ఉచిత కంటి వైద్య శిబిరం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పంచా యితీ కార్యాలయంలో ఉద యం కంటి పరీక్ష క్యాంపు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వ రంలో లయన్ విజన్స్ క్లబ్ సహకారంతో నాలుగో విడతలో భాగంగా నిర్వహించ డం జరిగింది దాదాపుగా గ్రామ వృద్ధులు 80 మందికి ఉచి తంగా కంటి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయించు కోవడం జరిగింది అందులో ఒక 35 మందిని కంటి ఆపరేషన్ ఎన్నుకోవడం జరిగింది వారికి ఉచితంగా బస్సు భోజనము పడక కల్పిస్తూ హైదరాబాదు లోని పుష్పగిరి ఆసుపత్రికి తీసుకుపోయి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని మండలం లోని 24 గ్రామాలలో ఉచితం గా కంటి పరీక్ష క్యాంపు నిర్వ హించాలనే సంకల్పంతో కన్నా కొడుకులు కూతుర్లు తల్లితం డ్రులను పట్టించుకోలేని స్థితిలో తీన్మార్ మల్లన్న టీం ముందుం డి వారికి ఇంటి పెద్ద బిడ్డ లాగా వారికి సహాయం చేస్తున్నారని ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని తీన్మార్ మల్లన్న టీం మండలాధ్యక్షులు తీన్మార్ జయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పెద్ద ఎత్తున వృద్ధులు గ్రామ పెద్దలు తీన్మార్ జయ్ పెద్దిరెడ్డి వేముల రమేష్ శానం కుమార్ స్వామి సుమన్ తదితరులు పాల్గొన్నారు.