లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

అన్ని పేద అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

గతంలో డబుల్ బెడ్రమ్ ఇండ్లు కేటాయింపులో 50 వేలు తీసుకున్నారు,

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడమే, లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద బడుగు బలహీన వర్గాల కు సొంతింటి కల నెరవేర్చుటకు శ్రీకారం చుట్టి, స్థానిక వ్యక్తులచే కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణ తో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేడు కమిటీలు అందించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు వారి నిర్ణయం శభాష్ అనిపించేలా అందించడం జరిగింది అని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కావడం, ప్రభుత్వ అధికారులు ఇండ్ల మంజూరి కై నిష్పక్షంగా సర్వే నిర్వహించడం, అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం వంద శాతం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నియామక కమిటీ, అధికారుల జాబితా నుండి అర్హులకు ఎంపిక చేయడం తో లబ్ధిదారుల, ఆనందానికి అంతులేకుండా పోయింది. మండలంలో 321 ఇండ్లను మంజూరు చేయగా, ప్రభుత్వ ఆదేశాల అనుసారం గూడు లేని నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా ఇంటింటికి అధికారుల సర్వే, కుటుంబాల వివరాలు నేరుగా అధికారులు పరిశీలించి నమోదు చేయడం జరిగింది.తిరిగి ఇందిరమ్మ గృహాల మంజూరు కమిటీలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నిర్ణయం మండలంలోని అన్ని వర్గాలకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అనర్హులకు చెందకుండా పటిష్టమైన విచారణ,విధి విధానాలతో, ముందుకు సాగడమే కమిటీ లక్ష్యంగా, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి కల త్వరలో ఆ పేద కుటుంబాలకు తీరనుంది.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

ఇందిరమ్మ సొంతింటి కల నిర్మాణంపై స్థానిక కమిటీల ఎంపిక 100% నిరుపేద గూడు లేని అర్హులకు కేటాయించడం జరిగిందని లబ్ధిదారులు చెప్తున్నప్పటికీ, నిరుపేద కుటుంబాల గూడును కొల్లగొట్టే ప్రయత్నంలో, కమిటీల పై కక్ష సాధింపు చర్యగా, దుష్ప్రచారాలు చేయడానికి లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కమిటీల ఎంపిక అధికారుల జాబితాలోని అర్హులకు ఎంపిక చేయడం జరిగిందని, లబ్ధిదారులు చెప్తున్న క్రమంలో, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై, బురద జల్లి పబ్బం గడుపుకోవాలని కొందరు, లబ్ధిదారుల ఎంపికను తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో 321 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లబ్ధిదారుల ఎంపికై అధికారుల సర్వే ఆధారంగా,,ఇంద్రమ్మ ఇండ్ల కమేటి, నిష్పక్ష పర్యవేక్షణతో లబ్ధిదారుల పేర్లను అందించడం జరిగింది, గతంలో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో పేరుతో 50వేల రూపాయలు తీసుకొని, అర్హులకు కాకుండా ధనవంతులకు కేటాయించడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు స్థానికుల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్ల మంజూరుకు ప్రతిపాదించడం జరిగిందని,కానీ స్వలాభాల కోసం నిరుపేద గూడు లేని కుటుంబాలకు ఇల్లు లేకుండా చేసే ప్రయత్నం జరగడంతో, లబ్ధిదారులు తమ ఇండ్లు ఏక్కడ కోలిపోతామని ఆవేదనతో, ప్రభుత్వం మరియు రాష్ట్ర మంత్రివర్యులు మేము పేద అర్హులము మాపై కరుణించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

పది సంవత్సరాలపాటు డబుల్ బెడ్ రూమ్ కొరకు తమ కండ్లు కాయలు కాసి వేల దరఖాస్తులను ఇవ్వడం జరిగింది కానీ, అర్హులుగా ఉన్న పేదలకు గూడు లేకుండా డబుల్ బెడ్ రూమ్ పేరుతో వేల రూపాయలు వసూలు చేసి ధనవంతులకు కేటాయించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో స్థానికుల పర్యవేక్షణలో అధికారులు అందించిన జాబితాల ఆధారంగా 100% అర్హులుగా ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ కలగాలనే మిగిలిన, ఆ గూడు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి భరోసా కలిగించడం, సంవత్సరాల తరబడి జెండా వాననక పెంకుటిల్లు గుడిసెల్లో తమ పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తున్న మాకు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ప్రభుత్వం ఆదుకోవడం, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు చెప్తున్నారు.

తన నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

ఆ అర్హులు గూడు లేని నిరుపేదవారు, కూలి నాలి చేసుకోవడంతో పాటు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా, మండలంలో లబ్ధిదారుల జాబితాలో నిరుపేద లబ్ధిదారులు అయినప్పటికీ, సుమారు 50 సంవత్సరాలుగా వ్యవసాయ కూలీతోపాటు కాంగ్రెస్ జెండా నెత్తిన మోయడం, తమకు ప్రభుత్వ పథకం అనర్హుడుగా చేస్తుందా, తమ ఇంటిపై పెంకలు లేకున్నా పరవాలేదు, వర్షాకాలం ప్లాస్టిక్ కవర్ లేకున్నా పరవాలేదు, కానీ తమ లక్ష్యం గాంధీభవన్ పై జెండా ఎగరడంతోపాటు తమ ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు జెండా సంవత్సరాల కాలం పాటు తగిలి ఉండాల్సిందే, అనే ఏకైక లక్ష్యంతో ఉన్న ఆ నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త వంద శాతం అర్హుడే కదా, పేద వ్యవసాయ కూలీ మా కుటుంబాన్ని పోషిస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా నా హృదయంలో ప్రాణం పోస్తుంది, అని పేద లబ్ధిదారులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తో వారి పేర్లు తలుచుకుంటూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో, విషపచారాలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ప్రజలు ఎవరైనా, ఏ పార్టీ అభిమాని అయిన ప్రభుత్వ పథకాలకు, పార్టీలను ప్రేమించే కార్యకర్తలకు పథకం వర్తించదని, రాజ్యాంగం లో ఏమైనా రాసి ఉందా, కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, వ్యవహారించడం జరుగుతుందని, లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే, లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పొంతన లేని మాటలతో దుష్ప్రచారాలు చేయడాన్ని లబ్ధిదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మండలంలో ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు కమిటీల పర్యవేక్షణ అనంతరం లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి లిస్టును అందించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక విషయంపై, ప్రభుత్వ ఆదేశాల అనుసారం అర్హులుగా అధికారులు గుర్తించి తిరిగి ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పర్యవేక్షణలో నిష్పక్షంగా ఎంపిక ప్రక్రియ జరిగినప్పటికీ, అమాయకులను రెచ్చగొట్టి, వారి పేర్లు నమోదు చేయలేదని, కమిటీలపై బురద జల్లుతూ, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, మండలంలోని కమిటీ సభ్యులపై అసభ్యకర పదజాలాలతో, అవమానించేలా ప్రయత్నించడం, సమాచార సాంకేతిక మాధ్యమాల్లో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, స్వలాభం కోసం అమాయకులను ప్రభుత్వ పథకం నుండి మిక్ కావాలని దూరం చేశారని రెచ్చగొడుతూ, దౌర్జన్యానికి దిగేలా ప్రోత్సహించడం, ల్యాండ్ అడర్ ను విఘాతం కలిగించే, విధంగా ప్రవర్తించడం జరుగుతుందని, లబ్ధిదారులు చెప్పుకొస్తున్నారు, జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ ఉన్నత అధికారులు, ఇలాంటి వారిపై దృష్టి సాధించి, శాంతి భద్రతకు భంగం కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలు అలాగే లబ్ధిదారులు కోరుతున్నారు.

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి !

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను.!

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

 

 

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

హరిత సేన నియోజకవర్గం మండల కమిటీల నియామకం.

హరిత సేన నియోజకవర్గం, మండల కమిటీల నియామకం

గంగాధర నేటిధాత్రి:

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు.

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల జాగృతి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మాట్లాడుతూ మండలంలో పట్టణంలో తెలంగాణ జాగృతి కమిటీ లను వేశామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అభినందిస్తూ అలాగే రాబోయే ఎన్నికల్లో బీసీలకు అన్ని సంక్షేమ పథకాల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి గాని ఎంపిటిసి గాని సర్పంచ్ గాని ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలని ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ అమలు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవితక్క గారు బీసీల గురించి మండల సభల్లో ఎన్నోసార్లు బీసీల గురించి స్థానికంగా ప్రసంగించారని తెలంగాణ జాగృతి ని రాష్ట్రంలో అన్ని వర్గాలకు అనుకూలంగా ప్రయోజనం పొందేలా ఎమ్మెల్సీ కవితక్క ఎప్పటినుండో పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ముందు రోజుల్లో అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే తెలంగాణ జాగృతి తంగళ్ళపల్లి మండలం యువజన కార్యదర్శిగా అనిల్ గౌడ్ ను తంగళ్ళపల్లి తెలంగాణ జాగృతి పట్టణ అధ్యక్షులుగా విబి రంగమును ఉపాధ్యక్షులుగా భానుమూర్తిని నియమించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగత్.వెంగళ రమేష్ పసుల దుర్గయ్య మనోహర్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version