గనిలో సైడ్ వాల్ కూలి సింగరేణి కార్మికుడు మృతి…

గనిలో సైడ్ వాల్ కూలి సింగరేణి కార్మికుడు మృతి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T122804.692.wav?_=1

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి సింగరేణి కేకే 5 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది గనిలో సైడ్ కోల్ కూలి ఎస్డిఎల్ ఆపరేటర్ శ్రావణ్ కుమార్ (32) ప్రమాదవశాత్తు మృతి చెందారు రాత్రి రెండో షిఫ్ట్ లో పనిచేస్తుండగా ఎస్ డి ఎల్ మిషన్ మోరాయించగా శ్రావణ్ కుమార్ మిషన్ ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పక్కనుండి నుండి సైడ్ వాల్ కూలగా మిషన్ సైడ్ కోల్ మధ్యలో ఇరుక్కుపోయాడు అది గమనించిన తోటి కార్మికులు శ్రావణ్ కుమార్ ను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మాధ్యమధ్యంలోని మృతి చెందాడు.
అధికారుల ఒత్తిడితోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి..

స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి

* అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చి చెల్ల మృతి

మహాదేవపూర్ జులై 30 (నేటి ధాత్రి)

 


జయశంకర్ భూపాలపెల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు పాప శ్రీహర్షిని బస్ కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం రోజున చోటుచేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఎస్ ఎస్ వి స్కూలు బస్సు అంబటిపల్లి గ్రామానికి వచ్చి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా అంబటిపల్లి గ్రామానికి చెందిన సింగనేని మల్లేష్, భాగ్య దంపతుల మూడేళ్ల కూతురు శ్రీ హర్షిని(3) తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కళ్ళముందే పాప మృతి చెందిందని బస్సు డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మదనపల్లెలో ఏపీఎస్పీ 8త్ బేటాలియన్ చిత్తూరు సీఐ మృతి..

మదనపల్లెలో ఏపీఎస్పీ 8త్ బేటాలియన్ చిత్తూరు సీఐ మృతి..

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 26:

మదనపల్లెలో ఏపీఎస్పీ 8త్ బెటాలియన్ చిత్తూరు సిఐ మృతి చెందారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రెడ్డీస్ కాలనీకి చెందిన కృష్ణా నాయక్(59) చిత్తూరు ఏపీఎస్పి 8త్ బేటాలియన్ సీఐ గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సెలవులో మదనపల్లెకు వచ్చాడు. శనివారం ఉదయం బాత్రూంలో కుప్పకూలీ ఉండగా గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా అస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మార్గమధ్యంలోనే సీఐ మృతి చెందాడని చెప్పారు..

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

చిట్యాల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన సరోజన

వైద్యులపై చట్టపురమైన చర్య తీసుకోవాలని

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ కార్యదర్శి మారపల్లి మల్లేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-54.wav?_=2

భూపాలపల్లి నేటిధాత్రి

సరోజన అనే మహిళ చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లోబీవీ తో రావడం జరిగింది వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చినటువంటి ఈ పి టి 12 గంటల సుమారులో ఆక్సిజన్ పెట్టినాడు ఆక్సిజన్ పెట్టిన వెంటనే డమెల్ మనీ పేలింది…..

CPI ML Liberation Secretary Marapalli Mallesh

ఈపీటి వెంటనే తొందరగా బయటికి వచ్చినాడు ఏం జరిగిందని చెప్పేసి పేషెంట్లు అంత నిద్ర లేచారు అప్పటికి సరోజన అరుస్తూనే ఉంది అమ్మా అయ్యాను పేషెంట్ వచ్చి అరగంట ఆయన అప్పటివరకు డాక్టర్ గాని సిస్టర్స్ గాని సెక్యూరిటీ సిబ్బంది గానీ వార్డు భాయ్ వచ్చిన పరిస్థితి కానరాలేదు క్షణమైతే చనిపోతుంది అప్పుడు అందరు వచ్చినారు వచ్చేసరికి ఆమె చనిపోయింది అప్పుడు వచ్చి ఆక్సిజన్ కొడితే అప్పటికే ఆమె చనిపోయింది నేను చేసే ప్రయత్నం చేశాను అంటున్న డ్యూటీ డాక్టర్ వాస్తవంగా రాత్రి 12 కాకముందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు వార్డు బాయ్ లేసింది లేదు సెక్యూరిటీని లేపింది లేదు సెక్యూరిటీ సిస్టర్ ను లేపింది లేదు సిస్టర్ డాక్టర్ను లేపింది లేదు ఈ సమయంలో అర్ధగంట గడిచిపోయింది ప్రాణాలు కాపాడతారని వస్తే నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోయినవి తక్షణమే ఇన్చార్జి సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యం వహించిన వీళ్ళందరూ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ పేషెంట్ వచ్చిన వంద పడకలకు పో గాంధీ హాస్పిటల్ వరంగల్ పో అని రెఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన రోగాన్ని అక్కడికి పొమ్మని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు వచ్చిన తర్వాత సిస్టర్ గ్లూకోజ్ పెడతా ఉంది డాక్టర్ మాత్రం గంట తర్వాత వచ్చి కూడా చూడలేని పరిస్థితి అమ్మ ఎప్పుడు వస్తాడు అని అడిగితే తాత వస్తాడని అంటున్నారు నిర్లక్ష్య సమాధానం ఉద్యోగం మీద బాధ్యత లేకపోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే హాస్పిటల్ దివాలా తీస్తోంది గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చిట్యాల ఈరోజు దివాలా తీయడానికి కారణం పాలకులే నిర్లక్ష్యం మూలంగా నిండుపానం బలైపోయింది 9 గంటల వరకు డ్యూటీ లో ఉన్నారు తొమ్మిదిన్నరకే అందరు పడుకున్నారు వాస్తవానికి నైట్ డ్యూటీ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా డ్యూటీ చేస్తున్నారు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే తప్ప బాధ్యతతో పనిచేసిన దాఖలు లేవు తక్షణమే హాస్పిటల్ పైదృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని పోలీసులకు డిమాండ్ చేస్తున్నాం

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.

కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి.

కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి…

కాంటా లగా సాంగ్‌ ఫేమ్‌ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్‌ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా..

‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్‌ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. ఆమె మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని.. ఈ కేసును అనుమానాస్పదంగానే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, 2002లో వచ్చిన ‘కాంటా లగా’ అనే రీమిక్స్‌ పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు షఫాలీ. ఆ తర్వాత ‘ముజ్సే షాదీ కరోగీ’, ‘హుడుగరు’ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ‘నాచ్‌ బలియే’, ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’ వంటి టీవి రియాలిటీ షోల్లో భాగమయ్యారు.

బాలీవుడ్ లో విషాదం..నటి హఠాన్మరణం.

బాలీవుడ్ లో విషాదం..  నటి హఠాన్మరణం 

 

 

 

 

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా కన్నుమూశారు.  శుక్రవారం (27న ) రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (Actress Shefali Jariwala 42) కన్నుమూశారు.  శుక్రవారం (27న ) రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. నాటి ‘కాంటా లగా’ (Kaanta Laga Song) పాటతో ఆమె (Shefali Jariwala) దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మీడియా కథనాల ప్రకారం, అనారోగ్యానికి గురైన షెఫాలీని ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. అయితే, ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

2002లో ‘కాంటా లగా’ పాటలో నటించిన షెఫాలీ రాత్రి రాత్రికి పాప్ కల్చర్ సెన్సేషన్‌గా మారిపోయారు. ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన 2004 నాటి ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమాలో కూడా నటించారు. బిగ్ బాస్ 13 సీజన్‌లో కూడా పాల్గొన్నారు. తన కాన్ఫిడెన్స్, క్లారిటీతో జనాలను ఆకట్టుకుని మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. 2015లో ఆమె యాక్టర్ పరాగ్ త్యాగి ని పెళ్లి చేసుకున్నారు. ‘నచ్ బలియే’ డ్యాన్స్ రియాలిటీ షో 5, 7 సీజన్‌లలో భర్తతో కలిసి పాల్గొన్నారు. చిన్న వయసులో ఆమె కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

కరెంటు షాక్ తో గేదె మృతి.

కరెంటు షాక్ తో గేదె మృతి
జమ్మికుంట నేటిధాత్రి:

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధర్మారం రెండవ వార్డులో శ్రీమతి మారపెల్లి పద్మ గారి పాడి గేద ప్రమాదవశాత్తు కరెంట్ పోలుకు కరెంటు సర్క్యూట్ కావడంతో గేద అక్కడికక్కడే మరణించడం జరిగినది సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది
మారపల్లి పద్మ ధర్మారం

మద్యం మత్తులో వ్యక్తి మృతి

మద్యం మత్తులో వ్యక్తి మృతి

నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ ప్రాంతంలో ఒక వ్యక్తి మధ్యమధ్య మృతి చెందాడు ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన బద్య 38 సంవత్సరాలు, గల వ్యక్తి మద్యానికి బానిసై ఇల్లు వదిలి నెక్కొండ పట్టణ కేంద్రంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి ఐస్క్రీం ప్రాంతంలో రోడ్డు పక్కన పడి చనిపోయినట్టు మృతుడి భార్య వంకుడోత్ శాంతి ఫిర్యాదు చేసినట్టు ఎస్సై మహేందర్ తెలిపారు.

వాగులో పడి మహిళ మృతి.

వాగులో పడి మహిళ మృతి

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

 

దుందుభి వాగులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో శనివారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన శంకరమ్మ (47) గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వెతికిన ఆచూకీ లభించలేదు. శనివారం బాలానగర్ మండలంలోని పెద్దాయ పల్లి గ్రామ శివారులో ఉన్న దుందుభి వాగులో శంకరమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకరమ్మ మృతిపై ఎవరిపై అనుమానం లేదని.. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం
కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ గత అయిదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పులాల కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు, కుమార్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కుమార్ చనిపోవటం చాలా బాధాకరం అని తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, BRS నాయకులు బోగం వెంకటేష్ మరియు నాయకులు ఉన్నారు

గుండెపోటుతో యువకుడు మృతి.

గుండెపోటుతో యువకుడు మృతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

#విద్యుత్ మోటర్ ను సరి చేస్తుండగా ప్రమాదం.

#ఎదిగిన కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనకు అవధులు లేకుండా పోయింది.

#యువకుని మృతితో గ్రామములో విషాదఛాయలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్కు వైర్లను తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లె గ్రామంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాందాటి శ్రీనివాస్ రెడ్డి-మంజుల దంపతుల రెండవ కుమారుడు లక్ష్మణ్ రెడ్డి (19) తమ వ్యవసాయ భావి వద్దకు వెళ్లి నీళ్లు రావడంలేదని మోటారు వైర్లను సరి చేస్తున్న క్రమంలో కరెంటు రాకపోవడంతో 11 కెవి విద్యుత్తు లైనుకు వైర్లను తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక వైరు కాలికి తగలడంతో పడిపోగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం నర్సంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు మృతుని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

#యువకుని మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు.
పట్టుమని 19 సంవత్సరాలు నిండకముందే నూరేళ్ల జీవితం గడిచిపోయిందని మృతుని తల్లిదండ్రులు రోదన చేస్తుంటే గ్రామస్తులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా చదువులో సైతం ప్రతిభను కనబరిచి ఎంతో అత్యున్నత స్థానంలో ఉండాలని కోరికతో ఉండేవాడని అదేవిధంగా తల్లిదండ్రులకు తన వంతుగా వ్యవసాయ పనులలో చేదోడు వాదోడుగా ఉండి కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషించేవాడని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ బోరుణ ఏడ్చారు. ఏది ఏమైనాప్పటికీ చేతికి అందిన కొడుకు చేజారిపోవడంతో కన్న తల్లిదండ్రుల రోదన అంతా ఇంత కాదు.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి..

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన కథనంప్రకారం, తనకి చెందిన సుమారు రూ.30 వేల విలువగల గేదె రోజువారి రీత్యా మేతకి వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో గేదె ఇంటికి రాలేదని చుట్టుపక్కల ఉన్నటువంటి చేనులలో తిరగడంతో గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందిందని తెలిపారు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపై పెట్టకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై గేదె మృతి చెందిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని బాధితుడు వేడుకుంటున్నారు.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

 

మండలంలో విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షంలో రైతు మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన పడిదల బాపురావు ఇంటినుండి దగ్గరలోని విద్యుత్ పోల్ నుండి సర్వీస్ వైర్ ఈదురు గాలులకు మధ్యలో తెగి జెర్సీ అవుమీదపడి విద్యుత్ ప్రసరణ జరగడంతో.రైతు పడిదల బాపురావు కు చెందిన 60 వేల విలువగల జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ షాక్ గురై ఆవు చనిపోయిన. రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

చెరువులో పడి వ్యక్తి మృతి .

చెరువులో పడి వ్యక్తి మృతి

బాలానగర్ /నేటి ధాత్రి :

 

 

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (42), చిట్టెమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం.. కుమారుడు కార్తీక్ ను ఇంటికి పంపించి వెంకటయ్య గ్రామంలోని మైసమ్మ చెరువులో పడి మృతి చెందాడు. శనివారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన రాజా గౌడ్.!

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన

ముదిగుంట మాజీ సర్పంచ్ రాజా గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొగిలి పాక రాజా గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా మంచిర్యాలలో నివాసం ఉంటూ పని నిమిత్తం ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తున్న సమయంలో మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి ఢీకొనగా మొగిలి పాక రాజా గౌడ్ తలకి త్రీవ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ తరలించగా అక్కడి వైద్యులు వెంటనే గుర్తించి తలకు శాస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. వెంటనే వైద్యుల సూచనలు మేరకు శాస్త్ర చికిత్స చేపించినప్పటికీ కూడా 20 రోజులుగా చికిత్స పోదుతూ శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సర్పంచి పదవి కాలంలో గ్రామానికి చేసిన సేవలను గ్రామస్తులు స్మరించుకుంటూ కన్నీటి పర్వతం అయ్యారు.

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్ లో చదివించాలని భార్య పట్టుబట్టింది. భర్త రవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ లో ఉంటూ చదివించుకుంటున్నది. రవి వరంగల్ కు వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ మన స్థాపానికి గురిచెందాడు.ఈ నెల 4 న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన గ్రామస్తుల కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందగా తల్లి కొమరమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి
అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని అందులో పత్తి,వరి పంటలు సాగు చేయగా అందులో పంట దిగుబడి రాకపోవడం వలన 3 లక్షల వరకు అప్పులు కాగా
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు,కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక వారు పరామర్శించి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా వారు స్పందించి ఆ సంస్థ ద్వారా 40,000 నలభై వేయిల రూపాయల ఆర్థిక సహాయంతో మేకలు కొని ఇవ్వడం జరిగింది.

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 194, జి ఓ ల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు,
6,00,000,రూలు, నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నూరి సదానందం రాచపల్లి సమ్మయ్య ఇంజన్ చైతన్యలు పాలుగోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version