దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్.

రేషన్ డీలర్లు సన్న బియ్యం లో దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్

తహసిల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలి

వనపర్తి నేటిదాత్రి :వనపర్తి

 

 

జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు ప్రజలు ఫిర్యాదులు వస్తే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. తాసిల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని, దాన్ని కొనుగోలు కేంద్రాలను కూడా తహసిల్దారులు సందర్శించి పర్యవేక్షణ ఉంచాలన్నారు.
అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఎంక్వయిరీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈసమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version