ఘనంగా సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భావ దినోత్సవం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు రష్యా విప్లవోద్యమ నేత కామ్రేడ్ లెనిన్ జయంతిని, సిపిఐ (ఎం-ఎల్) 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుండాల మండలంలోగుండాల, కాచనపల్లి, చెట్టుపల్లి, కొడవటంచ,చీమల గూడెం, నర్సాపురం తండ, కన్నాయిగూడెం, లక్ష్మీపురం,రోళ్లగడ్డ, ముత్తాపురం, గలభ, తూరుబాక, తూరుబాక ఎస్సీ కాలనీ తదితర గ్రామాలలో ఘనంగా లెనిన్ జయంతి, సిపిఐ (ఎంఎల్ )ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, జిల్లా నాయకులు కొమరం సీతారాములు, మండల కార్యదర్శి అరెం నరేష్ మాట్లాడుతూ 1968 లో సిపిఎం రీజనిస్ట్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ 1969 ఏప్రిల్ 22న పీడిత ప్రజల ఆశాజ్యోతి సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భవించి దున్నేవానికే భూమి కావాలని నినాదంతో గోదావరి లోయ పరివాహక ప్రాంతాలలో గిరిజనులను, గిరిజనేతర పేద ప్రజలను సమీకరించి లక్షలాది ఎకరాల పోడు భూములను కొట్టించి వాటి పట్టాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి పట్టాలు సాధించిందని అన్నారు.
ఈ క్రమంలో అతివాద ,మితవాద ధోరణులకు గురై అనేక చీలికలకు గురైనప్పటికీ ఇప్పటికీ సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ పేద ప్రజల తలలో నాలుకల పనిచేస్తుందని అన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విపలమయ్యాయని అన్నారు.
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, పర్శక రవి, గడ్డం లాలయ్య,ఈసం కృష్ణన్న, పూణెం నరసన్న, మోకాళ్ళ సూర్యనారాయణ, భానోతు లాలు, మానాల ఉపేందర్, వాగబోయిన సుందర్రావు, పూణేం పొట్టయ్య, తాటి రమేష్, మోకాళ్ళ పోతయ్య, కల్తీ ప్రభాకర్, గడ్డం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version