అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి
అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని అందులో పత్తి,వరి పంటలు సాగు చేయగా అందులో పంట దిగుబడి రాకపోవడం వలన 3 లక్షల వరకు అప్పులు కాగా
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు,కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక వారు పరామర్శించి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా వారు స్పందించి ఆ సంస్థ ద్వారా 40,000 నలభై వేయిల రూపాయల ఆర్థిక సహాయంతో మేకలు కొని ఇవ్వడం జరిగింది.

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 194, జి ఓ ల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు,
6,00,000,రూలు, నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నూరి సదానందం రాచపల్లి సమ్మయ్య ఇంజన్ చైతన్యలు పాలుగోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version