జెడ్పిటీలు, ఎంపిటిసీలు సర్పంచ్ లు కౌన్సిలర్స్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పంచా యితీ కార్యాలయంలో ఉద యం కంటి పరీక్ష క్యాంపు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వ రంలో లయన్ విజన్స్ క్లబ్ సహకారంతో నాలుగో విడతలో భాగంగా నిర్వహించ డం జరిగింది దాదాపుగా గ్రామ వృద్ధులు 80 మందికి ఉచి తంగా కంటి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయించు కోవడం జరిగింది అందులో ఒక 35 మందిని కంటి ఆపరేషన్ ఎన్నుకోవడం జరిగింది వారికి ఉచితంగా బస్సు భోజనము పడక కల్పిస్తూ హైదరాబాదు లోని పుష్పగిరి ఆసుపత్రికి తీసుకుపోయి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని మండలం లోని 24 గ్రామాలలో ఉచితం గా కంటి పరీక్ష క్యాంపు నిర్వ హించాలనే సంకల్పంతో కన్నా కొడుకులు కూతుర్లు తల్లితం డ్రులను పట్టించుకోలేని స్థితిలో తీన్మార్ మల్లన్న టీం ముందుం డి వారికి ఇంటి పెద్ద బిడ్డ లాగా వారికి సహాయం చేస్తున్నారని ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని తీన్మార్ మల్లన్న టీం మండలాధ్యక్షులు తీన్మార్ జయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పెద్ద ఎత్తున వృద్ధులు గ్రామ పెద్దలు తీన్మార్ జయ్ పెద్దిరెడ్డి వేముల రమేష్ శానం కుమార్ స్వామి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

ఒదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ఎమ్మార్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు Diet కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం యం ఈ ఓ వై.రమేష్ ఆధ్వర్యం లో జరిగింది.
ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు అఖిల మరియు అమూల్య ల చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది. ఇందులో భాగంగా U-Dise లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్, ఫర్నిచర్,క్రీడ స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, Kitchen Garden, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది.ఈ వివరాలను సేకరించడం లో డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులను, మరియు సీ ఆర్ పి లను యం ఈ ఓ సమన్వయ పరిచారు. సమావేశంలో శిక్షణ ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో complex ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య ,యం లక్ష్మీనారాయణ కేజీవీబీ ఓదెల ఎస్ఓకే జ్యోతి, యుపిఎస్ హరిపురం మహేందర్ రెడ్డి, రమేష్, సిపిఎస్ ఓదెల నాగరాజు, ఎంఆర్సి కార్యాలయ సిబ్బంది ఎం ఐ ఎస్ డి వెంకటేష్, సి సి ఓ ఎల్ కుమార్, సి అర్ పి టి ఓంకార్ బి రజిత ఈ రాజేందర్ టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి.!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో జరగబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సభను రజక సంఘo కుల బంధువులు, రజక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఈరోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్, ముస్తబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ బిసినెస్ సెల్ కన్వీనర్ నమిలి నరసింములు,యూత్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజు యకయ్య,బీఆర్ఎస్ నాయకులు మచ్చ రవీందర్,పిల్లల తిరుపతి, ఒరుగంటి రమేష్ రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి
అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని అందులో పత్తి,వరి పంటలు సాగు చేయగా అందులో పంట దిగుబడి రాకపోవడం వలన 3 లక్షల వరకు అప్పులు కాగా
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు,కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక వారు పరామర్శించి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా వారు స్పందించి ఆ సంస్థ ద్వారా 40,000 నలభై వేయిల రూపాయల ఆర్థిక సహాయంతో మేకలు కొని ఇవ్వడం జరిగింది.

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 194, జి ఓ ల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు,
6,00,000,రూలు, నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నూరి సదానందం రాచపల్లి సమ్మయ్య ఇంజన్ చైతన్యలు పాలుగోన్నారు.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల అన్న స్వామి అన్న పసుల సాంబయ్య సోమవారం రోజున అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ పరామర్శలో సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ పసుల రమేష్,ఏకు రాజు,నాయకులు కొయ్యడ చందర్,రవి తదితరులు పాల్గొన్నారు.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం కొండాపూర్ వెంకటేశ్వర్ పల్లె గ్రామాలలోభూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు అధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తల ను సమాయత్తం చేస్తూ రోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణపురం మండల పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి

ఆర్థిక సహాయం అందించిన.!

ఆర్థిక సహాయం అందించిన ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్

నేటి ధాత్రి

 

ఇటీవల మరణించిన సంస్కృతం అధ్యాపకులు రవీందర్ కుటుంబానికి తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది .తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎం సతీష్ కుమార్, జె ఎస్ డబ్ల్యూ టీవీ సీనియర్ ఇంగ్లీష్ అధ్యాపకులు చిలువేరు శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్యాల యుగంధర్, చిర్ర వెంకట్, ఆర్ తిరుపతి ల ఆధ్వర్యంలో అధ్యాపకుల సహకారంతోహనంకొండ లో వారి నివాసానికి వెళ్లి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి భార్యకు పిల్లలకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో పనిచేస్తూ ఇటీవల మరణించిన రవీందర్
మృతుని కుటుంబానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అన్ని విధాల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది. అదేవిధంగావారి పిల్లలకు చదువులకు వారి అవసరాలకు అయ్యే ఖర్చును ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన.!

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్;

గణపురం నేటి ధాత్రి;

 

 

 

 

 

 

ఈగణపురం మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో (వెళ్తుర్లపల్లి క్రాస్ నుండి సీతారాంపూర్) బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల వలన మోరంచ వాగు ప్రవహించి అటు వెళ్ళు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది. గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.

construction works

ఈ సమస్యను పరిష్కారం కోసం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జికి సుమారు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు,అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే పలు గ్రామాలకు రాకపోకలకు రవాణా సౌకర్యాలు సులభతరం అవుతుందన్నారు.  కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ .డబ్ల్యూ. ఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల ప్రజలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి

మహిళా ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి

పరకాల నేటిధాత్రి

 

 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పరకాల పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ నిధులు,నీరు,నియామకాల్లో అనే నినాదలతో 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం బీఆర్ఆఎస్ పుట్టిందని అన్నారు.పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని గుర్తుచేశారు.పరకాల పట్టణం నుండి సభకు నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో చితికిపోయిన వ్యవసాయ రంగం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో చితికిపోయిన వ్యవసాయ రంగం.

కరెంటు లేక ఎండుతున్న పంటలు..

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు..

నర్సంపేట, నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా చితికిపోయింది, రైతులు మానసిక ఒత్తిడికి గురైతున్నారు.రైతులకు ఆర్దికంగా చేయూతలేదు.పంటల నష్టం జరిగితే ఏ నాయకుడు రైతులకు మొఖం చూపెట్టలేని పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ 25 యేండ్ల రజితోత్సవ సభ ఏర్పాట్లు,సభ సక్సెస్ పట్ల నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ 2 వ పంటకు సరిపడా నీళ్లు ఇవ్వక అవి చేతికిరాకముందే పశువులను మేపే పరిస్థితి,అలాగే కరెంట్ సరిపడా ఇవ్వకపోవడంతో కరెంట్ మోటార్ల తోనే రైతులు జీవిస్తూన్నారని పేర్కొన్నారు.వ్యవసాయం అంటేనే కేసీఆర్ అని వ్యవసాయాన్ని పండుగగా చేసి చూపించిన ఘనత ఆయనకే దక్కిందని వివరించారు.ఏరికోరి కొని తెచ్చుకుంటే రైతులను నట్టేట ముంచుతున్నదని ఆరోపించారు. అకాల వర్షలతో రైతులు

Congress



పంటలు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు ఉండదా అని పేర్కొన్నారు. రజితోత్సవ సభ బాధ్యతలో ఉన్నానని చెప్పారు.
నర్సంపేట నియోజకవర్గం నుండి కదిలే పార్టీ శ్రేణులు,ప్రజలు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇస్తాంన్ పార్కింగ్ స్థలాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు చేపడుతున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ఈ. కలెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, డీసీఎం, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలతో సుమారుగా 26 వేలకు పైగా నియోజకవర్గ ప్రజలను తరలిస్తామని ప్రత్యేకంగా పదిలక్షల మజ్జిగ ప్యాకెట్లు, పదిలక్షల వాటర్ బాటిల్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గోగులోత్ రామస్వామి నాయక్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ , బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ జడ్పిటిసి బాలు, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, మండల శ్రీనివాస్,బండి ప్రవీణ్, శివరాత్రి స్వామి, పట్టణ యువజన విభాగం ప్రథాన కార్యదర్శి నాయిని వేణుచంద్,ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్,బీరం అనంతరెడ్డి,నల్ల రవీందర్ తదితరుల పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు…

విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ల ప్రధానోత్సవం…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.

Education

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.

500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజికవర్గంలో కురిసిన అకాల వర్షంతో పంటలు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి.

సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి.

భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలoలో గల రైతు వేదిక భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని అన్నారు.

protecting the rights of the common man.

భూ భారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ పది సంవత్సరాలు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన లక్షలాది మంది విజ్ఞప్తుల మేర కు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ధరణి పోర్టర్ ను తొలగించి భూభార తి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

protecting the rights of the common man.

మార్పులుచేర్పులకు గతంలో అవకాశం లేదని ప్రస్తుత చట్టంలో రెవెన్యూ అధికారులకు అన్ని అనుమతులు ఇవ్వడం వల్ల రైతులకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. చట్టంలో తీసుకు వచ్చిన మార్పులను స్థాయిలో రైతులకు వివరించి రైతులను చైతన్యం చేయాలని కోరారు అధికారులు తప్పు చేస్తే సహించేది లేదన్నారు.

protecting the rights of the common man.

భూ సమస్యలపట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల ఎమ్మా ర్వో సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర, ఆర్ ఐ, వ్యవసా య అధికారులు, చిoదం రవి, మార్కండేయ, బాసని శాంత- రవి , బాసని చంద్రప్రకాష్, మారపేల్లి రవీందర్, కట్టయ్య రాజేందర్, దుబాసి కృష్ణ మూర్తి, వలి ఐదర్, చింతల రవిపాల్, వైనాల కుమార స్వామి, అబ్బు ప్రకాష్ రెడ్డి, తిరుపతి, రాజిరెడ్డి, మోత్కూరి భాస్కర్, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమా నులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికా రులు పాల్గొన్నారు.

అకాల వర్షం కు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన.!

అకాల వర్షం కు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎంపీ ధర్మపురి

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వర్షాలకి నష్టపోయిన పంటలను పరిశీలించిన నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంట నష్టం పై సత్వరమే సర్వే నిర్వహించి, నష్టపోయిన పంటకి ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపాలి అని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే పంటకు జరిగిన నష్టం పరిహారం అందెదని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాని అమలు చేయకుండా ఇప్పుడు రైతులకు నష్టం జరిగిదని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, సుకెందర్ గౌడ్ జిల్లా నాయకులు వాడేపల్లి శ్రీనివాసన్,వెంకట్ రెడ్డి,సదశివ్,రుద్ర శ్రీనివాస్,సుదవేణి మహేష్, తుకారాం గౌడ్, తిరుమల వాసు,శ్రీనివాస్,నవీన్,శ్రీధర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, మండల నాయకులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్, తిరుమల చారి,రాజారెడ్డి, మహేష్, సురేష్,వెంకట స్వామి, గణేష్, కౌడా రమేష్,ఆనంతు, రవి, అభి,మల్లేష్, రాజేందర్, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి……

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27.వ .తారీఖున వరంగల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రజదోత్సవ సభ సమావేశంలో మండల కేంద్రం నుంచి కనీసం 300 నుంచి పైనే కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జాతిపిత కెసిఆర్ ప్రవేశపెట్టిన సభకు పెద్ద ఎత్తున మండలం నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు మండల అధ్యక్షుడు రాజన్న పట్టణ శాఖ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సభకు వచ్చే వారి జాబితాను సిద్ధం చేస్తూ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎగుడు మామిడి వెంకట రమణారెడ్డి పడిగల రాజు తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ రవి అనిత వెంగళ రమేష్ కందుకూరి రామ గౌడ్ మహిళా మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి మహిళా నాయకురాలు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version