కాంగ్రెస్ ప్రభుత్వంలో చితికిపోయిన వ్యవసాయ రంగం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో చితికిపోయిన వ్యవసాయ రంగం.

కరెంటు లేక ఎండుతున్న పంటలు..

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు..

నర్సంపేట, నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా చితికిపోయింది, రైతులు మానసిక ఒత్తిడికి గురైతున్నారు.రైతులకు ఆర్దికంగా చేయూతలేదు.పంటల నష్టం జరిగితే ఏ నాయకుడు రైతులకు మొఖం చూపెట్టలేని పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ 25 యేండ్ల రజితోత్సవ సభ ఏర్పాట్లు,సభ సక్సెస్ పట్ల నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ 2 వ పంటకు సరిపడా నీళ్లు ఇవ్వక అవి చేతికిరాకముందే పశువులను మేపే పరిస్థితి,అలాగే కరెంట్ సరిపడా ఇవ్వకపోవడంతో కరెంట్ మోటార్ల తోనే రైతులు జీవిస్తూన్నారని పేర్కొన్నారు.వ్యవసాయం అంటేనే కేసీఆర్ అని వ్యవసాయాన్ని పండుగగా చేసి చూపించిన ఘనత ఆయనకే దక్కిందని వివరించారు.ఏరికోరి కొని తెచ్చుకుంటే రైతులను నట్టేట ముంచుతున్నదని ఆరోపించారు. అకాల వర్షలతో రైతులు

Congress



పంటలు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు ఉండదా అని పేర్కొన్నారు. రజితోత్సవ సభ బాధ్యతలో ఉన్నానని చెప్పారు.
నర్సంపేట నియోజకవర్గం నుండి కదిలే పార్టీ శ్రేణులు,ప్రజలు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇస్తాంన్ పార్కింగ్ స్థలాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు చేపడుతున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ఈ. కలెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, డీసీఎం, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలతో సుమారుగా 26 వేలకు పైగా నియోజకవర్గ ప్రజలను తరలిస్తామని ప్రత్యేకంగా పదిలక్షల మజ్జిగ ప్యాకెట్లు, పదిలక్షల వాటర్ బాటిల్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గోగులోత్ రామస్వామి నాయక్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ , బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ జడ్పిటిసి బాలు, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, మండల శ్రీనివాస్,బండి ప్రవీణ్, శివరాత్రి స్వామి, పట్టణ యువజన విభాగం ప్రథాన కార్యదర్శి నాయిని వేణుచంద్,ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్,బీరం అనంతరెడ్డి,నల్ల రవీందర్ తదితరుల పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version