నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

దయచేసి అధికారులు విలేకరులు పట్టించుకోండి

వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు పోస్ట్ లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.

నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version