ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు.!

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే వ్యవసాయం సాగిస్తున్నారు దీనితో వర్షాలు సకాలంలో రాకపోవడం వలన పంటలు ఎండిపోయి కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు.
వర్షాధారంపై పోడు వ్యవసాయం చేస్తూ నిరుపేద ఆదివాసి రైతులను ప్రభుత్వమే ఆ యొక్క రైతులకు వ్యవసాయ బోర్లు కరెంట్ లైన్ లేదా బోర్లు మోటార్లతోపాటు సోలార్లు మంజూరు చేసి ఈ యొక్క నిరుపేద ఆదివాసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి కరెంటు తెచ్చుకోలేని సన్న కారు చిన్న కారు ఆదివాసి రైతులకు సోలార్ విద్యుత్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వర్షాలు తక్కువ ఉన్నా కానీ బోరు మోటర్ సోలార్ ఉండటంతో దళారుల ఊబి నుండి బయటపడడమే కాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చుకోకుండా అప్పుల ఊబి నుండి వారిని వారు కాపాడుకోవడం కాకుండా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారంగా మారుతుందని వారు సూచించారు. అంతేకాకుండా పోడు వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు హక్కు పత్రాలు అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అంతేకాకుండా హక్కు పత్రాలు వచ్చినకాని కొన్ని గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు ఇవ్వకపోవడం వలన చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి నిరుపేద ఆదివాసి రైతులకు తక్షణమే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అంతేకాకుండా ముద్రించిన అడవి హక్కు పత్రాలు ఆఫీసు బీరువాల్లో ఉంచుకుంటున్నారే తప్ప ఆ యొక్క రైతులకు చేరవేయడం లేదు ఇదిలా ఉంటే కొంతమంది దళారులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర రైతులకు కూడా అటవీ హక్కు పత్రాలను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిశీలించి రద్దు విధంగా చర్యలు తీసుకోవాలని ఇక నిరుపేద ఆదివాసి రైతులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసి రైతులకు ఇవ్వడంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపంతో పూర్తిగా విఫలమైనారని వారు ఆరోపించారు ఇలాంటి తప్పిదాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఆ యొక్క అటవి హక్కు పత్రాలను ఆ రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినారు. ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ బోర్లులను 6 సంవత్సరాల వ్యవధి కాకుండా 1 సంవత్సరం లోపే సోలార్ బోర్డులను ఆదివాసి రైతులకు అందే విధంగా చూడాలని వారు అన్నారు అదేవిదంగా ఈ నెల 25న ఎన్నుకోబోయే నూతన మండల కమిటీకి మండలములోని ఆదివాసీ యువకులు హాజరుకగలరని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ ,జిల్లా కోశాధికారి పూనెం జనార్దన్ మండల నాయకులు చుంచ అనిల్, చింత శ్రీకాంత్, పులుసం హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version