కరెంటు కష్టాల నుండి కాపాడండి.

కరెంటు కష్టాల నుండి కాపాడండి.

ఆమనగల్లు/నేటి దాత్రి:

 

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్ మండలంలో ఆకాశంలో వర్షపు మబ్బులు కనబడితే మన ఆమనగలులో కరెంటు కష్టాలు…. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి గాలిలో వచ్చినయ్ కానీ రెప్పపాటు లో కూడా కరెంటు పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కరెంటు ఎందుకు పోతుంది అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ పత్య నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది BRS ప్రభుత్వం లొ కరెంటు పోతే వార్త ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కరెంటు వస్తే వార్తా అవుతుంది ఇప్పటికైనా మేల్కొని రైతులకు న్యాయమైన 24 గంటల వ్యాపారస్తులకు మరియు గృహస్థులకు మీ డిపార్ట్మెంటు ఏ విధంగా కరెంటు బిల్లు వసూలు చేస్తుందో అదేవిధంగా తమరు కూడా వినియోగదారులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ఆగ్రహాన్ని రాబోయే రోజులలో తమరు చూడాల్సి వస్తుందనిBRS పార్టీ సీనియర్ నాయకులు పత్య నాయక్ ప్రభుత్వనీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ సోనా శ్రీనునాయక్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, మాజీ కౌన్సిలర్ రాధమ్మ, వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రమేష్ నాయక్, సైదుల్ గౌడ్, మల్యా నాయక్, కృష్ణవేణి నాయక్, శ్రీకాంత్ నాయక్, భాస్కర్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

దయచేసి అధికారులు విలేకరులు పట్టించుకోండి

వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు పోస్ట్ లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.

నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version