మంచిర్యాల గాంధీ పార్కులో జరిగే బిసి నిరసన దీక్షను విజయవంతం చేయాలి
మంచిర్యాల,నేటి ధాత్రి:
బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ పార్కు స్టేషన్ రోడ్డు మంచిర్యాల నందు ఉదయం10 గంటలకు జరిగే నిరసన దీక్షలో బీసీ ప్రజా సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు విద్యార్థి మేధావులు పాల్గొనాలని కోరుకుంటున్నాం.దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో సమగ్ర కులగణన జరిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ,స్థానిక సంస్థల్లో 42%కి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించాలి.ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఉద్యమకారుడు,బత్తుల సిద్దేశ్వర్ ఢిల్లీ కేంద్రంగా అమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.ఈ దీక్ష ఏడవ రోజుకు చేరడం జరిగింది.కావున అమరణ దీక్షకు మద్దతుగా రేపు మంచిర్యాల జిల్లాలో నిరసన దీక్షలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాల నాయకులు,కుల సంఘాల నాయకులు మరియు ప్రతి బీసీ బిడ్డ పాల్గొనలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మనోహర్, గుమ్ముల శ్రీనివాస్, మహేష్ వర్మ ,పిట్టల రవీందర్ ఎండి లతీఫ్,ఎల్తాపు రాజశేఖర్,దాస్యపు దీపక్ తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.
కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్ధిక అభివృద్దే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 11 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు సంబంధించిన చెక్కును అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు.
అదే విధంగా వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన 6 బస్సులకు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30 లక్షల రూపాయలు సబ్సిడీ చెక్కు అందించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MLA
చెన్నరావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి మరియు ఖానాపురం భారతీయ మహిళ రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.30 లక్షల( ఒక్కొకంటి15 లక్షల చొప్పున)చెక్కులను సంఘాల బాధ్యులకు అందిజేసినట్లు పేర్కొన్నారు.2004 లో పావలా వడ్డీ రుణాలు మహిళకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీర హామీల్లో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందని .ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గుర్తుకు చేశారు.ఈకార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి,ఆర్డీవో ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంలో దయాకర్, సరిత, అనిత, అన్ని మండలాల మహిళ సమాఖ్య అధ్యక్షులు,ఏపీఎంలు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే నిరంతర కృషి.
సభ్యత్వ నమోదు కార్యక్రమం
శాయంపేట నేటిధాత్రి:
జాతీయస్థాయిలో జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా టియు డబ్ల్యూజే (ఐజేయు) పనిచే స్తుందని ఆ సంఘ జిల్లా నాయకుడు రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు మధు, సుధాకర్ అన్నారు. పరకాల కేంద్రంలో నిర్వహించిన సభ్యత కార్యక్ర మంలో పలు మండ లాల్లో ఉన్న జర్నలిస్టులు హాజర య్యారు. ఈ సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
TUWJ.
మాట్లాడుతూ జిల్లా,మండలంలోగాని జర్నలిస్టుల సమస్యల కోసం వారి హక్కుల కోసం నిరంతర పోరాటాలను నిర్వహిస్తూ విధానాలు సాధిస్తున్న సంఘం టీయూడబ్ల్యూజే సంఘం మాత్రమే అన్నారు ఆ సంఘం ద్వారా అనేక విజయాలు సాధించామని గుర్తు చేశారు ముఖ్యంగా జర్నలిస్టు ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలను నిర్వహించి అందులో విజయం సాధించామని తెలియజేశారు ఆర్టీసీ బస్సులో జర్నలిస్టులకు సౌకర్యం కల్పించి ఘనత, జర్నలిస్ట్ హెల్త్ విషయంలో కార్పొరేట్ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తున్న సంఘం టి యు డబ్ల్యూ జే (ఐజేయు) అన్నారు. మండలంలో ఉన్న జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు
ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శాయంపేట, దామెర, నడి కూడ,పరకాల మండలాల్లో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు టియుడబ్ల్యూ జే (ఐజేయు) నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.
కల్వకుర్తి /నేటి దాత్రి :
రైస్ మిల్లు అసోసియేషన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన బీచని బాలకృష్ణ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం సోమవారం చేయడం జరిగినది. కార్యదర్శిగా పోల విజయకుమార్ కోశాధికారిగా యనుమగండ్ల రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైస్మిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబాలకృష్ణమాట్లాడుతూ డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ ఆంజనేయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవాలయం ప్రాంగణంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు.దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల సందర్భంగా గ్రామంలోని పలువురి ఇండ్ల నుండి హైందవ ధర్మం, సాంప్రదాయ పద్ధతిలో సీతమ్మ రాములోరు, లక్ష్మణుడు, ఆంజనేయుని పంచలోహ విగ్రహాలను డప్పు చప్పుళ్ళు,మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుతో దేవాలయానికి తీసుకొచ్చే క్రమంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.కళ్యాణ మహోత్సవ నిర్వాహకులు కందుల కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగాయి.
Wedding.
సీతారాముల కళ్యాణాన్ని పేద పండితులు గణేష్ శర్మ నిర్వహిస్తున్న క్రమంలో భక్తులు గ్రామస్తులు మహిళలు భక్తిశ్రద్ధలతో తిలకించారు. సీతమ్మతల్లికి గత 12 సంవత్సరాలుగా 1 గ్రాము బంగారం చొప్పున పుస్తెలను తాళ్ల రవీందర్ బహుకరించారు. నూనె పూర్ణచందర్ రూ.15 వేలు విరాళం అందించగా మరో రూ.5 వేలు ఉప్పునూతల పుల్లాచారి అందజేశారు. అలాగే ఆవాల రవీందర్ రెడ్డి దంపతులు బంగారాన్ని బహూకరిస్తున్నట్లు తెలిపారు.
ఘనంగా అన్నదాన కార్యక్రమం..
Wedding.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన కక్కెర్ల మమత నరేష్ గౌడ్ దంపతులు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు టు పల్లాటి భవానికేశవరెడ్డి, ఆరేల్లి వీరేశం గౌడ్,నూనె రాములు,బొమ్మినేని సాంబారెడ్డి,బొమ్మినేని సుధాకర్ రెడ్డి, ఈర్ల నరేష్, కక్కెర్ల ఆనందం గౌడ్, కామెడీ మల్లారెడ్డి, పల్లాటి చిన్న సంజీవరెడ్డి,మాజీ ఉపసర్పంచ్ మొద్దు రాఘవులు,కందుల శ్రీనివాస్ గౌడ్,గడ్డమీద బిక్షపతి,సురేష్,ముంజ శరత్, కొమ్ముక శ్రీరామ్,ములుగు బిక్షపతి, కొమ్ముక అశోక్,కట్టయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ఇసుక రవాణాలో కొత్త పాలసీ శ్రీకారం చుట్టిన ఈ క్వారీలు.
అందుకే నో కాంటా,లోడింగ్ ,సీరియల్, వేబిల్ వద్ద వసూళ్లు.
లోడింగ్ వద్ద, వసూళ్ల సాక్షాలు చూపించిన నో యాక్షన్.
గుత్తేదారుకు గుమస్తాగా, మారిన మైనింగ్ సిబ్బంది అధికారి.
బొమ్మపూర్, ఎలేకేశ్వరం, ఇసుక రీచ్ లలో ప్రభుత్వ సాండ్ పాలసీ నిబంధనలు డోంట్ కేర్.
సమాచారం బయటకు పోక్క కుండా, ఈ క్వారీల్లో లోకల్ యువకులకు నో ఛాన్స్.
వసూళ్ల పర్వం, కొత్తరకం అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న, ఈ క్వారీలపై మైనింగ్ ఎండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొమ్మ పూర్ ఎలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న రెండు ఇసుక క్వారీలు, ప్రభుత్వ సాండ్ పాలసీకి విరుద్ధంగా ఒక కొత్త రకమైన అక్రమ ఇసుక రవాణా, వసూళ్ల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. లోడింగ్ వద్ద 300 రూపాయలు, సీరియల్ వద్ద 200, వే బిల్ వద్ద 300 వసూళ్లను కొనసాగిస్తుంది, లోడ్ అయిన ఇసుక లారీలు కాంటా చేయకుండా” రైట్” అని పంపిస్తుంది. మైనింగ్ అధికారులు సిబ్బంది అందరూ, కాంట్రాక్టర్ గుడిసెలో రెస్ట్ తీసుకుంటూ వ్యవహారం అంతా చూస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీలు అధికారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కి అ అమలు చేస్తున్నట్లుగా నటిస్తూ, ఒక కొత్త రకమైన ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టింది, “అదే ‘ఒక్క ఝాట్కా 1.25 కింటల్ ఇలా మట్కా”, వింటేనే విచిత్రంగా ఉంది కదా, కానీ ఎవరికి అర్థం కాకుండా, గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న, ఈ రెండు క్వారీల అక్రమ ఇసుక రవాణా భాగోతం ఇది.
ఒక్క “ఝాట్కా,1.25′ క్వింటాళ్ల మట్కా.
Policy on illegal
కొమ్మాపూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల్లో ” ఒక్క జట్కా1.25 క్వింటాళ్ల మట్కా, ఎవరు పసుగట్టని అక్రమ ఇసుక లోడింగ్ వ్యవహారం ఇది, ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీలు, సుమారు ప్రారంభం దశ నుండి 80 లారీల లోడింగ్ మొదలుకొని 175 భారీ ల వరకు రెండు క్వారీలు రోజుకు ఒక కారి లారీలను తమ ఖాతాలో ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది, మండలంలో గత మూడు నెలల్లో 13 ఇసుక క్వారీలు కొనసాగగా, సోమవారం నాటికి 9 ఇసుక క్వారీలు ఇసుక రవాణా కొనసాగిస్తున్నాయి, వీటన్నిటిలో ఈ రెండు క్వారీలు ప్రారంభం దశ నుండి పెద్ద మొత్తంలో ఇసుక రవాణా సోమవారం నాటికి ఇలికేశ్వరం క్వారీలో 239 లారీలు, బొమ్మ పూర్ క్వారీలో 102 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది, ఇక “ఝాట్కా” విషయానికొస్తే లారీల సైజులను బట్టి 26 టన్నుల నుండి 36 తన వరకు, ఇసుక తీసుకువెళ్లే కెపాసిటీ కలిగి ఉంటాయి, లోడింగ్ పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన పొక్లెన్ బకెట్లో మూడు టన్నుల ఇసుక తోడడం జరుగుతుంది, అదేవిధంగా పెద్ద బకెట్ సైజులో ఐదు టన్నుల ఇసుకను తోడడం జరుగుతుంది, ప్రస్తుతం ఈ రెండు క్వారీల్లో చిన్న సైజు బకెట్లను ఉపయోగిస్తూ లారీల్లో ఇసుక నింపడం జరుగుతుంది. చివరి బకెట్లో నింపే క్రమంలో ఆపరేటర్ ఒక్క జట్కాను ఇవ్వడంతో, చివరి బకెట్ నుండి సుమారు ఒక టన్ను 25 క్వింటాళ్ల ఇసుక లారీలో రావడం జరుగుతుంది. చిన్న పెద్ద లారీల కెపాసిటీ కు మించి ఒక్క అదనపు బకెట్లో ని ఒక్క భాగం ఇసుక నింపడం జరుగుతుంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లతోపాటు, టీఎస్ ఎంబీసీ అధికారులకు సిబ్బందికి, జట్కా విషయం తెలవడంతో, లారీలకు కాంట చేయకుండా, వే బిల్ రెడీ అయిపోయి, డ్రైవర్ లేదా క్లీనర్ కు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు జట్కా పేరుతో వందల టన్నుల ఇసుక అక్రమంగా రవాణా కావడం జరుగుతుంది.
లోడింగ్ వద్ద వసూళ్ల సాక్షాలు చూపించిన నో యాక్షన్.
ఈ రెండు ఇసుక క్వారీలో అంతుచిక్కని అక్రమాలు చేపడుతూ, వసూళ్ల పర్వం అక్రమ ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ పోక్లైన్ లో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న సాక్షాలు చూపెట్టిన, లోడింగ్ చేసుకున్న డ్రైవర్లు తమ వద్ద ఎనిమిది వందల రూపాయలను చేయడం జరుగుతుంది, అన్న సాక్షాలను కూడా తెలిపినప్పటికీ, మైనింగ్ అధికారులు ఈ రెండు ఇసుక క్వారీలపై కనీసం కన్నెత్తి చూడని దౌర్భాగ్యం పరిస్థితి, నువ్వంటే ఈ రెండు ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు మైనింగ్ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ, వాటాదారులుగా మారారు అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు. లోడింగ్ పాయింట్ వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది లేకుండా, రాత్రి వరకు లోడింగ్ కొనసాగించడం, ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది తర్వాత కూడా లోడింగ్ కొనసాగడం, కాంటా చేయకుండానే వేబిల్ అందించడం, లోడింగ్ వద్ద చట్కా బకెట్ చివరికి ఎందుకు రియాల్సి వస్తుంది అన్న విషయం, మైనింగ్ అధికారులకు తెలవకుండానే కొనసాగుతుందా, అదనపు బకెట్ల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో, మైనింగ్ అధికారులతో కాంట్రాక్టర్లు మూలకాతై, టిఎస్ఎండిసి సిబ్బంది అధికారులను కాంట్రాక్టర్లు గుభస్తాలుగా మార్చుకొని, ఎనలేని అక్రమ వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టి, చట్కా తో అదనపు ఇసుకను లారీల్లో నింపి సొమ్ము చేసుకుంటూ, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కడం జరుగుతుంది.
వసూళ్ల పర్వం, కొత్తరకం అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న, ఈ క్వారీలపై మైనింగ్ ఎండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇసుక క్వారీలో అంతర్గత వ్యవహారాలను బయటకు పొక్కకుండా, అక్రమ ఇసుక రవాణా వ్యవహారం వసూళ్ల పర్వం, కాంట్రాక్టర్ ల వరకే పరిమితంగా ఉండాలని ఈ రెండు ఇసుక క్వారీలో, సూపర్వైజర్లుగా పనిచేసే యువకులు అంతా, ఇతర ప్రాంతాలకు అలాగే కాంట్రాక్టర్ లా సంబంధించిన వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థానిక యువకులకు సూపర్వైజర్ అవకాశం కల్పించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు చెప్పిన యజమాన్యం డోంట్ కేర్ అని క్వారీలో నీటికి ఉపాధి కొరకు అవకాశం ఇవ్వక పోవడానికి ప్రధాన కారణం ఇదే, మండలంలో వందల సంఖ్యలో లారీలో ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలు సాండ్ పాలసీకు విరుద్ధంగా, “ఝాట్కా” పేరుతో అక్రమ ఇసుక రవాణా దర్జాగా వసూళ్లను చేస్తున్నప్పటికీ, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు కూడా ఈ రెండు ఇసుక క్వారీలకు పరోక్షంగా సహకరించడం జరుగుతుంది. మైనింగ్ శాఖ టీఎస్ఎండిసి ఉన్నత అధికారులు తక్షణమే ఈ రెండు ఇసుక క్వారీలపై అలాగే సిబ్బంది అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఐజేయూ అనుబంధ టియుడబ్ల్యూజే తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ అన్నారు.సోమవారం పరకాలలో టీయూడబ్ల్యూజేే హనుమకొండ జిల్లా యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
TUWJ.
ఈ సందర్భంగా గడ్డం రాజిరెడ్డి,తోట సుధాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమే నని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు,హెల్త్ కార్డులు,ఇండ్ల స్థలాలు సాధించి పెట్టిన ఘనత ఈ సంఘానికే ఉందన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరంతో సహా మండల కేంద్రాలలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు,ఇండ్లు సాధించేందుకు పోరాడుతామన్నారు.రాష్ట్రంలో వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సమస్యల సాధనకై జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యూజేే నిలుస్తుందని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల జారీ, ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అమలుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు.ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న యూనియన్ పై జర్నలిస్టులకు ఎంతో విశ్వాసం ఉందని,ప్రతి జర్నలిస్టు ఐజేయూ లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం, జిల్లా సహాయ కార్యదర్శి గన్ను సంతోష్, కార్యవర్గ సభ్యులు గడ్డం బాలరాజు,అల్లె రామారావు,ముదిగిరి ఓదెలు, తాళ్ల రవి, నాయకులు బొజ్జం శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్, పాషా, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.
ఎస్సి సేల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పథకాలు, ఓర్వలేక సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కనులకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి చేస్తున్న విమర్శలకు సోమవారం రోజున అయన స్పందించి మాట్లాడుతూ. గత పాలకులు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూడు కోట్ల పదిలక్షల మందికి సన్న బియ్యం జరుగుతుంది నిజం కదా. సుమారు 82శాతం మందికి లబ్ది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, సుమారు 150 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని. రైతులకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ రైతుబంధు జరిగింది. యువకులకు 57,వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో యువతకు అందించారాని. పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి, పేద ప్రజలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం అమలు అవుతుందని ప్రతిపక్షాలకు ఈ పథకాల అవపడుతలేవ. నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తుందనడంలో. ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో. నేటి యువత. స్వాతంత్ర ఉద్యమం చరిత్ర, రాజ్యాంగం యొక్క చరిత్ర,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవడం అవసరం ఉందని, ఈరోజు జై బాపు జై భీమ్ జై సమిదాన్ కార్యక్రమం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆదేశాల మేరకు గత నాలుగు రోజులు మొగుళ్లపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి లకు తగిన గుణపాఠం చెపుతామని ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్ అన్నారు. పాల్గొని పై విధంగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.
కల్వకుర్తి/నేటి దాత్రి:
కల్వకుర్తి నియోజక వర్గంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెంది ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఉదయం శ్రీను భార్యను పిల్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటికి పిలిపించుకుని మీకు మేము పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు అదర్యపడొద్దని భరోసా ఇచ్చి అపద్ధర్మం కింద కొంత రూ. 2 లక్షల ఆర్థిక సహాయ అందించారు . తన పిల్లల మంచి భవిష్యత్తు పై చదువులకోసం సహాకారం చేస్తా అన్నారు శ్రీను తనకోసం చాలా కష్టపడి పనిచేశాడు గుర్తుకు చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని కుటుంబ సభ్యులను భరోసానిచ్చారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల రాళ్ల వర్షలతో పంట పొలాలను అతలాకుతలం చేసి రైతులను రోడ్డున పడే పరిస్థితి తెచ్చిన ప్రకృతి… దెబ్బతిన్న పంట పొలాలను చూసి రైతుల కష్టాలను వారి బాధలను దగ్గరగా చూసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.ధనసరి సీతక్క తక్షణమే అకాల వర్షాలతో రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న వరి పొలాలను వ్యవసాయ శాఖ చేత పరిశీలన చేసి నష్టపరిహారం వచ్చే విదంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పిన మాట ప్రకారం కొత్తగూడ మండలంలోని జంగంవాని గూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి వినోద్ ఆధ్వర్యంలో సోమవారం రోజు అకాల వర్షాలు రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు… అకాల వర్షాలు రాళ్లవానతో వరి పంట మొక్కజొన్న దెబ్బతిన్న రైతులు వారి వారి ఆధార్ కార్డులు బ్యాంకు వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి పంట పొలాలను సర్వే చేపించారు..పంట నష్టపోయిన రైతులందరు వారి వివరాలు ఇచ్చి నష్టపరిహారం పొందగలరని అని ఆయన అన్నారు…
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.
నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.
రేషన్ డీలర్లు సన్న బియ్యం లో దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్
తహసిల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలి
వనపర్తి నేటిదాత్రి :వనపర్తి
జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు ప్రజలు ఫిర్యాదులు వస్తే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. తాసిల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని, దాన్ని కొనుగోలు కేంద్రాలను కూడా తహసిల్దారులు సందర్శించి పర్యవేక్షణ ఉంచాలన్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఎంక్వయిరీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో తల్లి జ్ఞాపకార్ధంగా పేదల దహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు వివరాల్లోకి వెళితే పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృంగి పోయిన ఆ కుటుంబం తల్లి జ్ఞాపకాలు, మధురస్మృతులు మర్చిపోలేని చిట్టి రెడ్డి విజయ్, అజయ్ ఇద్దరు కుమారులు గ్రామంలో తన తల్లి పేరున సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు ఆటోవాలకి, కూలీలకు, ప్రయాణికులు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ మాట్లాడుతూ మాతల్లి పేరు సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని పేదల పిల్లల చదువు,గ్రామ అభివృద్ధి లో,చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు నేను పుట్టిన ఊరు నా కన్న తల్లి తో సమానం అని నా ఊరు రుణం తీర్చుకోవడంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గజ్జి ఐలయ్య,చిట్టి రెడ్డి జంగా రెడ్డి,చల్లరాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, గుర్రం రమేష్, జలంధర్ రెడ్డి, ఉమ్మడి రమేష్, భద్రయ్య నాలుక వెంకటేష్, సురేందర్, అంకెశ్వర మొగిలి, బోయిన అశోక్ బోయిన ఓదెలు బోయిని పైడి, బగ్గి పైడి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలులకు ఆర్డర్ కాపీలు అందజేసిన సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్.
* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట బోయినిపల్లె తంగళ్ళపల్లి, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలకి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీత రావు, ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేసినవారికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది ఇల్లంతకుంట మండల అధ్యక్షురాలుగా జ్యోతి గారిని, బోయిన్ పల్లి మండల అధ్యక్షురాలుగా రాజలక్ష్మి గారిని, తంగళ్ళపల్లి మండల అధ్యక్షురాలుగా హారిక రెడ్డిని, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలుగా వనిత బ్లాక్ కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా సామల రోజా, జిల్లా సెక్రెటరిగా సరితరెడ్డి,
Congress President.
జిల్లాకాంగ్రెస్ కార్యలయంలోఈరోజు ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం సభ్యత్వ నమోదులో లక్షకు పైచిలుకు సభ్యత్వాలు చేసి ముందంజలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు మహిళలందరూ కూడా ముందుండి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహిళ సాధికారత కోసం కృషి మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే క్రమంలో మహిళలకు అందరికీ సమైక్య సంఘాల నుండి బస్సులు కొనుగోలు చేసి మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి 200 యూనిట్ల కరెంటు ఉచితం ఆరోగ్యశ్రీ , నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలోamc చైర్మన్ వెలుముల స్వరూప జిల్లా మహిళ కాంగ్రెస్ సినియర్ నాయకరాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, సుధా, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి తంగళ్ళపల్లె మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్( టోని) మరియు సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ యువనా యకుడు తీన్మార్ జయ్ చేప డుతున్నటువంటి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వడం కోసం వాటర్ ప్లాంట్ గ్రామయువకుల,పెద్దమనుషుల సమక్షంలో భూమిపూజ చేయడం జరిగింది ఊరికి ఉచితంగా సేవచేయడంకోసం వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగు తుంది వాటర్ ప్లాంట్ అయ్యే దాకా గ్రామ ప్రజలు యువకు లు, పెద్దమనుషులు ముఖ్యం గా మహిళలు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడమైనది.వాటర్ ప్లాంట్ కట్టడం కోసం ఊరి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న వారు గ్రామంలో పెద్దవారు అయినా వారు ఎవ్వరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి విరాళం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు పెద్దమనుషులు తీన్మార్ జయ్ సదర్ లాల్ భాస్కర్ కిరణ్ కుమార్ స్వామి వేముల రమేష్ రతన్ గణేష్ అమిత్ సునీల్ కృష్ణ జితేందర్ రాకేష్ లక్ష్మణ్ నవీన్ రవీందర్ రెడ్డి నాయక్ అజయ్ తది తరులు పాల్గొన్నారు.
— ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది • కొనుగోలు కేంద్రం ప్రారంచిన ఎమ్మెల్యే
నిజాంపేట: నేటి ధాత్రి
రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే దిక్కు లేడనీ నేడు కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు సన్న బియ్యం తో పాటు ముందుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్” స్కూల్ ప్రారంభించుకోవడం కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గల్లి గల్లికి సిసి రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ హేనని కొనియాడారు. అందరి సహకారంతో మండల కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, మండల ఇన్చార్జి ఎమ్మార్వో రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, నజురుద్దీన్, పంజా మహేందర్, లింగం గౌడ్, అమర సెనరెడ్డి, సిద్దారములు, గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ , వెంకట్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
వివరాల్లోకి వెళితే రాజీవ్ నగర్ లో గత కొన్ని ఏళ్లుగా పైప్ లైన్ విదులు నిర్వహిస్తున్న కాదాసు దేవయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
Distributed rice.
అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన గాజుల ప్రకాష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతు పది రోజుల క్రితం మృతి చెందాడు.ఇరు కుటుంబాలని పరామర్శించిన వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం గారు ఇరు కుటుంబాల కు 50 kg చొప్పున బియ్యం పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పచ్చునూరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు తీగల ప్రవీణ్, పార్టీ నాయకులు గొరిట్యాల శ్రీకాంత్,సట్కూరి చిట్టిబాబు, నక్క సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
*ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు. చందానగర్ సర్కిల్ రెవెన్యూ అధికారుల నిర్వాకం బాగోతం*.
శేర్లింగంపల్లి, నేటి ధాత్రి:
శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ సర్కిల్(21) లో జిహెచ్ఎంసి అధికారుల లీలలు.
సరైన పత్రాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు.
విషయం పై అధికారులకు చేరడంతో విచారణకు ఆదేశించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి.
విచారణలో అధికారులు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ.
చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు ఏఎంసీ,టాక్స్ ఇన్స్పెక్టర్ మరియు బిల్ కలెక్టర్ లకు మెమోలు జారీ చేసిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.